COVID-19 భారతదేశం అంతటా వ్యాపించడంతో, చమురు, గనుల పరిశ్రమలను నియంత్రించే కీలక పర్యావరణ భద్రతా నిబంధనలను పలుచన చేయడానికి గని త్రవ్వకాల- చమురు సంస్థ వేదాంత కంపెనీ చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. అదానీ అవకతవకలపై హిండెన్బర్గ్ రిపోర్టుకు మద్దతుగా ఓ తాజా నివేదికను తెచ్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసిసిఆర్పి) కరోనా సమయంలో వేదాంత గ్రూప్ జరిపిన రహస్య లాబీయింగ్, దానికి పర్యావరణ చట్టాల్లో కేంద్రం చేసిన సవరణలపై మరో రిపోర్టును ఇచ్చింది. ఓసిసిఆర్పి నివేదిక ముఖ్యాంశాలు: - కోవిడ్ సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను