కాలమ్స్ కథ..కథయ్యిందా!

చేదు మిగిల్చిన చెక్కెర కర్మాగారపు కథ ‘కంకాళం’

దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ పరిధిలో పనిచేస్తున్న అనేక సంఘాలు, సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల దెబ్బకు కుదేలవడం తొంబైల తర్వాత  ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలో అమలవుతున్న మిక్సెడ్ ఎకానమీ ప్రైవేటు వేటుకు గురవడం కూడా యీ కాలంలోనే జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కొద్దిగా ప్రతిఘటించడం తొలినాళ్లలో జరిగింది. అయితే సహకార రంగంలోని నూలు మిల్లులూ, చెక్కెర కర్మాగారాలూ చాలా సులభంగా ప్రైవేటు కుట్రలకు గురికావడం జరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చెక్కెర వినియోగదారులకు  చుక్కలు చూపించిన వైనం వొకవైపూ, వినియోగదారులకు విదేశీ చెక్కెరను సరఫరా చేయడాన్ని ప్రభుత్వాలు సమర్థించుకోవడం ఒకవైపు ఏకకాలంలో జరిగిపోయాయి. ప్రతిమ గారు
సాహిత్యం కాలమ్స్ కథ..కథయ్యిందా!

అపార్థాల‌ను చెదరగొట్టిన కథ

ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం
కాలమ్స్ కథ..కథయ్యిందా!

అధివాస్తవికతను ఎంచుకొని వాస్తవికతను చెప్పిన కథ

కార్పొరేటమ్మా - రాజకుమారుడు. భరించలేని వాస్తవాలు , ఒక్కోసారి తిరగేసి చెప్తూనే తప్ప సంతృప్తినివ్వనంత , వొత్తడికి గురిచేస్తాయి. నడుస్తున్న చరిత్ర  తలకిందులతనాన్ని  భరించడమెలాగో  తెలియనప్పుడు  మనం తలకిందులుగా  నడవడమే  ఏకైక మార్గంగా అనిపిస్తుంది. అప్పుడు కార్పొరేటమ్మా - రాజకూమారుడు లాంటి  అధివాస్తవిక కథలే  వస్తాయి. అధివాస్తవికత , వ్యంగం , వాస్తవికత మూడూ ఒకే కథలో  కథనమై కన్పిస్తాయి. ఆ  కలగాపులగపు  కథనం , యేది వాస్తవమో , యేది అధివాస్తవమో తేల్చుకోమని  పాఠకులకు  సవాళ్ విసురుతుంది. ఒక కథ   మొత్తం కథనం  ఒక రకమైన  ధోరిణిలో నడవడానికి , చదవడానికీ అలవాటు పడ్డాం కదా  ,
కథ..కథయ్యిందా!

కరువు నిజంగా పీడించేదెవరినో చెప్పిన కథ ‘కరువెవరికి’

అనంతపురం జిల్లా (రాయలసీమ) కరువు గురించి చాలా కథలే వచ్చుంటాయి.ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్నో , ప్రకృతిని సాకుగా చూపిస్తూ రాజ్యపు, దాని యంత్రాంగపు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, విషాదభరితమైన జీవితాలను చిత్రించిన కథలే అవన్నీ. ఒక  కథలో  సమాజంలోని ఒక స్తరాన్ని ( పొరను) చిత్రించడం ద్వారా సమాజాన్ని సాధారణీకరించడానికి  ఆకథలన్నీ ప్రయత్నించివుంటాయి. అయితే  ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ' కరువు ' అనే అవ్యవస్థ ఎట్లా వుంటుంది.దాని ప్రభావానికి ఆ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజలు ఎట్లా వున్నారు. ఎవరికి యేమేరకు కరువుశాకం తాకింది , లేదా ఆ వేడిని కూడా  చలికాచుకోవడానికి వాడుకునే వెసులుబాటు ఎవరికుందీ ,
కథ..కథయ్యిందా! కాలమ్స్

‘పొదగని గుడ్ల‌’లో పర్యావరణ విధ్వంపం

అభివృద్ధి ని అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు.మానవ సౌకర్యాల కల్పనలో అభివృద్ధి అనే ప్రక్రియ మనం వూహించలేనన్ని రూపాలను సంతరించుకుంది. ఆ అభివృద్ధి పాదాల వొత్తిడి కింది ప్రకృతి, వ్యక్తులూ నలిగిపోవడం కూడా అనేక రూపాలుగా వుంది. ఒక వైపునేమో కావాల్సినంత, రావాల్సినంత అభివృద్ధి అందనితనం వెక్కిరిస్తుంటే మరోవైపు అదే అభివృద్ధి కొందరికి యెక్కువగా అంది , దానివల్ల విపరీత పరిణామాలు కూడా చోటుచేసుకోవడం కన్పిస్తుంది. ఈ అసమ అభివృద్ధి మనుషుల జీవితాలను కల్లోలం చేయడంతో పాటు ప్రకృతిలో కూడా దుష్పరిణామాలకు దారితీయడాన్ని సునిశిత దృష్టి గల రచయితలు పట్టుకుంటారు. తమ సృజనతో  చదువరులలో  ఎరుక కల్గిస్తారు.అలాంటి కథ కె.వీ.కూర్మ‌నాథ్ 
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పీడిత ప్రాంతాల కథ

పి.చిన్నయ్య రాసిన 'మెట్ట భూమోడు' , పీడిత ప్రాంతాల కథ.పీడిత ప్రజలవైపు నిలబడటం మనందరికీ తెలిసిన ఆదర్శభావం.ఈ కథ ఆ విలువ ను విస్తృతం చేస్తూ పీడిత ప్రాంతాల వైపు నిలబడమంటుంది.ఈ కథలో పీడిత ప్రాంతాన్ని ప్రేమించే ప్రొటాగనిస్టుది ఆ పీడిత ప్రాంతమే అయ్యుండవచ్చు.దాంతో తన ప్రాంతాన్ని తాను ప్రేమించక యేంచేస్తాడు అనుకోవచ్చు.అయితే యీ ప్రొటాగనిస్టుకు సుభిక్షమైన పచ్చని పంటలతో తులతూగే కాలువల ప్రాంతంలో స్థిరపడే, ఆస్తులు చేసుకొనే అవకాశం వచ్చినా వద్దనుకొని మెట్టభూముల్లోకి వెళ్తాడు.ఎందువల్ల?ఈ కథలోని ప్రొటాగనిస్టు టీచర్.కోదాడలో కాపురముంటూ, నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద వున్న రామచంద్రాపురం హైస్కూలు లో వుద్యోగం.ప్రజాసంఘాల వెనుక తిరిగే,
సాహిత్యం కారా స్మృతిలో

కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు

కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల
కథ..కథయ్యిందా!

రాబందు – గాలివాన

ఇది, 'ఒక పక్షి కత'. దీన్ని పి.వరలక్ష్మి రాసింది.అరుణతారలో సెప్టెంబర్ 2009లో అచ్చయ్యింది. ఈకలు లేని తెల్లని బట్టతల.బలమైన బూడిదరంగు రెక్కలు , కుడిచివర నుండి ఎడమచివర దాకా ఏడడుగుల విశాలమైనవి.పొడువాటి మొనదేలిన , గుహద్వారంలా తెరుచుకొనే ముక్కు.'ఔచ్..'మని అరచిందంటే దడుసుకొని ఆమడదూరం ఎగిరపోయే బక్కప్రాణులు. ఇదీ యీ కథలోని రాబందు బీభత్స గంభీర సోందర్యం.ఎప్పటికైనా తన గుంపు  నాయకుడిగా యెదగాలనుకుంది.ఎదిగింది. అది తన వొంపుదిరిగిన బలమైన ముక్కుతో , చచ్చినప్రాణుల కఠినమైన శరీరభాగాలను చీల్చేది.దాన్ని చూసి సాటి పక్షులు నోరెళ్ళబెట్టేవి. కాలక్రమంలో చచ్చినవాటినీ, బలహీనమైన వాటినీ వేటాడితే యేం గొప్పా? అనుకొని మన రాబందు, లేల్లనీ, గొర్లనీ
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పితృస్వామ్యపు విరుగుడు ను చిత్రించిన చాయ్ గ్లాసు

చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని  కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి
కాలమ్స్ కథ..కథయ్యిందా!

నాన్నా కతచెప్పవూ…కథ

రాప్తాడు గోపాలకృష్ణ  నాన్నా కతచెప్పవూ , కథ రాప్తాడు గోపాల కృష్ణ ది.అతడుబయలుదేరాడు , కథా సంపుటి లోది.ఈ కథ నిద్ర పోవడానికి రాత్రుళ్లు కథలడిగే పిల్లవాడి కోరిక.బిడ్డడిని నిద్రపుచ్చడానికి ఒక తండ్రి తలకెత్తుకునే బాధ్యత.అంతకుమునుపే నిద్రపుచ్చడానికి యెన్నో కథలు చెప్పాక , నిద్రపుచ్చడంలో విఫలమయ్యాక , ఆఖరుగా యీ కథ చెబుతున్నట్టూ , దీని తర్వాత యిక కథలడక్కుండా నిద్రపోయితీరాలనే ఒప్పందంతో యీ కథను బయటికి తీసాడు, యీకథలోని తండ్రి.ఆమేరకు యిది కథలోని కథ.ఈకథ చెప్పడంలో తండ్రి కి ఒక లక్ష్యం వుంది.అలాగే యీ కథలల్లుతున్న కథకుడికీ లక్ష్యముంది.అది రెండంచుల కత్తిలాంటి లక్ష్యం.ఆ కథలోని కొడుకును నిద్రపుచ్చడమనేది