మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి
జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్ జిల్లా పిడిఎస్యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం