వ్యాసాలు

అభివృద్ధి విధ్వంసాల రాజకీయార్థిక విశ్లేషణ

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వం-4లో అభివృద్ధి విధ్వంసాల మాయాజాలాన్ని వివరించే వ్యాసాలు ఉన్నాయి. బహుశా ఈ సంపుటిలోకి ఇంకొన్ని వ్యాసాలు కూడా తీసుకరావచ్చనిపించింది. వాటిలో అభివృద్ధి విధ్వంసాల గురించి ఉన్నప్పటికీ నిర్దిష్టంగా హక్కుల విశ్లేషణే ప్రధానంగా ఉన్నది. వాటిని హక్కుల ఉద్యమ వ్యాసాల్లో చేర్చితే బాగుంటుందనిపించి ఇక్కడికి తీసుకరాలేదు. ఈ వ్యాసాల్లో శేషయ్యగారు అభివృద్ధి విధ్వంసాలను మానవ జీవితంలోని అనేక కోణాల్లో వివరించారు. ఘటనలు, పరిణామాలు, వివరాలు, లెక్కలు, ముఖ్యంగా పాలకుల ఆర్భాట ప్రకటనలు, వాళ్ల ప్రకటిత
వ్యాసాలు

హక్కుల చైతన్యాన్ని కార్మికవర్గ దృక్పథాన్ని పెంచే వ్యాసాలు

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’. శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం.  ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు,
ఖండన

మణిపూర్‌ మారణహోమాన్నిఖండిద్దాం!దోషులను కఠినంగా శిక్షించాలి

(పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రచురణ) మణిపూర్‌ రాష్ట్రం మయన్మార్‌తో అర్జాతీయ సరిహద్దులు ఉన్న ఈశాన్య ప్రాంతంలో చిన్న రాష్ట్రం. 35 లక్షల జనాభా కలిగిన రాష్ట్రం. ఆదివాసేతరులు కొండప్రాంతాలు, భూములు కొనడానికి వీలులేదనే 371(సి) (అధికరణ ప్రకారం). భూ సంస్కరణ చట్టాన్ని సడలించాలని మైతీలు చేస్తున్న వాదనలకు భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్దత్తు తెలుపుతోంది. మైతీలు హిందువులు. నాగా, కూకీ, ఆదివాసీ తెగలు మెజారిటీ క్రైస్తవులు. మైతీలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. 10% భూ భాగంలో, మైదాన ప్రాంతంలో ఉన్న మైతీలు 53% జనాభా వల్ల రాష్ట్ర శాశనసభ
కరపత్రాలు

ఆదివాసులపై మోడీ ప్రభుత్వ యుద్ధం

(30-04 -2023   నాగర్‌కర్నూల్‌ జిల్లా   అచ్చంపేటలో జరిగిన సభ కరపత్రం- వసంత మేఘం టీం ) దేశానికే మూలవాసులైన ఆదివాసీలను ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ప్రభుత్వాలు, 1985 నుండి అమానుషంగా వేటాడి హత్యచేస్తున్నాయి. జల్‌, జంగిల్‌, జమీన్‌లపై ఆదివాసులకే హక్కని 1997 సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులో కూడా అడవిపై హక్కు ఆదివాసీలదే అని స్పష్టం చేసింది. కాని అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి, అడవిని విధ్వంసం చేయడానికి సిద్ధమైన పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులవైపే ప్రభుత్వాలు నిలబడ్డాయి. ఎలాగైతే నల్లమలలో ఉన్న 20 లక్షల టన్నుల యురేనియం వెలికి తీసి, అచ్చంపేట నల్లమల