వ్యాసాలు

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ల ఉగ్ర దాడిని, అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖోమైనీ హత్యను ఖండించండి

ఇరాన్ అణ్వాయుధాలను,క్షిపణులను తయారు చేస్తుందని,అందుకు ఉపయోగపడే మూల పదార్థాలను నిల్వ చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ,దాడులు చేస్తామని బెదిరిస్తూ,తన దేశ స్వయం రక్షణ వ్యవస్థను అమెరికా ఆదేశాలకు లోబడి ఉంచాలని దశాబ్దాలుగా వత్తిడి చేస్తుంది.ఇరాన్ తను అణ్వాయుధాలను తయారు చేయడం లేదని తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పినా ఇరాన్ వాదనలను పట్టించుకోకుండా ఇంతకు ముందు ఒకసారి దాడులు చేసింది.మళ్ళీ మరొకమారు ఇదే వాదనను తెరపైకి తెచ్చి ఈ సాకుతో దాడి చేస్తామని బెదిరిస్తూ ఇందన వనరులను,ఖనిజ సంపదను, మార్కెట్ ను అప్పజెప్పాలని ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇరాన్ పై వత్తిడి
తొలికెరటాలు

విప్లవంలో చిగురించిన ప్రేమికులు-మార్క్స్,జెన్నీ

వాళ్ళిద్దరిది ఒకే మాట. ఒకే ఆలోచన. ఒకే తీరు. ఒకే సిద్ధాంతం. ఒకే స్వప్నం. ఒకే వ్యక్తిత్వం. ఒకే పోరాటం. ప్రజల కోసమే పుట్టిన త్యాగమూర్తులు వాళ్ళు.వాళ్లే జెన్నీ,కార్ల్ మార్క్స్. జెన్నీ తండ్రి లుడ్విగ్ వాన్ వెస్ట్ ఫాలెన్. జెన్నీ తల్లి ఎంతో ప్రేమస్పదమైన హృదయం ఆమెది. జెన్ని సోదరుడు హెడ్గార్.హెడ్గార్ కు సహ పాఠకుడే మార్క్స్. సోదరుడి మూలంగానే మార్క్స్ కు,మరియు జెన్నీకి మధ్య బాల్యం నుండే స్నేహం ఏర్పడింది.కాలం గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ మరింత సన్నిహితులయ్యారు. కాలం అనేది మనుషుల మధ్యన ప్రేమను, మానవత్వాన్ని, జాలి, దయను, కలిగిన వ్యక్తులను మనకు సమీపంగా తెస్తుందేమో.మరోవైపు మార్క్స్
వ్యాసాలు

నిఘా వలయంలో బస్తర్ గ్రామాలు

నిఘా వలయంలో బస్తర్ గ్రామాలు మాలినీ సుబ్రమణ్యం 2026 ఫిబ్రవరి 26 మావోయిస్టుల తిరుగుబాటును అంతం చేసేందుకు మార్చి 31వ తేదీని గడువుగా కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో పూర్వ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలోని ప్రజల జీవితాలను భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్: చుత్వహి గ్రామంలో ఇళ్ళకు అంకెలను కేటాయిస్తున్న భద్రతా బలగాలు చుత్వహి గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటికి ఒక నంబర్ ఉంటుంది; భద్రతా బలగాలు లావుపాటి ఇంగ్లీష్ అక్షరాలతో గోడలపై పెయింట్ చేసాయి. "మమ్మల్ని గుర్తించడానికి ఈ నంబర్లను ఉపయోగిస్తారు" అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మారుమూల ఉన్న ఈ గ్రామ నివాసి భీమా కోసా చెబుతున్నాడు.
సంభాషణ

కాశ్మీర్‌లోని కునాన్ పోష్‌పోరాలో, సైన్యంపైన ఎన్నటికీ తొలగని ఒక ఆరోపణ

1991లో, 40 మంది కశ్మీరీ మహిళలు సైనికాధికారులు తమపై అత్యాచారం చేశారని ఆరోపించారు. కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఫిబ్రవరి 23తో కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయ్యాయి. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఈ జంట గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్న భారత సైన్యానికి చెందిన ఒక యూనిట్ తమపై ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆ గ్రామ మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, 'లెస్ట్ వి ఫర్గెట్' (మనం మర్చిపోకూడదు) అనే శీర్షికతో 2024 సెప్టెంబర్ సంచికలో ప్రచురితమైన కథనాన్ని 'అవుట్‌లుక్' పునఃసమీక్షించింది. కునన్ పోష్‌పోరా సామూహిక అత్యాచార ఆరోపణల కేసు ఇప్పటికీ
సంభాషణ

కునాన్ పోష్‌పోరా: నిజాన్ని; స్మృతిని సజీవంగా ఉంచడం

2018 ఫిబ్రవరి 23: ఫ్రెని మానిక్‌షా సుమారు 27 ఏళ్ల క్రితం చలికాలంలో ఒకనాడు, కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న కునన్- పోష్‌పోరా అనే జంట గ్రామాల చౌకీదార్ జుమా షేక్, తహసీల్దార్ సికందర్ మాలిక్‌ను కలిశారు. ఆయన దగ్గర ఉర్దూలో రాసిన ఒక లేఖ ఉంది, దానిపై గ్రామస్తుల సంతకాలు, వేలిముద్రలు ఉన్నాయి. ఆ లేఖలో, ఫిబ్రవరి 23- 24 మధ్య రాత్రి '4 రాజపుతానా రైఫిల్స్' సైన్యం వారి గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించిన సమయంలో తాము అనుభవించిన భయంకరమైన లైంగిక హింస, చిత్రహింసల గురించి సాధారణ భాషలో వివరంగా తెలియచేసారు. బాధితులలో 60 ఏళ్ల
పత్రికా ప్రకటనలు

ఇరాన్ పై అమెరికా జియోనిస్ట్ కూటమి చేస్తున్న అన్యాయమైన యుద్ధాన్ని ఆపండి

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం - లెనిన్విప్లవం యుద్ధాన్ని అంతం చేస్తుంది లేదా యుద్ధమే విప్లవానికి దారి తీస్తుంది - మావో జెడాంగ్ ఇజ్రాయిల్ తో పొత్తు పెట్టుకుని అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం ప్రపంచ ఆధిపత్యం కోసం కొన‌సాగిస్తున్న యుద్ధంలో భాగం. కాబట్టి ఇది అన్యాయమైన యుద్ధం. దీనికి ప్రతిఘటనగా ఇరాన్ చేస్తున్నా ఆత్మరక్షణ యుద్దం న్యాయమైనది. అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా మనం నిరసన తెలపాలి. మనం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. శాంతి కోసం అమెరికా ఇరాన్ తో మూడు రౌండ్ల చర్చలు జరిపింది. నాలుగో సారి చర్చలు జరగాల్సి ఉంది. ఈ లోపలే, ప్రపంచ ప్రజల
పత్రికా ప్రకటనలు

కుమ్మెర జాతరలో పసిపాప మరణానికి కారకులైన దోషులను శిక్షించాలి

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో ఫిబ్రవరి 18న  ఆలయ దర్శన టికెట్ కోసం తలెత్తిన వివాదంలో అగ్ర కుల భూస్వామ్య శక్తులు జరిపిన దాడిలో రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడం అత్యంత హేయమైన చర్య. ఈ ఘటనను విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కేవలం ఒక జాతరలో జరిగిన ఘర్షణ కాదు. శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ఆధిపత్య  కుల దురహంకార దాడి. జాతరలో ప్రవేశానికి ఫీజు చెల్లించలేదనే నెపంతో చాకలి గణేష్ కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వామ్య శక్తులు దాడి చేయడం, పసిబిడ్డను తన్నడం, మహిళలను వివస్త్రలను చేసేలా ఈడ్చుకెళ్లడం
వ్యాసాలు

పుస్త‌కాల‌తోనే మనిషిగా గుర్తింపు – డాక్టర్ బి. నాగశేషు

డాక్టర్ బి. నాగశేషు  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగు అధ్యయన, పరిశోధన విభాగం, ముక్త గంగోత్రి, మైసూర్  పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వారధి, వ్యాసాలు, ఇరుగుపొరుగు, తెలుగు కన్నడ తులనాత్మక వ్యాసాలు,తగటు, తులనాత్మక వ్యాసాలు, ఏకుదారం, బీరప్ప,  కిలారి నవలలు వెలువరించారు. మాట్లాడే పుస్తకాల గురించి ఈ పక్షం వసంత మేఘంలో ఇలా అంటున్నారు.. 1.నాకు పుస్తకాలు చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే సుదీర్ఘంగా చదివే అలవాటు మాత్రం నా ఎం. ఏ. తెలుగు అయిపోయిన తర్వాత. ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదవకూడదు అనేటువంటి నిబంధన నేను పెట్టుకోకుండా నాకు చేతికి దొరికిన పుస్తకాలన్నిటిని కూర్చుని చదివేవాడిని.
ఆర్థికం

ఇండో–అమెరికా ఒప్పందం: సామ్రాజ్యవాదపు పునర్వ్యవస్థీకరణలో భారత పాలక వర్గాల పాత్ర

2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన 50శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించిందని, ఇది మోదీ వల్లనే సాధ్యమయిందని ప్రకటించి మోదీకి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన ఎట్లా అమెరికా ఒత్తిడికి దాసోహం అయ్యాడనే వాస్తవాన్ని మరుగుపరచాలని మోదీ ప్రచార టీం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా పెట్టుబడులకు దాసోహం చేసే ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందంలో ఏముంది? భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని
సమకాలీనం

చాకలి కులస్థుల పై దాడి- ఆధిప‌త్య భావ‌జాలం

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా తేదీ 18 న టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించారనే సాకుతో చాకలి కులస్థులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికల పై అదే గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి నాయకత్వంలో సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధు రెడ్డి మొదలగు వారు అగ్రకుల దురహంకారంతో భయంకరంగా దాడి చేసి కొట్టారు. రెండు నెలల పసిపాపను కాళ్ళతో తన్నడంతో తీవ్రంగా గాయపడ్డ పాప 21 వ తేదీన చనిపోయింది. రెడ్లు చేసిన ఈ క్రూరమైన దాడిని మానవత్వం కలవారందరూ ఖండించాలి. హంతకుల పై మర్డర్ కేసు నమోదు