వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
కాలమ్స్ ఆర్ధికం

పెరుగుతున్న అస‌మానతలు పెట్టుబడి దోపిడీకి సంకేతం

ఆదాయం, సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో
వ్యాసాలు

భారత రాజ్యాంగం వైరుధ్యాల పుట్ట

(రాజ్యాంగంపై  అనేక వైపుల నుంచి చ‌ర్చ జరుగుతున్న‌ది.  దీనికి అమ‌రుడు ప్రొ. శేష‌య్య‌గారు రాసిన ఈ వ్యాసం  త‌ప్ప‌క దోహ‌దం చేస్తుంది.  చారిత్ర‌కంగా రాజ్యాంగం రూపొందిన తీరును ఈ వ్యాసంలో ఆయ‌న వివ‌రించారు.  మ‌న సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో రాజ్యాంగానికి ఉండ‌వ‌ల‌సిన పాత్ర‌ను ఎత్తిప‌డుతూనే ఆందులో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్న‌దీ విశ్లేషించారు.  రాజ్యాంగ ప‌రిశోధ‌కుడిగా, న్యాయ‌శాస్త్ర ఆచార్యుడిగా, పౌర హ‌క్కుల ఉద్య‌మ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిశీల‌న‌లు  ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌కు  కొత్త కోణాలు ఆవిష్క‌రిస్తాయ‌ని పున‌ర్ముద్రిస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీ) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్ వివరిస్తూ *ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు,
సాహిత్యం కవిత్వం

కన్నా..

అదొక నిర్జన మైదానం అప్పుడే గతమైన బాల్యం కన్నీటి కడలి మాటున చిట్టిపొట్ట కోసం నెత్తికెత్తుకున్న పెద్దరికం నీవు పుట్టిన ఈ నేలలో విగ్రహాల నిర్మాణం అతి ముఖ్యం కూల్చివేతా వాళ్లిష్టం అయినా ఎందరికో ఊపిరి చిహ్నం శ్వేదాశ్రువులతో వెలిసిన నిండైన అంబేద్కర్‌ విగ్రహం ఆ నీడలోకి కాసేపయినారా మన బతుకు గాయానికి ఆయనే ఒక లేపనం.
సాహిత్యం కవిత్వం

ఈ క్షణం

వయసు మనుషుల్ని దూరం చేసింది మమత పురాతన అవశేషమయింది ముదిమి ఊతకర్రగా మారింది ప్రేమించడమే మరిచిపోతున్న  మనుషుల్ని వదిలి రాని కాళ్ల వెంట కానని చూపుల దారులలో చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను నా చిట్టి కూనా.. గ్రీష్మంలో మలయ మారుతంలా రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు ఇప్పుడు నా మేనంతా సంతోషం అవును ఈ క్షణం అపురూపం ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది.. మబ్బులు పట్టిన ఆకాశం నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది ఈ మహా వృక్షం దాపున కాసేపు  సేద తీరుదాం ఈ క్షణం నాకెంతో అపురూపం గతం తాలూకు నీలి
సాహిత్యం లోచూపు

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ
సంపాదకీయం

హిజాబ్ ఒక సాకు మాత్రమే  

కర్ణాటక విద్యాసంస్థల్లో బిజెపి అనుబంధ గ్రూపులు రెచ్చగొట్టిన హిజాబ్ వివాదం వాళ్ళు కోరుకున్నట్లుగానే మత చిచ్చును రేపింది. వివాదం ఎవరు మొదలు పెట్టారు, గుంపులను రెచ్చగొడుతున్నది ఎవరు అనే విషయాలు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, వాటిని అదుపు చేసే చర్యలు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వం మూడు రోజులు విద్యాసంస్థల్ని మూసేసింది. హిందూ, ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా వారి మతపరమైన దుస్తులు వేసుకొచ్చి గొడవ చేస్తున్నారని మీడియా ప్రచారం చేసింది. విద్యార్థులంతా స్కూల్ యూనిఫాం తప్ప ఏ మతపరమైన బట్టలు తగిలించుకోకూడదని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. పీడకులు బాధితుల మధ్య తటస్తంగా వ్యవహరించడమంత మోసం ఇంకోటి ఉండదు.  అసలు
వ్యాసాలు

మేధావి, సృజనశీలి కామ్రేడ్ మిళింద్

18 నవంబర్‌ 2021 మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్‌చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్‌ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దీపక్‌ (మిలింద్‌ బాబూరావ్‌ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ
వ్యాసాలు

చట్టాల ద్వారా ప్రజాస్వామ్యం పై దాడి

భూస్వామ్య సమాజం నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ నడపడానికి చట్టాల నిర్మాణం జరిగింది. కానీ దీంతో పాటు పాలకులు తమ అధికారాన్ని నిలుపుకోడానికి చట్టాలను  ఉపయోగించుకున్నారనేది కూడా వాస్తవం. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ యుఏపిఏ చట్టం సందర్భంలో  ‘అనేక సార్లు చట్టం స్వయంగా చట్టాన్నే అవహేళన చేస్తుంది’ అని అన్నారు. యుఏపిఏ, దేశద్రోహ చట్టాల సందర్భంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ కూడా ‘భారత పౌరుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలంటే ఈ చట్టాల్ని మార్చాల్సిన అవసరం వుంది’ అని అన్నారు. దేశంలోని అనేక మంది మేధావులు, రాజ్యాంగ పండితులు,
వ్యాసాలు

రెండు ఇంజన్ల ప్రభుత్వ ఆర్ధిక స్థితి లో మోడీ-యోగీ ప్రభుత్వం 

 ‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో తన రాజకీయాధికారాన్ని ప్రారంభించిన బిజెపి ప్రభుత్వం గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి చేర్చింది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తలసరి ఆదాయం: 2020లో ఉత్తరప్రదేశ్  మొత్తం జనాభా దాదాపు 23కోట్లు వుంది. ఆదాయ వార్షిక సంవత్సరం 2011-12లో  2015-16, 2016-17లలో దాదాపు 12 శాతం వుండిన స్థిరమైన విలువ అభివృద్ధి రేటు సగటు 4శాతానికి పడిపోయింది. మొదటి రెండు సంవత్సరాలలో 8 నుంచి 10 శాతం వుండిన తలసరి ఆదాయం పడిపోయి 4 శాతం అయింది. ఆ తరువాత 2.4 నుంచి 4.4 మధ్య