మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు జ్యోతిశ్యం చెప్పారు నమ్మకంగా. అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు. ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట