సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో
సాహిత్యం కవిత్వం

మరణం అతనిదేనా….

  ప్రేమను వ్యక్త పరిచే   మానవులు వున్న నేలపైనుండి   ఒకానొక మనిషి   దారి చేసుకుంటూ తరలిపోయాడు.   పంజరాన్ని ధ్వంసం చేసి   పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-   దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి   భూమి ఆలింగనంలో   కంటి పాపను దాచుకున్నాడు    జాబిలి వైపు చిరునవ్వు విసిరి    అంధకారపు ఆకాశంలోకి     నక్షత్ర వల విసిరి     నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు     మరణం అతనిదేనా     ఒక కలను మోసిన వారందరిది     ఆకలి
కాలమ్స్ కొత్త కవిత్వం

తూర్పు ముఖం

తెలుగు కవిత్వంలో దీర్ఘకవితలకు ప్రత్యేకత వున్నది.వస్తువును విస్తృతo చేయడానికి కవి ఎంచుకున్న కవితా మార్గం. నగ్నముని కొయ్యగుర్రం , శివారెడ్డి ఆస్ఫత్రి గీతం , వరవర రావు సముద్రం,   ఎన్.కె.లాల్ బనో గులామి  చోడో వంటి దీర్ఘ కవితలు భారత సమాజాన్ని అర్ధం చేసుకొని  ధిక్కార స్వరాన్ని నమోదు చేసినాయి. క‌ళ్యాణ‌రావు #, కాలం*, కాశీం మానాల‌, గుత్తికొండ వంటి దీర్ఘ‌క‌విత‌లు చ‌రిత్ర‌ను, విప్ల‌వోద్య‌మ చ‌రిత్ర‌ను న‌మోదు చేశాయి.    వీరంద‌రూ దీర్ఘ కవితల పరంపరకు ప్రగతి శీల దారులు  వేశారు.  ఛాయారాజ్  వంటి విప్లవ కవులు దీర్ఘ కవితా ప్రక్రియలో రాయడానికి ఉత్సుకతను ,అభినివేశాన్ని కనబరిచే వారు
కాలమ్స్ కొత్త కవిత్వం

అనేక అస్థిత్వాల కలనేత యాలై పూడ్చింది

కవిత్వం గురించి మాట్లాడుతున్నాప్పుడు ఇటివల చదివిన  కవితా సంపుటులు జ్నాపకమౌతున్నాయి.అజంతా స్వప్న లిపి .పల్లె పట్టు నాగరాజు యాలై పూడ్చింది. .జీవిత కాలమంతా నలభై కవితలను రాసి కవిత్వ స్వప్నలిపిని  వదిలివెళ్లిన అజంతా ,వర్తమాన కాలంలో నిలబడి కవితా రచనలో వున్న పల్లి పట్టు నాగరాజు. అసలు వీరిద్దరి భాధ ఏమిటి?. వీరి మధ్య సారూప్యత ఏమిటి? అజంతా  కవితా రచన స్థల ,కాలాలు  వేరు .నాగరాజు కవిగా కొనసాగుతున్న కాల సoధర్భం వేరు. కవి వీరిద్ద‌రి  ప్రపంచం, దాని మనుగడ ఒకే స్తితిలో ఉన్నాయా?  అజంతా కవిత్వంలో అంతర్ముఖీనత ఉండవచ్చు. ఆ లోపలి  చూపు సామాజిక శకల౦తో  ముడి
కాలమ్స్ కొత్త కవిత్వం

మానవుడే కవితా వస్తువు

ఆధునిక కవిత్వ  రచన దానియొక్క  రూప పరమైన  శిల్ప పరమైన చర్చ  చేసే టప్పుడు రెండు ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి.కవి  హఠాత్తుగా ఊడిపడిన సృజన కారుడు కాదు .తన అస్థిత్వం ,భౌగోళిక  స్థితి గతులు  తన అనుభవ౦ . రెండవది తన భావ జాలం. వీటిపై ఆధార పడిన ప్రాపంచిక  దృక్పధ ౦. కవిత్వ౦ మానవుని అంతర్ బహిర్ యుద్ధారావం  అనుకుంటే ,అంతిమంగా మానవుడు ,  మానవుని  అస్థిత్వం ప్రధాన భూమిక వహిస్తాయి. రాజకీయ భావజాలం వుండట మనేది కవి యొక్క చైతన్యం పై ఆధార పడి వుంటుంది . రాజకీయ పరమైన అంశాలు  కవిత్వంగా  ఎలా మలచ
కాలమ్స్ కొత్త కవిత్వం

కవిత్వం – వస్తు రూప విశ్లేషణ

కాలంతో పాటు కవితా రచన ప్రయాణం చేస్తున్నదా, లేదా కవిత్వం మానవ వ్యక్తీకరణను నమోదు చేయడంలో తడబడుతున్నదా. నిజానికి కవులు అక్షరాస్యులేనా? వర్తమానంలో నిలబడి కవిత్వం రాస్తున్నవారు పునాది అంశాలను తడుముతున్నారా? ఇవన్నీ కవితా రచనను లోతుగా గమనిస్తున్న వారికి ఎదురయ్యే సందేహాలు. కాలంతో పాటు మానవ జీవితంలో అనేక సంక్లిష్టతలు వచ్చి చేరాయి.పాలక వర్గం ప్రచారం చేస్తున్నట్లు నూత్న అభివృద్ధి నమూనాలో మానవుడి పరిమితులు విశాలత్వం మధ్య సంఘర్షణ వున్నది. అందివచ్చిన అవకాశాలు జీవితంలో వుండే సుఖలాలస కవితా సృజనలో వ్యక్తమవుతుంది. సృజనాత్మక తలంపై కవి జీవితంలోని ఘర్షణను అనువదించుకోకపోతే కళాత్మక వ్యక్తీకరణకు పరిమితి ఏర్పడుతుంది.రచనకు ,