సంపాదకీయం

రైతులకు విజ‌యంః మ‌రి ఆదివాసుల‌కు ఎప్పుడు?

నవంబర్ 19, 2021 దేశ చరిత్రలో ఫాసిస్టు శక్తులకు ఓటమి ఎదురైన రోజు. మూడు  వ్య‌వ‌సాయ  చట్టాల రద్దుపై మొండిగా ఉన్న  కేంద్ర  ప్ర‌భుత్వం  లొంగిరాక త‌ప్ప‌లేదు.  దేశంలో గత ఏడాది కాలంగా సాగుతున్న రైతాంగ పోరాటం విజయం సాధించింది. ఈ విజయం కార్పొరేట్ ప్రాయోజిత పాలక వర్గాలు పైన విజయం. సుదీర్ఘ కాలంగా కొనసాగించిన పోరాటం ప్రజలకు అనేక అనుభవాలను ఇచ్చింది.  పాలక వర్గాలు పోరాడుతున్న ప్రజలను ఖలిస్తానీలుగా, అర్బన్ మావోయిస్టులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేశాయి. ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. వీటన్నిటిని తట్టుకుని రైతులు విజయం సాధించారు. ఈ కాలంలో 700 మంది రైతులు
వ్యాసాలు ఓపెన్ పేజీ

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
సాహిత్యం వ్యాసాలు

వ‌ర్గ పోరాట ఆచ‌ర‌ణ‌లో సంస్కృతి

(విప్ల‌వోద్య‌మ స్థావ‌రాల‌లో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ నుంచి సాగుతున్న నూత‌న సంస్కృతీ వికాసాన్ని వివ‌రిస్తూ ప్ర‌గ‌తి సుదీర్ఘ వ్యాసం రాశారు.ఈ వ్యాసంలోని  కొన్ని  భాగాలు మీ  కోసం - వ‌సంత‌మేఘం  టీం)  మన దేశంలోని ప్రజాస్వామిక విప్లవానికి దాదాపు 160 సంవత్సరాలకు పైబడిన చరిత్రఉంది. నిర్ధిష్టంగా మన దేశంలో దీర్హకాల ప్రజా వ‌ర్గ‌పోరాటానికి  50 సంవత్సరాలకు పైబడినచరిత్రే ఉంది.   ల‌క్ష‌లాది మంది భాగ‌స్వామ్యంతో, వేలాది మంది అమ‌ర‌త్వంతో   ఒక నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో  నూతన కళా సంస్కృతుల వికాసం జ‌రుగుతున్న‌ది.  అది, నూతన ప్రజాసంస్కృతికి పునాదులు వేసింది. వాటిని మనం మరింత బలోపేతం చేస్తూ ప్రజల ప్రజాస్వామికసమాజ నిర్మాణ దిశలో, దోపిడీ
సాహిత్యం కవిత్వం

నేను

నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.
సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
కాలమ్స్ అలనాటి రచన

రాజూ-పేదా

మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే. 1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని 
కాలమ్స్ లోచూపు

ప్రేమమయి, సాంస్కృతిక వారధి

(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి  నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.) ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని  విస్తృత సామాజిక సంబంధాలతో  కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు  వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో
సాహిత్యం కవిత్వం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
వ్యాసాలు

వ్యక్తిగత గోప్యతకు తూట్లు

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగియక ముందే మరో వివాదస్పద అంశం కొత్తగా ముందుకొస్తున్నది. ఇప్పుడు “వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు(పిడిపిబి) 2021” పేరుతో మరో వివాదం ముంచుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతను మానవ హక్కుగా గుర్తించే అంతర్జాతీయ ఒప్పందంపై 1948లోనే భారత్‌ సంతకం చేసింది. ఏడు దశాబ్ధాలు గడిచినా ఆమేరకు పటిష్ట చట్టాన్ని రూపొందించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడానికి 128 దేశాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వ్యక్తుల వివరాలు అంగడి సరకులు కాకూడదంటే దేశీయంగా అందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరమని అత్యున్నత న్యాయస్థానం లోగడే
సాహిత్యం కవిత్వం

జరూర్

గనిలో వారంచీకటిలోదీపాల వెలుతురు లోనల్ల బంగారం వెలికి తీతరెక్కలు ముక్కలు చేసుకుంటూజనానికి వెలుతురు నివ్వడానికి వారం బడలికసడలించుకుంటూకుటుంబాలతో గడపాలనే ఆనందంతోఆశతో ఊసులతో ఊహలతో కలలతో బయల్దేరాం పాటలు పాడుకుంటూఎప్పటిలాగేలేగదూడల్లా ఎగురుతూఅదే బండి అదే తోవ అదే సమయం ఏళ్ళుగా మాయదారి చట్టంచేతుల్లో పెట్టుకున్నరక్షక దళంవిరుచుకు పడిందికాల్పుల మోతగుండెల్లో రుధిరం చిమ్మిందిదేహాలను చిదిమిందిబతుకు బుగ్గి చీకటిలోనే అయ్యో విచారం వ్యక్తంపోయిన ప్రాణం ఖరీదు కట్టేచట్టం మాత్రం అలాగేఎన్ని నిరాహార దీక్షలు చేస్తేనేందున్నపోతు పై వాన కురిసినట్టే గా ఆపరేషన్ అవగాహన లోపంఎవడు జవాబుదారీచంపూ డబ్బులు ఇయ్యికథా కమామిషుప్రశ్న నీ చంపూ లేదాజైళ్లలో నింపుకర్కశ రాజ్యంమత్తు లో జోగుతున్న జనంమీ వంతూ