సంపాదకీయం

హిజాబ్ ఒక సాకు మాత్రమే  

కర్ణాటక విద్యాసంస్థల్లో బిజెపి అనుబంధ గ్రూపులు రెచ్చగొట్టిన హిజాబ్ వివాదం వాళ్ళు కోరుకున్నట్లుగానే మత చిచ్చును రేపింది. వివాదం ఎవరు మొదలు పెట్టారు, గుంపులను రెచ్చగొడుతున్నది ఎవరు అనే విషయాలు ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, వాటిని అదుపు చేసే చర్యలు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వం మూడు రోజులు విద్యాసంస్థల్ని మూసేసింది. హిందూ, ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా వారి మతపరమైన దుస్తులు వేసుకొచ్చి గొడవ చేస్తున్నారని మీడియా ప్రచారం చేసింది. విద్యార్థులంతా స్కూల్ యూనిఫాం తప్ప ఏ మతపరమైన బట్టలు తగిలించుకోకూడదని కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. పీడకులు బాధితుల మధ్య తటస్తంగా వ్యవహరించడమంత మోసం ఇంకోటి ఉండదు.  అసలు
వ్యాసాలు

మేధావి, సృజనశీలి కామ్రేడ్ మిళింద్

18 నవంబర్‌ 2021 మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్‌చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్‌ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దీపక్‌ (మిలింద్‌ బాబూరావ్‌ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ
వ్యాసాలు

చట్టాల ద్వారా ప్రజాస్వామ్యం పై దాడి

భూస్వామ్య సమాజం నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ నడపడానికి చట్టాల నిర్మాణం జరిగింది. కానీ దీంతో పాటు పాలకులు తమ అధికారాన్ని నిలుపుకోడానికి చట్టాలను  ఉపయోగించుకున్నారనేది కూడా వాస్తవం. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ యుఏపిఏ చట్టం సందర్భంలో  ‘అనేక సార్లు చట్టం స్వయంగా చట్టాన్నే అవహేళన చేస్తుంది’ అని అన్నారు. యుఏపిఏ, దేశద్రోహ చట్టాల సందర్భంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ కూడా ‘భారత పౌరుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలంటే ఈ చట్టాల్ని మార్చాల్సిన అవసరం వుంది’ అని అన్నారు. దేశంలోని అనేక మంది మేధావులు, రాజ్యాంగ పండితులు,
వ్యాసాలు

రెండు ఇంజన్ల ప్రభుత్వ ఆర్ధిక స్థితి లో మోడీ-యోగీ ప్రభుత్వం 

 ‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో తన రాజకీయాధికారాన్ని ప్రారంభించిన బిజెపి ప్రభుత్వం గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి చేర్చింది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తలసరి ఆదాయం: 2020లో ఉత్తరప్రదేశ్  మొత్తం జనాభా దాదాపు 23కోట్లు వుంది. ఆదాయ వార్షిక సంవత్సరం 2011-12లో  2015-16, 2016-17లలో దాదాపు 12 శాతం వుండిన స్థిరమైన విలువ అభివృద్ధి రేటు సగటు 4శాతానికి పడిపోయింది. మొదటి రెండు సంవత్సరాలలో 8 నుంచి 10 శాతం వుండిన తలసరి ఆదాయం పడిపోయి 4 శాతం అయింది. ఆ తరువాత 2.4 నుంచి 4.4 మధ్య
వ్యాసాలు

ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్

ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో
సాహిత్యం కవిత్వం

స్టాచ్యు ఆఫ్ అనీ క్వాలిటి

నేను మాట్లాడనునీ చుట్టూ రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ గురించినేను చర్చించనునీ కేంద్ర వ్యాపార సామ్రాజ్య జిలుగుల గురించినేనేమీ అడుగనునువ్వు బలోపేతం చేసే వెయ్యి తలల భూతం గురించి సమతామూర్తీ!నీ ఐదు వేల ఋత్వికులలోనేనెక్కడున్నాను స్వామీ! ఇంకానన్ను చీకట్లోనే ముంచునా మూర్ఖోదయాన్నే స్వాగతించు వెయ్యేళ్ల కింది నుండిఇప్పుడెందుకు నిద్ర లేచావోనాకు తెలియంది కాదు మనుషులంతా సమానమైతేనీ దేవుని శంఖు చక్రాలు భుజాల మీదెందుకెక్కాయి మనుషులంతా ఒక్కటైతేమెడకు ముంత నడుముకు చీపురునీకాలమెందుకు మాయం చేయలే ఇంతకు"నంగిలి"రొమ్ములెందుకునెత్తుటి మేఘాలై కురిశాయి ఇవ్వాళఅయోధ్య తలనెత్తుకున్న నేల నేలంతాఅస్పృశ్య ఆడతనంఅరణ్య రోదనెందుకైంది ని దేవుడికినా అజ్ఞానానికి మధ్యనీ కులాన్ని గురువు చేసిపౌరోహిత్యాన్ని సృష్టించి బ్రాహ్మణులుకాని
పత్రికా ప్రకటనలు

వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు  వారంట్‌ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో  వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒక‌టి ఉన్న‌ట్లు భీమా కొరేగావ్‌ కేసులో అరెస్ట‌యి పూనా జెయిల్లో ఉండ‌గా 2019లో ఆయ‌న‌కు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో
సాహిత్యం కవిత్వం

జియ్యం గారు 

జియ్యం గారుఆడించేది అటపాడించేది పాటవలపట ముఖ్యమంత్రిదాపట మై హోం అధినేతఅక్రమ సంపాదన కువిరాళాల కుదేవుడు -- మతం -- ఒక దారిభక్తుల కు కొదువ లేదుడబ్బు కు తిరుగు లేదు జియ్యం గారుచదువు పదవతరగతి ఫెయిల్ఫార్మ్ కంపెనీ లో లేబర్నెక్స్ట్ టైపిస్ట్ కొంత కాలంకాషాయ వస్త్రాల తోదేవుడు -- మతంహిందుత్వం --- స్వర్గంఅంటూ సూక్తులు వల్లిస్తూచే ప్పేవి సూక్తులు --దూరేవి ?????? కోట్ల కర్చుతోసమతా మూర్తిరామానుజ చార్యుల విగ్రహంస్థాపననూరు ఎకరాల భూమి లోstatue of equality పేరుతోవిగ్రహంనాడు బ్రహ్మ కుల సంగానికినాయకుడు -- రామానుజా చార్యులుదేవుడు కాదు ఏళ్ళ తరబడిమన దేశాన్ని సర్వనాశనం చేసిందిబ్రాహ్మణులేప్రతిదాన్ని రహస్యం చేసారుపుక్కటి పురాణాలు
ఇంటర్వ్యూ సంభాషణ

స‌ర‌ళీక‌ర‌ణ స‌న్నివేశంలో ఉద్యోగుల ఉద్య‌మం, లొంగుబాటు

(పీఆర్సీ సాధ‌న‌కు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవ‌ల గ‌ట్టి పోరాట‌మే చేశారు. కానీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల పేరుతో నాయ‌క‌త్వం వంచించింద‌నే అభిప్రాయం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కూ చ‌ర్చ‌ల వ్య‌వ‌హారం ఏమిటి? ఉద్యోగ‌, ఉపాధ్యాయ ఉద్య‌మాల స్థితిగతులు ఏమిటి? అనే కోణంలో ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు ర‌మ‌ణ‌య్య ఈ ఇంట‌ర్వ్యూలో వివ‌రిస్తున్నారు..- వ‌సంత‌మేఘం టీం) 1. పి.ఆర్‌.సి. సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ ప్రభుత్వంతో చేసిన చర్చల లోగుట్టు ఏమిటి? “లోగుట్టు అంటూ ప్రత్యేకంగా అనకోవడానికి లేదు. అంతా బహిరంగ రహస్యమే. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలకనుగుణంగా వీరు మౌల్డ్‌ కావడము అందుకనుగుణంగా పాలకవర్గాలకు సహకరించినందుకు
సాహిత్యం కవిత్వం

ఒక ప్రజాస్వామ్యంలో

కొన్ని మాటలకు నరం ఉండదు గురిపెట్టి వదిలాకచిల్లం కల్లమైన ఒక నెత్తుటి నేల విలవిలలాడుతూ ఉంటుంది  గుండె నిండా విషం నింపుకున్నప్రేమ ఒలకబోయడం నెత్తుటి మైలురాళ్ళకు తెలియదనుకుంటావు  ఒక సంకుచిత రాజకీయ ఆవరణంలోఅజ్ఞాతం వీడిన నేల సంబరంనీ కళ్ళకు దృశ్యం కాకపోవచ్చు  ఒకరో ఇద్దరో పార్లమెంటుభవనమోమొలకెత్తలేదు పన్నెండు వందల ప్రాణాలు పోసినిర్మించుకున్న కల  కోట్ల హృదయ ధ్వనుల సంగమ స్థలి ఈ రోజులు పరిమళించకపోవచ్చుఈ కాలం వేదనై మిగలవచ్చుఈ ఉదయం నిరాశై వెలగవొచ్చుఈ నేల దుఃఖ రాసిగా ఉండవొచ్చు ఒకరోజునుమండే నెత్తురు పరిమళిస్తుందిఒక కాలాన్నిఆనందంగాపొలం నుండి రైతులు భుజం మీద మోసుకు వస్తారుప్రజలు ఒక ఉదయంఊహ కందని ఆశలు ఉదయిస్తారు  ఒక ఆకుపచ్చని సందేశమైతెలంగాణ దుఃఖ భూమిని