కవిత్వం

వధ్య శిల

వధ్యశిల రజతోత్సవమ్మటబంధిఖానలు ప్రజల సొమ్మటన్యాయమే వర్థిల్లుతుందటనాయకుల ఆరాధనాలట పూలుగోయర తమ్ముడామాల గట్టవె చెల్లెలా కొత్త సంకెళ్లేమిలేవటతెల్లదొరలను దించినారటదేశ దేశములోన భారతిబిచ్చమెత్తుట మాన్పినారట గర్వపడరా తమ్ముడాపరవశింపవె చెల్లెలా ఆనకట్టలు కట్టినారటభూమి పేదలకిచ్చినారటఆకలెత్తిన ఆయుధాలనుఅణచి మేల్‌ సమకూర్చినారటభయములేదుర తమ్ముడాశీలవతివే చెల్లెలాగ్రామ పంచాయతులు పెట్టిపేదలకు నిధి పంచినారటపల్లె నుండీ ఢల్లిదాకాసోషలిజమే పారుతుందట వంతపాడర తమ్ముడాగొంతుకలపవె చెల్లెలా పదవికయినా కొలువుకయినాతెలివి ఒక్కటె గీటురాయటకులమతాలను చంపినారటరామరాజ్యము తెచ్చినారటఅందుకొనరా తమ్ముడాఆడిపాడవె చెల్లెలా అధిక ధరలను ఆపినారటదోచువారికి జైలు శిక్షటదేవళమ్ములు నిలిపినారటముక్తి మార్గం చూపినారటపూజ సలపర తమ్ముడాపున్నె మొచ్చునె చెల్లెలా ప్రణాళికల పరిమళాలటప్రతి గృహానికి ప్రాకినాయటనిరుద్యోగమ పొమ్ము పొమ్మనికొత్తగొంతుక విప్పుతారట సహన ముంచర తమ్ముడాఆలకించవె చెల్లెలా ఎవరి ప్రాణము
సాహిత్యం కథలు

నిన్న ఈవేళ

(ఈ క‌థ ఆంధ్ర‌ప్ర‌భ స‌చిత్ర‌వార ప‌త్రిక 10.4.74 సంచిక‌లో అచ్చ‌యింది. విర‌సం ప్ర‌చురించిన చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వంలోని క‌థా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగ‌ల సంప‌త్‌రెడ్డి చెర‌బండ‌రాజు సాహిత్యంపై త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీ‌కాకుళం క‌థా నిలం నిర్వాహ‌కులు దీన్ని పంపించారు. సంప‌త్‌రెడ్డికి, క‌థానిల‌యం నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.- వ‌సంత‌మేఘం టీ) చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి