వ్యాసాలు

మణిపూర్ – మత, కార్పొరేట్  మారణకాండ

“మేరా భారత్ మహాన్ ” ఎవరు కాదంటారు?”దేశం వెలిగిపోతుంది ”ఎవరు ప్రశ్నించగలరు?మనo మహోన్నత భారతీయ సంస్కృతీ పునరుద్దరించాం - మీరు లేదనగలరా? అవును, నాడు నాలుగోడలమధ్య నిండు సభ(నాటి పార్లమెంటు)లో ఒక మహిళను వివస్త్రను చేస్తుంటే హాహాకారాలు, ఆక్రందనలు లేకపోయినా, మౌననిరశన కనపడిండి.  మరిప్పుడు మణిపూర్ లో నట్ట నడివీధిలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే అప్పటిలాగా కనీసం మౌనం రాజ్యమేలడం లేదు .హాహాకారాలు, ఆక్రందనల బదులు హాహాలు, శభాష్ లు, అదీ తోటి మహిళల నోటివెంట వినపడడం ఎంత పురోగతి? ఇక దేశం మోదీ పాలనలో విశ్వగురు స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే. హిట్లర్ ,ముస్సోలినీలకు మారుపేరైన మోదీ, మణిపూర్
వ్యాసాలు

అప్పర్ భద్ర సరే.. రాయలసీమ ప్రాజెక్టుల మాటేమిటి ?

అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పై నేడు ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తెలియజేస్తున్న నిరసనలు “తానాడలేక మద్దెలవోడు అన్నట్లు” అనే  సామెతను గుర్తుకు తెస్తున్నాయి.  కె సి కాలువకు  కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకొనేoదుకై  గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రయత్నించకపోగా, 2015 లోనే దానికి వివరమైన ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను ఆ నాటి కృష్ణా బోర్డ్ కు సమర్పించినా, డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర జల కమీషన్ కు తెలిపిన ప్రబుద్ధులు    మన అధికారులు. అంతేకాదు, ఎన్నికల ఎత్తుగడలో భాగంగానైనా 2019 మార్చి లో   గుండ్రేవులకు చంద్రబాబు నిధులు కేటాయించారు. అయితే రద్దుల జగనన్న దాన్ని తుంగలో తొక్కాడు. దానిపై  స్పoదించిన
వ్యాసాలు

ఆదాన ప్రదానాల్లో భారత్

అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..
వ్యాసాలు

ప్రజలు, ఉద్యోగులు, పాలకులు 

శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో
సంభాషణ ఇంటర్వ్యూ

రాజకీయ చదరంగంలో ప్రజలే పావులు

అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని  కోస్తా ఆధిపత్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతి పక్షాలు  మద్దతు ఇస్తున్నాయి. దీనిని ఎట్లా చూడాలి? జవాబు: మేం ఆ డిమాండ్ ను అప్రజాస్వామికమైనదిగా పరిగణిస్తున్నాం. అయితే, గత ప్రభుత్వ ఆ నిర్ణయపు తప్పొప్పులకు అన్నీ రాజకీయ పార్టీలూ బాధ్యులే. అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆర్ పి పార్టీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.  అందువల్ల  ఆపార్టీ  గతంలో తాము అమరావతి రాజధాని ప్రతిపాదనకు మద్ధతునివ్వడం తప్పని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సంబంధిత ప్రజలను చర్చలకు పిలిచి సముచిత నష్టపరిహారం ఇవ్వాలి. రాజకీయ చదరంగంలో ప్రజలని, వారే పార్టీ వారైనా పావులను 
వ్యాసాలు ఓపెన్ పేజీ

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
కాలమ్స్ క్యా చల్రా .?

మూడు రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయం కాదు

 నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని  తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు... అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు. ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
వ్యాసాలు

ఆ త‌ల్లుల త్యాగాలు గుర్తున్నాయా?

చరిత్రహీనుల జీవితాలకు రంగులద్ధి , మేలిముసుగులేసి , అందమైన అలంకరణాలు చేస్తున్న పాల‌న ఇది. దేశ‌ద్రోహుల‌, లొంగుబాటుదారుల  వికృత ,  ప్రజావ్యతిరేక  జీవితాలను గొప్ప చేసి వాళ్లు మహ‌నీయులని, త్యాగమూర్తులని, ఆద‌ర్శనీయులని    బహుళ ప్రచారం చేస్తున్న రోజులివి.  “జననీజన్మభూమి ” అంటూ నాటకీయ విన్యాసాలతో, తమ అంగ ,అర్థ బలాలతో,   ప్రభుత్వ విధేయతలే “దేశభక్తి”గా ప్రజలను ఒప్పిస్తున్నపాలన ఇది. ప్ర‌భుభ‌క్తిని మించిన దేశ‌భ‌క్తి లేని కాలం ఇది.  ఈ వాతావరణంలో, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం జేసిన మేధావులను, విప్లవకారులను, వారిని క‌న్న త‌ల్లుల‌ను, వారికుటుంబాలను ప‌దే ప‌దే గుర్తు చేయాల్సిన అవ‌స‌రం
సాహిత్యం వ్యాసాలు

రాష్ట్రబడ్జెట్-రాయలసీమ

గత రెండు సంవ‌త్స‌రాల జమా,ఖర్చుల విశ్లేషిస్తూ,రాబోయే సంవ‌త్స‌ర‌పు రాష్ట్ర అవసరాలే గాకుండా,భవిష్య‌త్తును దృష్టి లో పెట్టుకొని వివిధ రంగాలకు నిధులు కేటాయింపు చేయడమే బడ్జెట్ లక్ష్యం.ఇందులో,ప్రజల తక్షణ అవసరాలకై సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  దోహదపడేలా నిధుల (మూలధన పెట్టుబడి) కేటాయింపులుండాలి.అప్పుడే క్రమక్రమంగా ప్రజలు తమకాళ్ళపై తాము నిలబడగలుతారు. భవిష్యత్తరాలు,ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని కొనసాగించగలిగే అవకాశంవుంటుంది కూడా.అయితే.ఇక్కడ కేవలం ఆర్థికాభివృద్ధి చెందడమే సరిపోదు,అందులో ప్రజలకు వారి వాటకూడా దక్కాల్సివుంటుంది. అలా ఆశించడం ఈ వ్యవస్థలో పేరాశనే అవుతుందనేది మరో అంశం. పొతే, కేవలం ఓట్ల రాజకీయాల్లో,   మంది బలం పై నడిచే నేటి రాజకీయాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి  అనేది ఒక