ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం వారి మునుపటి పాలన జ్ఞాపకాలను తాజా చేసింది. ఆ సమయంలో తాలిబాన్లు షరియాకి తమ సొంత పద్ధతిని, మహిళలపై భయంకరమైన అణచివేతను అమలు చేశారు. వారు పురుషులను కూడా విడిచిపెట్టలేదు. పురుషులకు ప్రత్యేక దుస్తులు, గడ్డం తప్పనిసరి చేసారు. బమియాన్లోని గౌతమ్ బుద్ధ భగవానుని పురావస్తు ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలను కూడా తాలిబాన్లు కూల్చివేశారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్లను భారతీయ ముస్లింలలో ఒక చిన్న విభాగం స్వాగతించింది. వారి దృష్టిలో ఇది విదేశీ ఆక్రమణదారులపై ఇస్లాం విజయం. ఈ పరిణామంతో చాలా మంది ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం