వ్యాసాలు

ఎవరిదీ  తెలంగాణ ? ఎవని పాలైంది ?

డెబ్బై ఏళ్ళ తెలుగు రాష్ట్రం రెండు బలమైన ఉద్యమాలను చూసింది.ఒకటి నక్సల్బరీ రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.  సిద్దాంత రిత్యా రెండూ వైరుధ్యమైన ఉద్యమాలు అయినప్పటికీ  రెండు ఉద్యమాలూ సుధీర్గ కాలం నడిచాయి. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నాయి అవి ఒక దానికి మరొకటి సంబంధ భాంధవ్యాలను కలిగి ఉంది. తొలివిడత తెలంగాణ మిగిల్చిన అసంతృప్తుల దావాలనమే  నక్సల్బరీ ఉద్యమాన్ని కొనసాగించాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి గొంతూ ఈ రెండు ఉద్యమాలను గుండెలకు హత్తుకున్నాయి. ఇది పోరు భూమి, ఆట పాట సైదోడై కదన రంగాన్ని కవాతు తొక్కేలా చేసాయి.  సీమాంధ్ర దోపిడీ సాంస్కృతిక అభిజాత్యం పాలకుల నిర్లక్ష్యం
వ్యాసాలు

పోలవరంలో మునిగిపోతున్న ఆదివాసులు

తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో 'భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య' ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం