నివేదిక

బుద్ధిజీవులుగా ఆదివాసులపై యుద్ధాన్ని అంగీకరిద్దామా?

ఆదివాసులపై వైమానిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదుల సమావేశాన్ని పాణి ఆరంభించారు -  తెలంగాణ ప్రజల గురించి, తెలుగు ప్రజల గురించి, ఆదివాసుల హక్కుల గురించి దశాబ్దాలుగా పనిచేస్తున్న  బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సమావేశానికి వచ్చారు. 1948లో హైదరాబాదు రాష్ట్రంపై నెహ్రూ, పటేల్‌ పోలీసు చర్య దగ్గరి నుంచి దండకారణ్యంలో సైనిక చర్యలు దాకా  మన ప్రజాస్వామ్యం విస్తరించింది. నేల మీద లక్షల సైన్యం ఆదివాసీ ప్రజలపై యుద్ధానికి తలపడిన దశ నుంచి సరిహద్దు దేశాల యుద్ధాల్లో వాడే హెలికాప్టర్లలో సైనికులు వచ్చి బాంబు దాడులు
పత్రికలు

దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులురాజ్యాంగ వ్యతిరేకం ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్‌ చేద్దాం

రౌండ్‌ టేబుల్‌ సమావేశం25 జనవరి 2023, హైదరాబాదుప్రెస్‌ నోట్‌ ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న మేము జనవరి 11వ తేదీన దక్షిణ బస్తర్‌లోని కిష్టారం`పామేడు ప్రాంతంలో జరిగిన సైనిక దాడికి దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబులు దాడులు చేశాయి. ఈ దాడిలో పొట్టం హంగి అనే ఆదివాసీ యువతి మృతి చెందింది. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం తానే ఈ దేశ ప్రజలపై  వైమానిక యుద్ధం చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మానవతకు వ్యతిరేకం. భారత ప్రజలు అనేక ప్రక్రియల ద్వారా, పోరాటాల