కరపత్రాలు

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో.. విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌ మిత్రులారా! మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు
కరపత్రాలు

మార్పు కోసం ప్రాణాలు బలిపెట్టక తప్పదనేఅమరుల సందేశాన్ని ఎత్తిపడదాం

కరపత్రంజీవితమంతా విప్లవమేఅమరుల బంధుమిత్రుల సంఘం ఎబిఎంఎస్ 21వ ఆవిర్భావ దినం సందర్భంగాఅక్రమ కేసులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా సభజూలై 18, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకుసుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌   కా. గంటి ప్రసాదం అమరుడై ఈ జూలై 4కు పదేళ్లు. 2013 జూలై 4న నెల్లూరిలో ప్రసాదాన్ని ప్రభుత్వ హంతక ముఠాలు హత్య చేశాయి. వేలాది మంది అమరుల స్ఫూర్తితో 20 ఏళ్ల కింద మొదలైన ఏబిఎంఎస్‌ ప్రసాదం త్యాగాన్ని గుండెలకు హత్తుకొని కన్నీటితోనే ఈ పదేళ్లుగా పని చేస్తున్నది. ఆయన మృత్యుముఖంలో ఉండి కూడా ‘వాళ్లు నన్ను చంపవచ్చు. నా స్పూర్తిని
పత్రికా ప్రకటనలు

కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?

అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా? అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో