ఆహ్వానందండకారణ్యం శతృదేశమా?ఆదివాసుల మీద వైమానిక దాడులు ఎందుకు చేస్తున్నారు?చర్చా కార్యక్రమం21 మే, 2023 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకా మిత్రులారా చత్తీస్ఘడ్లోని ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా డ్రోన్లు, హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ దాడులు మొదట 2021 జూన్ 19న బీజాపూర్ జిల్లాలో బొట్టలంక, పాలగూడెం గ్రామాల మీద మానవ రహిత డ్రోన్లతో 12 బాంబులు వేయడంతో మొదలయ్యాయి. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 14, 15 తేదీల మధ్య రాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాల మధ్య ఉన్న బొట్టెంతోగె, మెట్టగూడెం, దులోడ్, సక్లెట్,