సంపాదకీయం

రాముడ్ని కాదు, రైతును చూడండి

ప్రతి ఉద్యమం సమాజానికి ఒక మేల్కొలుపు వంటింది. అది వాస్తవ పరిస్థితి పట్ల కళ్లు తెరిపించి మార్పు కోసం దారి చూపిస్తుంది. అయోధ్య రామున్ని అడ్డం పెట్టి హిందూ మెజారిటీని భక్తితో, ముస్లింలు తదితర మైనారిటీలను భయంతో కళ్లు, నోరు మూసుకునేలా చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంది బిజెపి. పాత ఎత్తుగడే కానీ ఇప్పుడు ఇనుమడిరచిన ఉత్సాహంతో, మీడియాను తన వశం చేసుకున్నాక రెట్టించిన బలంతో పాచిక వేసింది. రాముడొచ్చాడు అని దిక్కులు మోగేలా అరిచింది మీడియా. రాముడొచ్చాడు కాచుకోండి అన్నారు ఫాసిస్టులు. ఆ భజన మోతలో, ఆ ఆర్భాటంలో మణిపూర్‌ల కేకలు వినపడలేదు, అదానీల దోపిడి కనపడలేదు. ఇంకా
సంపాదకీయం

పాలస్తీనా సందర్భంలో ప్రమాదకరంగా మారిన సోషల్‌ మీడియా

భారతదేశం అరుదైన రికార్డును సాధించింది. సోషల్‌ మీడియా అబద్ధాల ప్రచారంలో ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఇండియా చాలా ముందుంది. ఈ ఘనత సాధించిన సందర్భం ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్‌ అనుకూల, ముస్లిం వ్యతిరేక సోషల్‌ మీడియా పోస్టుల్లో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారంలో 70 శాతానికి పైగా భారతదేశం నుండి ప్రచారమవుతున్నాయని డిజిటల్‌ డేటాను పరిశీలించే ఒక నివేదిక చెప్పింది! ఈ స్థాయిలో ఇజ్రాయెల్‌ పక్షం తీసుకుని భారతీయులు సోషల్‌ మీడియా యుద్ధం చేయడం చూసి ప్రపంచం విస్తుపోతోంది. స్వయంగా ఇజ్రాయెల్‌ కూడా ఇంతగా తనను తాను సమర్థించుకొని ఉండదు. వందేళ్ల పాలస్తీనా-ఇజ్రాయెల్‌ సంఘర్షణా చరిత్రలో ఎన్నడూ లేని
సంపాదకీయం

స్వలింగ వివాహాలు- పితృస్వామిక కుటుంబ వ్యవస్థ

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Marriage equality case (వివాహ సమానత్వం)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కేసు సంప్రదాయ పితృస్వామిక సమాజంలో సంచలనం అనే చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ట్రాన్స్‌ జెండర్‌ సమాహాలు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల గుర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తాను బదిలీ చేసుకుంది. ఆ తర్వాత దీని విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివాహ చట్టాలపై వచ్చిన మౌలిక ప్రశ్నలను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్వచనాల దగ్గరికి
కొత్త పుస్తకం

కొత్త పాఠం

50 ఏళ్ల విరసం మహాసభల్లో కలిసిన ఒక ట్రాన్స్‌ సామాజిక కార్యకర్తతో ఒక రాత్రంతా జరిపిన సంభాషణ, అంతకు ముందే జరిగిన హైదరాబాద్‌ ప్రైడ్‌ మార్చ్‌, అడపాదడపా బిట్టూతో పంచుకున్న విషయాలు కొత్త లోకంలోకి తలుపులు తెరిచాయి. అమ్మాయి ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలని నిర్దేశించే సామాజిక నీతి పట్ల చికాకు, జెండర్‌ స్టీరియోటైప్‌కు భిన్నంగా ఉండే వ్యక్తుల పట్ల ఆసక్తి నా రాజకీయ అవగాహనతో సంబంధం లేకుండా మొదటి నుండీ ఉండేవి. మార్క్సిజం పరిచయమయ్యాక మానవ సంబంధాలను అర్థం చేసుకునే తీరు తెలిసింది. ఒక ఆలోచనా దృక్పథం ఉన్నంత మాత్రాన అన్నీ సులువుగా అర్థం కావు.
సంభాషణ

అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!

ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం
సంపాదకీయం

హిజాబ్ ఒక సాకు మాత్రమే  

కర్ణాటక విద్యాసంస్థల్లో బిజెపి అనుబంధ గ్రూపులు రెచ్చగొట్టిన హిజాబ్ వివాదం వాళ్ళు కోరుకున్నట్లుగానే మత చిచ్చును రేపింది. వివాదం ఎవరు మొదలు పెట్టారు, గుంపులను రెచ్చగొడుతున్నది ఎవరు అనే విషయాలు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, వాటిని అదుపు చేసే చర్యలు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వం మూడు రోజులు విద్యాసంస్థల్ని మూసేసింది. హిందూ, ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా వారి మతపరమైన దుస్తులు వేసుకొచ్చి గొడవ చేస్తున్నారని మీడియా ప్రచారం చేసింది. విద్యార్థులంతా స్కూల్ యూనిఫాం తప్ప ఏ మతపరమైన బట్టలు తగిలించుకోకూడదని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. పీడకులు బాధితుల మధ్య తటస్తంగా వ్యవహరించడమంత మోసం ఇంకోటి ఉండదు.  అసలు
కాలమ్స్ ఓపెన్ పేజీ

ఏ వెలుగులకు ఆ వెన్నెల?

కళ కళ కోసం కాదు. ఎప్పటి మాట ఇది! ఈ నినాదం వెనక ఎంత పోరాటం! ఈ నినాదం వెంట ఎన్ని త్యాగాలు! కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేయాల్సి వస్తోంది. చర్చ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తోంది. సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతించాడు. ఆయన పని చేసిన రంగంలో తనదైన బలమైన ముద్ర వేసిపోయాడు. దాని గురించి మీడియా ఆలపిస్తూనే ఉంది. దాన్నలా ఉంచితే రచయితగా ఆయనేమిటి, ‘వ్యక్తిగత’ రాజకీయ విశ్వాసాలపరంగా ఆయనేమిటి, ఈ రెండిటినీ కలిపి చూడాలా, వేరువేరుగా చూడాలా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఆయన స్వయంగా ప్రకటించి ఉన్నాడు గనక
సంపాదకీయం

పుస్తకం ఎవరికి ప్రమాదకారి?

ఇవాళ దేశంలో జ్ఞానం అన్నిటికన్నా ప్రమాదకరమైనది. దానిని మోసే పుస్తకం, ఆ పుస్తకాన్ని రాసే, చదివే వ్యక్తులు ప్రమాదాకారులు. ఎలాగో మూడు ఉదాహరణలు మాత్రం చెప్తాను. మావోయిస్టు నాయకుడు ఆర్. కె. జ్ఞాపకాలతో ప్రచురించిన సాయుధ శాంతి స్వప్నం పుస్తకాలను ప్రెస్ నుండి విడుదల కాక ముందే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాలను నిషేధించిన హీనమైన చరిత్ర కూడా మనకుంది కానీ అందులో ఏముందో కూడా చూడకుండా ఎత్తుకుపోవడం బహుశా ఇప్పుడే చూస్తున్నాం. వెయ్యి కాపీల పుస్తకాల కోసం వంద మంది ప్రెస్ మీద దాడి చేసి భీభత్సం సృష్టించి, వాళ్ళ ప్రాపర్టీ ఎత్తుకుపోయి వాళ్ళ మీదే కేసులు
వ్యాసాలు

రాజును చంపడం ఎందుకు తప్పు?

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను