కాలమ్స్ సమకాలీనం

అమెరికా నిష్క్రమణ దేనికి సంకేతం?

రెండు దశాబ్దాల క్రితం ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆఫ్ఘన్ నేల పై అడుగుపెట్టిన అమెరికా అవమానకరమైన రీతిలో తట్టా బుట్టా సర్దుకొని విమానమెక్కి ఉడాయించింది. రెండేళ్లుగా తనకు ఏ ప్రమాదం తలపెట్టకుండా వెళ్లనీయండoటూ తాలిబాన్ లతో రహాస్యంగా దోహలో మొదలైన చర్చలు పరిపూర్ణం కాకుండానే తానే విధించుకున్న గడువు ముంచుకు రావడంతో వియత్నాం ను విడిచివెళ్లిన చారిత్రక దృశ్యాలను ప్రపంచానికి మరోసారి గుర్తుకు చేస్తూ మరీ నిష్క్రమించింది అమెరికా. ఉగ్రవాదాన్ని అణచడమే మా పని.. జాతి నిర్మాణం కాదని ఇప్పుడు అంటోంది.  1980 తొలినాళ్లలో సోవియట్ సేనలను ఎదుర్కొనేందుకు తానే నాటిన ఛాందస బీజాలు నేడు పెరిగి పెద్దయిన
కాలమ్స్ సమకాలీనం

తబ్లీగీ జమాత్ కరోనా జిహాద్ అయితే మరి కుంభమేళా?

"కరోనా ఆయా౼ మౌలానా లాయా" అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు  అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ
కాలమ్స్ సమకాలీనం

సైన్స్ పరిశోధనా సంస్థకు ఫాసిస్టు పేరా!

ప్రపంచంలో చాలా దేశాలలో ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా వారి మరణానంతరం ఆయా సంస్థలకో లేదా మరో రంగానికో వారి పై గౌరవంతోనో వారికి గుర్తింపు గానో పెట్టడం జరుగుతుంది. భారతదేశంలోను ఆ ఆనవాయితి కొనసాగుతున్నది. పాలక వర్గాలు మారినప్పుడల్లా వారి భావజాల ప్రతినిధుల పేర్లను ఎక్కడో ఒక చోట తగిలించడం అలవాటు చేసుకున్నారు. ప్రజాజీవితంలో ఉండి వారి ప్రయోజనాలకు పాటుబడిన వారిని అలా గుర్తుంచుకోవాలంటే పేచీ ఏమి ఉండదేమో గాని మొత్తంగా వారి జీవితకాల ఆచరణకు పొసగని లేదా విరుద్ధమైన రంగాలకు వారి పేరు పెట్టడం చాలా కాలం క్రితమే మొదలయింది.