యుపిఐ చెల్లింపులపై చార్జీల మోత
పల్లె నుంచి పట్నం దాకా దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగు తున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయ లైనా సరే.. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనున్నది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపిఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొన సాగుతున్న ఈ సర్వీసు మీద చార్జీలు విధించటానికి సన్నాహాలు జరుగు తున్నాయి. యుపిఐ చెల్లింపుల పై










