లోచూపు కాలమ్స్

సమకాలీన అంబేద్కర్ వాదులు-సంక్షోభం,సవాళ్ళు – ఒక చర్చ

గతంలో కంటే భిన్నంగా అంబేద్కర్ కృషి, ఆలోచనల ప్రాసంగికతను నానాటికి విస్తరిస్తోన్న  ప్రజాపోరాట శక్తులు మరెప్పటి కంటే ఎక్కువగా ఇటీవలి కాలంలో గుర్తిస్తూ ఉండడమే పాలకవర్గాల రాజకీయ వ్యూహంలోని మార్పుకు ప్రధాన కారణం. గతంలో చాలాకాలం అంబేద్కర్ ను  గుర్తించకుండా నిరాకరించడం లోనూ, నేడు ఎంతో గుర్తించినట్లు కనబడుతూ ఆరాధించడం లోనూ ఆయన మూల తాత్వికతను ప్రజలు గ్రహించకుండా చేయడమనే  పాలకవర్గాల కుటిలత్వమే దాగి  ఉన్నది.     ముఖ్యంగా  సమకాలీన సమాజంలో చాలామంది అంబేద్కర్ వాదులు కూడా అంబేద్కర్ మూల తాత్వికతను గ్రహించకుండా వారు నిర్వహిస్తున్న సామాజిక, రాజకీయ పాత్రను ఎత్తిచూపడానికి  2011 లోనే   ఆనంద్ తేల్ తుంబ్డే గారు
సాహిత్యం లోచూపు

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ
కాలమ్స్ లోచూపు

ప్రగతిశీల శ‌క్తుల ముందుకు చ‌ర్చా  ప‌త్రం

          “సంస్కృతి-మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం” అనే విర‌సం 28వ మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా పాణి రాసిన  కీనోట్ పేపర్  ఒక అవ‌స‌ర‌మైన  చ‌ర్చ‌లోకి  ప్ర‌గ‌తిశీల శ‌క్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది.  ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతీ నిర్మాణం గురించి ఆలోచించేవాళ్లంద‌రూ దీన్ని చ‌ద‌వాలి.  ఇందులోని విష‌యాల‌ను  ప‌ట్టించుకోవాలి. ఇందులో ప్ర‌తిపాదిస్తున్న‌విష‌యాల మంచి చెడ్డ‌ల‌ను ప‌రిశీలించ‌డానికి, వాటి శాస్త్రీయ‌త‌ను అంచ‌నా వేయ‌డానికి, వాటిని ముందుకు తీసికెళ్ల‌డానికి త‌ప్ప‌క  చ‌ద‌వాల్సిన పేప‌ర్ ఇది. సకల ప్రగతిశీల పోరాటాల సమన్వయానికి సాంస్కృతిక కోణం అవ‌స‌రం. దానికి సంబంధించిన అనేక  స‌ర‌ళ‌మైన ప్ర‌తిపాద‌న‌లు ఈ ప‌త్రంలో  ఉన్నాయి. కొన్ని ప్ర‌తిపాద‌ల‌న‌కు వివ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి.  సామాజిక ఉత్పత్తి
సాహిత్యం వ్యాసాలు

సంస్కృతి కోసం పోరాటాలు-వర్గపోరాటం

మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం. కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన
కాలమ్స్ లోచూపు

రాజ్యాంగం – ప్రొ. శేషయ్యగారి విమర్శనాత్మక హక్కుల దృక్పథం

గతంలో రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే దృక్పథం కొరవడినందువల్ల దాని పట్ల వ్యవహరించిన తీరు కొంత సమస్యాత్మకంగా, పరస్పర విరుద్ధంగా ఉండేది. కానీ తదనంతర కాలంలో ప్రజా పోరాటాలు విస్తృతమౌతున్న కొద్దీ, ముఖ్యంగా తెలుగు సమాజాలలో లోతైన చర్చలు, అంతర్మథనం జరిగి హక్కుల దృక్పథం తాత్వికంగా బలోపేతం అయ్యే దిశగా వికాసం చెందనారంభించింది. ఆ క్రమంలో భాగంగానే ప్రొ.శేషయ్య గారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలించా ‘రాజ్యాంగం-పౌరహక్కులు’ అనే ఈ  పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడంలో శేషయ్య గారి ప్రత్యేకమైన ముద్ర కనబడుతుంది. పౌర హక్కుల రంగానికి తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని రూపొందించుకునే క్రమంలో ఆయన పాత్ర ప్రముఖంగా పేర్కొనదగినది.
లోచూపు కాలమ్స్

కాషాయ ఫాసిజం ఒక విషపూరిత కషాయం

‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం  అశోక్ కుంబం గారు  రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం. భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ,  దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు
కాలమ్స్ లోచూపు

ప్రేమమయి, సాంస్కృతిక వారధి

(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి  నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.) ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని  విస్తృత సామాజిక సంబంధాలతో  కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు  వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో
కాలమ్స్ లోచూపు

జీవన పునరుత్పత్తి సౌందర్యాన్ని చాటి చెప్పే ‘లద్దాఫ్ని’ కథలు

తన మొదటి కథా  సంకలనమే ఇంత ప్రభావశీలంగా ఉండడానికి అసలు జీవితం పట్లనే  షాజహానా గారి దృక్పథానికి  లోతైన, బలమైన పునాదులు ఉండడమే ప్రధాన కారణం. తన జీవితానుభవాల్లోంచి మాత్రమే కాకుండా, తన లాంటి వివక్షితులైన  మైనార్టీ సమూహపు పీడిత  ముస్లిం ప్రజల జీవిత వాస్తవికతా సంపర్కంలోంచి ఏర్పడడం వల్ల ఆమె దృక్పథానికి ఎంతో శక్తి సమకూరింది. ఆ శక్తితో నవనవోన్మేషంగా, సాహసోపేతంగా జీవిస్తూ ఆమె సృజించిన కళాత్మక డాక్యుమెంటులే యీ 14 ‘లద్దాఫ్ని- ముస్లిం స్త్రీ కథలు’.  నిత్యం అణిచివేయబడి  ధ్వంసమవుతున్న జీవితాన్ని తిరిగి ప్రజలు ఎలా పునర్నిర్మించుకుంటారో ఆమె కథలు పాఠకులకు చక్కగా  దృశ్యమానం చేస్తాయి. పైగా,
సాహిత్యం సమీక్షలు లోచూపు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
వ్యాసాలు సమీక్షలు

కులం-బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ… కొన్ని ప్రశ్నలు, పరిమితులు

‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా  తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.        అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక