వ్యాసాలు

ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్

ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో
సాహిత్యం కవిత్వం

స్టాచ్యు ఆఫ్ అనీ క్వాలిటి

నేను మాట్లాడనునీ చుట్టూ రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ గురించినేను చర్చించనునీ కేంద్ర వ్యాపార సామ్రాజ్య జిలుగుల గురించినేనేమీ అడుగనునువ్వు బలోపేతం చేసే వెయ్యి తలల భూతం గురించి సమతామూర్తీ!నీ ఐదు వేల ఋత్వికులలోనేనెక్కడున్నాను స్వామీ! ఇంకానన్ను చీకట్లోనే ముంచునా మూర్ఖోదయాన్నే స్వాగతించు వెయ్యేళ్ల కింది నుండిఇప్పుడెందుకు నిద్ర లేచావోనాకు తెలియంది కాదు మనుషులంతా సమానమైతేనీ దేవుని శంఖు చక్రాలు భుజాల మీదెందుకెక్కాయి మనుషులంతా ఒక్కటైతేమెడకు ముంత నడుముకు చీపురునీకాలమెందుకు మాయం చేయలే ఇంతకు"నంగిలి"రొమ్ములెందుకునెత్తుటి మేఘాలై కురిశాయి ఇవ్వాళఅయోధ్య తలనెత్తుకున్న నేల నేలంతాఅస్పృశ్య ఆడతనంఅరణ్య రోదనెందుకైంది ని దేవుడికినా అజ్ఞానానికి మధ్యనీ కులాన్ని గురువు చేసిపౌరోహిత్యాన్ని సృష్టించి బ్రాహ్మణులుకాని
పత్రికా ప్రకటనలు

వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు  వారంట్‌ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో  వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒక‌టి ఉన్న‌ట్లు భీమా కొరేగావ్‌ కేసులో అరెస్ట‌యి పూనా జెయిల్లో ఉండ‌గా 2019లో ఆయ‌న‌కు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో
సాహిత్యం కవిత్వం

జియ్యం గారు 

జియ్యం గారుఆడించేది అటపాడించేది పాటవలపట ముఖ్యమంత్రిదాపట మై హోం అధినేతఅక్రమ సంపాదన కువిరాళాల కుదేవుడు -- మతం -- ఒక దారిభక్తుల కు కొదువ లేదుడబ్బు కు తిరుగు లేదు జియ్యం గారుచదువు పదవతరగతి ఫెయిల్ఫార్మ్ కంపెనీ లో లేబర్నెక్స్ట్ టైపిస్ట్ కొంత కాలంకాషాయ వస్త్రాల తోదేవుడు -- మతంహిందుత్వం --- స్వర్గంఅంటూ సూక్తులు వల్లిస్తూచే ప్పేవి సూక్తులు --దూరేవి ?????? కోట్ల కర్చుతోసమతా మూర్తిరామానుజ చార్యుల విగ్రహంస్థాపననూరు ఎకరాల భూమి లోstatue of equality పేరుతోవిగ్రహంనాడు బ్రహ్మ కుల సంగానికినాయకుడు -- రామానుజా చార్యులుదేవుడు కాదు ఏళ్ళ తరబడిమన దేశాన్ని సర్వనాశనం చేసిందిబ్రాహ్మణులేప్రతిదాన్ని రహస్యం చేసారుపుక్కటి పురాణాలు
ఇంటర్వ్యూ సంభాషణ

స‌ర‌ళీక‌ర‌ణ స‌న్నివేశంలో ఉద్యోగుల ఉద్య‌మం, లొంగుబాటు

(పీఆర్సీ సాధ‌న‌కు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవ‌ల గ‌ట్టి పోరాట‌మే చేశారు. కానీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల పేరుతో నాయ‌క‌త్వం వంచించింద‌నే అభిప్రాయం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కూ చ‌ర్చ‌ల వ్య‌వ‌హారం ఏమిటి? ఉద్యోగ‌, ఉపాధ్యాయ ఉద్య‌మాల స్థితిగతులు ఏమిటి? అనే కోణంలో ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు ర‌మ‌ణ‌య్య ఈ ఇంట‌ర్వ్యూలో వివ‌రిస్తున్నారు..- వ‌సంత‌మేఘం టీం) 1. పి.ఆర్‌.సి. సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ ప్రభుత్వంతో చేసిన చర్చల లోగుట్టు ఏమిటి? “లోగుట్టు అంటూ ప్రత్యేకంగా అనకోవడానికి లేదు. అంతా బహిరంగ రహస్యమే. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలకనుగుణంగా వీరు మౌల్డ్‌ కావడము అందుకనుగుణంగా పాలకవర్గాలకు సహకరించినందుకు
సాహిత్యం కవిత్వం

ఒక ప్రజాస్వామ్యంలో

కొన్ని మాటలకు నరం ఉండదు గురిపెట్టి వదిలాకచిల్లం కల్లమైన ఒక నెత్తుటి నేల విలవిలలాడుతూ ఉంటుంది  గుండె నిండా విషం నింపుకున్నప్రేమ ఒలకబోయడం నెత్తుటి మైలురాళ్ళకు తెలియదనుకుంటావు  ఒక సంకుచిత రాజకీయ ఆవరణంలోఅజ్ఞాతం వీడిన నేల సంబరంనీ కళ్ళకు దృశ్యం కాకపోవచ్చు  ఒకరో ఇద్దరో పార్లమెంటుభవనమోమొలకెత్తలేదు పన్నెండు వందల ప్రాణాలు పోసినిర్మించుకున్న కల  కోట్ల హృదయ ధ్వనుల సంగమ స్థలి ఈ రోజులు పరిమళించకపోవచ్చుఈ కాలం వేదనై మిగలవచ్చుఈ ఉదయం నిరాశై వెలగవొచ్చుఈ నేల దుఃఖ రాసిగా ఉండవొచ్చు ఒకరోజునుమండే నెత్తురు పరిమళిస్తుందిఒక కాలాన్నిఆనందంగాపొలం నుండి రైతులు భుజం మీద మోసుకు వస్తారుప్రజలు ఒక ఉదయంఊహ కందని ఆశలు ఉదయిస్తారు  ఒక ఆకుపచ్చని సందేశమైతెలంగాణ దుఃఖ భూమిని
వ్యాసాలు

బోనులో మోడీ సర్కార్‌

పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్‌ టైమ్స్‌' ''ది బ్యాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్టు పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌'' అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్‌ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్‌ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్‌ కోసం ఎన్‌ఎస్‌వోతో
కాలమ్స్ కవి నడిచిన దారి

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
సంభాషణ

నిమ్మలపాడు దీర్ఘకాలిక పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మలపాడు గ్రామ ప్రజలు 1997లో అనూహ్యమైన ఒక విజయాన్ని సాధించారు. మైనింగ్‌ కార్యకలాపాల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ప్రైవేటు కంపెనీకి వ్యతిరేకంగా సాగిన న్యాయపోరాటంలో వాళ్ళు విజయం పొందారు. సుప్రీంకోర్టు 1993లో, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా యిచ్చిన తీర్పును కొట్టివేసింది. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఖనిజ సంపదను వెలికితీసే హక్కు కొండదొర తెగకు చెందిన ప్రజలకు మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలకు మాత్రమే వుందని,  ప్రభుత్వం
సాహిత్యం కవిత్వం

వీరగాధ

యాది వెన్నెల కాస్తుందివన భూమంతపురా కాల మ్రానుకోటలోజ్ఞాపకాల జాతర ఒక కుంకుమ్భరినివీర మరణాల మీంచినడిచి వస్తున్న కాలాన్ని కథలు చెబుతుంది కరువు గెల్చిన నేల మీదకడుపు పగుళ్ళు బడిఆకలికన్నీళ్లతోకొండలు కోనలు తడిసిపోయినాఓరుగల్లు మట్టికోట చెమ్మగిల్ల లేదు నిలువెల్లా గాయల్తో ఆత్మాభిమానంఆదివాసీ యుద్ధ మైంది శక్తి వంత ఆయుధాల్నిసవాల్ చేసినసంప్రదాయబాణం చెల్లా చెదురైన మోసం గెలిచాకతుది శ్వాస చిలుకలగుట్టందుకుందిఆగిపోకుండా- ప్రాణాల్ని దాచుకోలేనిఒక నిష్కల్మష కాలంప్రాణం పోస్కోని మానవాళికిఆకుపచ్చ తోరణాల అడివి కడుతుంది ఒక వీరోచిత త్యాగాలసంస్మరణప్రకృతోత్సవంఒక చేదు నిజాలతియ్యనిబంగారి జాతర పాలకుల కుటుంబ కణకణంప్రజల సొమ్మని ప్రకటించినబతుకుపోరు వెదురుచెట్లషామియనాలుపెద్ద పెద్ద చెట్లపందిళ్ళుప్రకృతి పిలిచిన ధ్వని ఇప్పపువ్వై గుప్పుమంటూఒక ఆదిమ జీవనవాసనేదోమనసును