ఏకరూప జాతీయ మార్కెట్లు: రైతులకు మరణశాసనం
గత సంవత్సరం మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మెజారిటీ తగ్గిపోయినప్పటికీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తోంది. మోడీ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం సన్నగిల్లడమే గత మేలో జరిగిన లోక్సభ ఎన్నికలలో బిజెపి మెజారిటీ తగ్గిపోవడానికి ప్రదాన కారణం. జెడియు, టిడిపి మద్దతుతో బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికలలో వచ్చిన ఫలితాలను గుర్తించడానికి బదులుగా 2017 మందసౌర్ రైతుల నిరసనను అమానుషంగా అణచివేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాజ్ సింగ్ చౌహాన్ను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా నియమించడంతో సహా రైతులకు హానిచేసే విధానాలను బిజెపి కొనసాగిస్తోంది. కేంద్రంలో