సాహిత్యం కవిత్వం

గణ “తంత్రం”

హక్కులు వచ్చాయనిఆనందపడే వాళ్ళుఅరడజను అయితే.. హక్కంటే ఏంటోతెలియక పూట తింటేమారు కూటికి లేనోల్లు 94 మంది.. ప్రజలను పాచికలు చేసిఆడిన ఈ చదరంగంలోహక్కుల కాలరాసేవాడు "రాజకీయనాయకుడ"య్యాడువాటి కోసం గొంతు చించేవాడు"రాజకీయ ఖైదీ" అయ్యాడు ఇదే గణతంత్రంనేటికి ఈ ఘనమైన "తంత్రం"ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే.. చీకటి నిండినఈ మాయాజాలం లోనక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..! (72 ఏండ్ల గణ"తంత్ర" రాజ్యం పై)
సాహిత్యం కథావరణం కాలమ్స్

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
ఆర్థికం

కార్పొరేట్ల గుప్పిట్లోకి బ్యాంకులు

గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కారు చౌకగా అస్మదీయులైన బడా బాబులకు కిళ్లీలుగా చుట్టి నోటికి అందించడం ఈ ప్రభుత్వ విధానం. మోడీ 2014లో అధికారంలోకి రాగానే కాన్పెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్టీస్‌ (సిఐఐ) ప్రభుత్వం ముందుంచిన చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌లో బ్యాంకింగ్‌ రంగం ప్రైవేటీకరణ ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫి చేసిన మోడీ ప్రభుత్వం, వాటి దాహర్తిని తీర్చడం కోసం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వరంగ బ్యాంకులనే అప్పగించేందుకు సిద్దమైంది. ఇందుకు సంబంధించి బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌
వ్యాసాలు

ప్రజలు, ఉద్యోగులు, పాలకులు 

శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
ఆర్ధికం కాలమ్స్

పెరుగుతున్న అస‌మానతలు పెట్టుబడి దోపిడీకి సంకేతం

ఆదాయం, సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో
వ్యాసాలు

భారత రాజ్యాంగం వైరుధ్యాల పుట్ట

(రాజ్యాంగంపై  అనేక వైపుల నుంచి చ‌ర్చ జరుగుతున్న‌ది.  దీనికి అమ‌రుడు ప్రొ. శేష‌య్య‌గారు రాసిన ఈ వ్యాసం  త‌ప్ప‌క దోహ‌దం చేస్తుంది.  చారిత్ర‌కంగా రాజ్యాంగం రూపొందిన తీరును ఈ వ్యాసంలో ఆయ‌న వివ‌రించారు.  మ‌న సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో రాజ్యాంగానికి ఉండ‌వ‌ల‌సిన పాత్ర‌ను ఎత్తిప‌డుతూనే ఆందులో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్న‌దీ విశ్లేషించారు.  రాజ్యాంగ ప‌రిశోధ‌కుడిగా, న్యాయ‌శాస్త్ర ఆచార్యుడిగా, పౌర హ‌క్కుల ఉద్య‌మ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిశీల‌న‌లు  ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌కు  కొత్త కోణాలు ఆవిష్క‌రిస్తాయ‌ని పున‌ర్ముద్రిస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీ) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్ వివరిస్తూ *ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు,
సాహిత్యం కవిత్వం

కన్నా..

అదొక నిర్జన మైదానం అప్పుడే గతమైన బాల్యం కన్నీటి కడలి మాటున చిట్టిపొట్ట కోసం నెత్తికెత్తుకున్న పెద్దరికం నీవు పుట్టిన ఈ నేలలో విగ్రహాల నిర్మాణం అతి ముఖ్యం కూల్చివేతా వాళ్లిష్టం అయినా ఎందరికో ఊపిరి చిహ్నం శ్వేదాశ్రువులతో వెలిసిన నిండైన అంబేద్కర్‌ విగ్రహం ఆ నీడలోకి కాసేపయినారా మన బతుకు గాయానికి ఆయనే ఒక లేపనం.
సాహిత్యం కవిత్వం

ఈ క్షణం

వయసు మనుషుల్ని దూరం చేసింది మమత పురాతన అవశేషమయింది ముదిమి ఊతకర్రగా మారింది ప్రేమించడమే మరిచిపోతున్న  మనుషుల్ని వదిలి రాని కాళ్ల వెంట కానని చూపుల దారులలో చిక్కుకున్న నిన్ను ఎక్కడనీ వెతకను నా చిట్టి కూనా.. గ్రీష్మంలో మలయ మారుతంలా రాలుతున్న విత్తుకు జీవం తొడిగావు ఇప్పుడు నా మేనంతా సంతోషం అవును ఈ క్షణం అపురూపం ఉద్వేగం, ఉత్తేజం సంగీతంలా నాకు కొత్త ఊపిరినద్దుతోంది.. మబ్బులు పట్టిన ఆకాశం నా కన్నీటి తెరగా దారంతా పరచుకొంది ఈ మహా వృక్షం దాపున కాసేపు  సేద తీరుదాం ఈ క్షణం నాకెంతో అపురూపం గతం తాలూకు నీలి
లోచూపు సాహిత్యం

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ