మణిపూర్ – మత, కార్పొరేట్ మారణకాండ
“మేరా భారత్ మహాన్ ” ఎవరు కాదంటారు?”దేశం వెలిగిపోతుంది ”ఎవరు ప్రశ్నించగలరు?మనo మహోన్నత భారతీయ సంస్కృతీ పునరుద్దరించాం - మీరు లేదనగలరా? అవును, నాడు నాలుగోడలమధ్య నిండు సభ(నాటి పార్లమెంటు)లో ఒక మహిళను వివస్త్రను చేస్తుంటే హాహాకారాలు, ఆక్రందనలు లేకపోయినా, మౌననిరశన కనపడిండి. మరిప్పుడు మణిపూర్ లో నట్ట నడివీధిలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే అప్పటిలాగా కనీసం మౌనం రాజ్యమేలడం లేదు .హాహాకారాలు, ఆక్రందనల బదులు హాహాలు, శభాష్ లు, అదీ తోటి మహిళల నోటివెంట వినపడడం ఎంత పురోగతి? ఇక దేశం మోదీ పాలనలో విశ్వగురు స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే. హిట్లర్ ,ముస్సోలినీలకు మారుపేరైన మోదీ, మణిపూర్