వ్యాసాలు

ఒక జిజ్ఞాసి లోతైన ఆలోచనలు

చిరకాల మిత్రుడు రమేష్ పట్నాయక్ తాను రాసిన ఐదు వ్యాసాలను ఒక సంపుటంగా ప్రచురిస్తూ దానికి ముందుమాట రాయమని నన్ను అడగడం ఒక ఆశ్చర్యం. ఈ ఐదు వ్యాసాలలో రెండు నా సంపాదకత్వంలోని ‘వీక్షణం’ లోనే వెలువడినప్పటికీ, ఆ రచనల్లో వ్యక్తమైన రాజకీయావగాహనలతో నాకు ఏకీభావం లేదని కొత్తగా చెప్పనవసరం లేదు. అలా ఏకీభావం లేకపోయినా ప్రగతిశీల శిబిరంలోని అన్ని భావాలనూ, భావఛాయలనూ ఆహ్వానించే ఒక వేదిక సంపాదకుడుగా ఆ వ్యాసాలను ప్రచురించడం వేరు, నేరుగా ఆ రచనల సంపుటానికే ముందుమాట రాయడం వేరు. అయితే ఎంత ఏకీభావం లేని విషయంతోనైనా చర్చ, సంభాషణ, సంవాదం జరపాలని, స్థూలంగా
సంభాషణ

పూచిన చెట్టుకిందనే రాలిన పువ్వు

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి. నాలుగు సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి పీడితురాలైన నిర్మల, ఆ చికిత్స కోసం హైదరాబాదు వచ్చి ఉన్న సందర్భంలో 2019 లో అరెస్టయింది. బొంబాయిలోని బైకుల్లా జైలులో కరోనా రెండు సంవత్సరాలూ సరైన చికిత్స కూడా అందక కాన్సర్ వ్యాధి ముదిరిపోయి, అనేక అవయవాలకు వ్యాపించింది. ఇక కొద్ది నెలల కన్న ఎక్కువ బతకదని వైద్యులు చెప్పిన తర్వాత, బొంబాయి హైకోర్టు ఆదేశం మేరకు ఆమెను జైలు నుంచి, హాస్పైస్ (చికిత్స కూడా అవసరం లేని స్థితికి చేరినవారిని
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పు

నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ
సాహిత్యం కారా స్మృతిలో

కారా కథలు ఎందువల్ల నిలుస్తాయి?

వాచ్యంగా చెప్పిన దానికన్న ఎక్కువగా సూచనలు అందించిన కారా కథల గురించి గత నలబై ఏళ్లలో చాలా చర్చ జరిగింది, ఇంకెంతో చర్చ జరగవలసే ఉంది, జరగవచ్చు కూడా. కాగా మరణం తర్వాత కారా గురించి, కారా కథల వర్తమాన అన్వయం గురించి జరుగుతున్న చర్చ మరిన్ని కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. కారా కథల ప్రాసంగికత గురించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారాను, ఆ మాటకొస్తే ఏ రచయితనైనా ఎలా అర్థం చేసుకోవాలనే మౌలిక అంశాలు చర్చకు వస్తున్నాయి. కారా కథల్లో చెప్పిన, చెప్పదలచుకున్న విషయాల ద్వారా ఈ చర్చలోకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఒక
సంభాషణ

ఇది తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిపై నిషేధం!

తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జి ఓ ఎం ఎస్ నం 73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలు లోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు