ఆర్థికం

యుపిఐ చెల్లింపులపై చార్జీల మోత

పల్లె నుంచి పట్నం దాకా దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగు తున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయ లైనా సరే.. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనున్న‌ది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొన సాగుతున్న ఈ సర్వీసు మీద చార్జీలు విధించటానికి స‌న్నాహాలు జ‌రుగు తున్నాయి. యుపిఐ చెల్లింపుల పై
ఆర్థికం

ద్రవ్యోల్బణం: పరిణామాలు

ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక శాస్త్రంలో కనిపించే ఒక గణాంకం. అంతకు మించి, సామాన్య ప్రజల జీవితాల ను నిశ్శబ్ధంగా కుదిపేసే సామాజిక, ఆర్థిక వాస్తవం. ఆర్థిక ప్రపంచంలో అత్యంత కీలకమైన, మ‌నుషుల జీవితాల‌ను చాలా ప్రభావితం చేసే అంశం ‘ద్రవ్యోల్బణం’.  ద్రవ్యోల్బణం అంటే మీ చేతిలో ఉన్న డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గడం.  ప్రభుత్వం విడుదల చేసే ద్రవ్యోల్బణ శాతాలు, ధరల సూచీలు, గణాంక నివేదికలు సాధారణంగా నిపుణుల చర్చలకే పరిమితమైన అంశాలుగా కనిపించినప్పటికీ, వాటి అసలు ప్రభావం ప్రతి మ‌నిషిపై, ప్ర‌తి ఇంటిలోనూ ఉంటుంది. ద్రవ్యోల్బణం వినియోగదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులపైనే గాక‌ మొత్తం ఆర్థికవ్యవస్థపై గణనీయమైన
ఆర్థికం

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం: పరిణామాలు

సామ్రాజ్యవాద యుగంలో దేశాల మ‌ధ్య యుద్ధాలు సరిహద్ధుల మధ్య జరిగే సైనిక ఘర్షణలు కేవలం ఆధిప‌త్యం కోస‌మే కాదు. ప్రతి యుద్ధం వెనుక ఒక ఆర్థిక ప్రయోజనం, మార్కెట్ ఆధిపత్యం, వనరుల దోపిడీ దాగి ఉంటుంది. ప్రపంచ దేశాల మార్కెట్లపై, సహజ వనరులపై ఆధిపత్యం సాధించడానికి సామ్రా జ్యవాద దేశం పరాయి దేశంపై ఆక్రమణ యుద్ధం చేస్తుంది. అందువల్లనే లెనిన్ ‘సామ్రాజ్యవాదం అంటే నే యుద్ధం’ అన్నాడు. యుద్ధం అనేది అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక భాగం. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది. ఆ సంద ర్భంలో కార్పొరేట్ సంస్థలు,
ఆర్థికం

పెరుగుతున్న ప్రపంచ సైనిక వ్యయం

2025ల్రో ప్రపంచ సైనిక వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021-25 మధ్యకాలంలో ప్రపంచ దేశాల మధ్య బదిలీ చేయ బడిన ఆయుధాల ప్రపంచ వ్యాప్త పరిమాణం, అంతకు ముందు ఐదేళ్ల కాలం (2016-20)తో పోలిస్తే 9.2 శాతం అధికం. 2011-15 తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదల. ఈ రెండు కాలాల మధ్య యూరప్‌లోని దేశాల ఆయుధ దిగుమతులు మూడింతలకు పైగా పెరిగాయి. అమెరికా ఖండంలోని దేశాల ఆయుధ దిగుమతులు కూడా 12శాతం పెరిగాయి, కాగా ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా, మధ్యప్రాచ్య దేశాల దిగుమతులు తగ్గాయి. 2021-25లో యుక్రెయిన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధాల గ్రహీతగా నిలిచింది. మొత్తం
ఆర్థికం

ఆర్థిక సంక్షోభ దిశగా భారత్

భారత్ భయంకరమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు బెర్న్‌స్టెయిన్, యుబిఎస్‌లు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రతికూలతల‌ను చూపనున్నాయని వెల్లడించాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత్ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తదనుగుణంగానే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో దురాక్రమణ యుద్ధా లు, ఆర్థిక అస్థిరతలు, ఇంధన సంక్షోభాలు పెరుగుతున్న ఈ కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొం టున్న సవాళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్
ఆర్థికం

ఇరాన్ యుద్ధ ప్రభావం – ఆర్థిక సంక్షోభం

పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతులం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్లుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు
ఆర్థికం

ఇండో–అమెరికా ఒప్పందం: సామ్రాజ్యవాదపు పునర్వ్యవస్థీకరణలో భారత పాలక వర్గాల పాత్ర

2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన 50శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించిందని, ఇది మోదీ వల్లనే సాధ్యమయిందని ప్రకటించి మోదీకి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన ఎట్లా అమెరికా ఒత్తిడికి దాసోహం అయ్యాడనే వాస్తవాన్ని మరుగుపరచాలని మోదీ ప్రచార టీం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా పెట్టుబడులకు దాసోహం చేసే ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందంలో ఏముంది? భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని
ఆర్థికం

సంక్షుభిత‌ ఆర్థిక వ్యవస్థ – సమస్యల వలయంలో ప్రజలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి. శ్రమదోపిడీ, వనరుల దోపిడీ, లాభాపేక్ష అనేవి అసమానతల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం అనేది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, అసమానతలు, తయారీ రంగంలో క్షీణత వంటి అంశాలతో ముడిపడి ఉంది.  దాని ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, నిరుద్యోగ సమస్య, పౌష్టికాహార కొరత,
ఆర్థికం

రూపాయి ఘోర పతనం – శ్రామికులపై భారం

అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్‌తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు ఒక డాలరు కావాలంటే 90 రూపాయలకు పైగా వెచ్చించాలి. రూపాయి విలువ పడిపోవడం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనే కాదు భారతీయ విద్యార్థులనూ ఇబ్బందు ల పాల్జేస్తుంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు అయ్యే వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. డాలర్‌కు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా ఉంది. దాని విలువ స్థిరంగా కొనసాగుతుండటం మరో అంశం. బంగారం, చమురుతో పాటు ఆహారధాన్యాలు, ముడి ఖనిజాలు తదితరాల
ఆర్థికం

డీలా పడనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

2025 సెప్టెంబర్‌ 22-26 తేదీల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం న్యూయార్క్ లో జరుగుతున్న వేళ, ప్రపంచ ఆర్థిక వేదిక సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, కృత్రిమ మేధ ప్రభావం, స్థిరమైన ఆర్థికం వంటి ప్రపంచ సవాళ్లపై దృష్ట సారించింది. ఆర్థిక వృద్ధిలో నెలకొన్న అనిశ్చితి, శ్రామికశక్తి భవిష్యత్తును పరిశీలించింది. అభివృద్ధి సంక్లిష్టతను చర్చించేందుకు 22-26 తేదిల్లో స్థిరత్వం, ఆర్థికవృద్ధి, బాధ్యత యుతమైన సాంకేతికపై, పురోగతిని చర్చించడానికి ప్రపంచ దేశాల నుండి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నూతన తయారీ సాంకేతికతలకు మార్గదర్శకత్వం వహించే సైట్‌లను గుర్తించింది. ఈ నెట్‌వర్క్ ల కోసం 12 మంది