కథావరణం

రైతు జీవిత చిత్రణలో రచయిత్రులు

 'మంచిదయ్యా మీరెల్లబారితే నేనూ నా పనికి పోతా' అంటుంది హనుమక్క . గ్రామీణ రైతాంగజీవితాన్ని చిత్రించిన సాహిత్యంలో  పురుషుడే కథానాయకుడు. ఆయా కథలు నవలలు నాటకాలలోని పాత్రలు సంఘటనలు సందర్భాలు పరిస్థితులు అన్నీ పురుషుడి కేంద్రంగానే కొనసాగాయి. రైతు సాహిత్యంలో మహిళారైతుల గురించి, రైతుకూలీల గురించి, వ్యవసాయేతర ,వ్యవసాయ అనుబంధరంగాల్లో నిరంతరం శ్రమించే దిగువ స్థాయి వారిని   కేంద్రంగా చేసుకొని వెలువరించిన సాహిత్యం చాలా తక్కువ. రైతు జీవితం పొడవునా అమ్మమ్మ నానమ్మ తల్లి పిన్నమ్మ పెద్దమ్మ అత్త భార్య వదిన మరదలు అక్క చెల్లెలు కూతురు మనవరాలు ఇట్లా అనేక రూపాల్లో కనిపించే స్త్రీ పాత్ర విస్మరించలేనిది,
కథావరణం సాహిత్యం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం
కాలమ్స్ కథావరణం

కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?

కులం ఎట్లా పుట్టింది? కుల వివక్షత ఎట్లా పోతుంది?" సమాజంలోని అసమానతల కారణంగా అభివృద్ధికి చాలా దూరంలో ,చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన దళితుల గురించిన ఆత్మగౌరవ కథలు ఎన్నో వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఈ రకం ఆత్మగౌరవ కథలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. తమ పరిస్థితుల గురించి స్వానుభవంతో వ్రాసుకున్న రచనలు. పరోక్షంగా సామాజిక సాంఘిక పరిస్థితులను అర్థం చేసుకుని సహానుభూతితో రాసిన రచనలు. నంబూరి పరిపూర్ణ గారి కథాసంపుటి "ఉంటాయి మాకు ఉషస్సులు" లోని ఈ కథ పేరు "అనల్ప పీడనం" . అసలు సమాజంలోని అసమానతలకు కారణం అయిన  కులవివక్షత ఎలా మొదలైంది? కులం ఎలా
కాలమ్స్ కథావరణం

వాస్తవాన్ని వాస్తవం అని చెపుతున్న ఒక ఏనుగుల రాజ్యం కథ “స్వాములొచ్చారు”

ఏనుగుల దాడుల వల్ల పంటల్ని, రైతుల్ని కోల్పోతున్న దేశంలోని అనేక కల్లోలిత ప్రాంతాల్లో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా ఒకటి. అటువైపు తమిళనాడు, ఇటువైపు కర్ణాటక మధ్య  చిక్కిపోతున్న దట్టమైన అడవులు.అంతకంతకూ అడవుల మధ్య మెరుగవుతున్న రవాణా సౌకర్యాలు.. చదునవుతున్న కొండలు గుట్టలు, మాయమవుతున్న వృక్షసంపద, అడుగంటిపోతున్న చెరువులు, కుంటలు, అడవులకు ఆనుకుని ఉండే పల్లెల్లో ఆహారం కోసం ఏనుగుల రాక వల్ల , తమ ప్రాణాలు కంటే విలువైన పంటలను కాపాడుకోవటానికి రైతులు చేసే పోరాటం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ముఖ్యమంటున్న ప్రభుత్వం, జీవనం కోసం ఏనుగులతో యుద్ధం చేసే పరిస్థితిలో రాయలసీమ రైతాంగం.. ఒక
సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
కాలమ్స్ కథావరణం

బతక నేర్చిన ప్రపంచాన్ని చూపించిన జూకంటి జగన్నాథం కథ – ఎరుక

లోకం తీరు ఎలా ఉంది? లోకంలో మెజారిటీ మనుషుల తీరు ఎలా ఉంది, రాజ్యం, మీడియా తీరు ఎలా ఉంది? సహజత్వంతో ఉన్నది ఎవరు లేనిది ఎవరు? ఎందుకు? అసమ సమాజంలో తీవ్రమైన అసహనం, సంక్షోభం ఏర్పడటానికి కారణం  ఏమిటి ? పరిష్కారం ఏమిటి?రాజీపడటం గాయపడటమేనా? విలోమంగా ఉన్నది మనుషులా ? రాజ్యమా? ఉన్నట్టుండి  సరిగ్గా కనిపించకపోవడం, వినిపించకపోవడం, రుచిని వాసనను కోల్పోవడం, స్పర్శను కోల్పోవడానికి కారణం ఏమిటి?సామాజిక స్పృహ చైతన్యం ఆలోచించే శక్తి వివేచన లేని వాళ్ళకి పంచేంద్రియాలు పనిచేస్తాయా? ఎరుక లేని వాళ్ళకి ఎలా ఎరుక కలుగుతుంది? ఒక సమాజంలోని సహజమైన అసహజ స్థితిని, తీవ్ర సంక్షోభాన్ని అసంబద్ధతని,
సాహిత్యం కాలమ్స్ కథావరణం

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
కాలమ్స్ కథావరణం

ఇంకేమీ లేదు, జీవితమే.. నామిని కథ “అకా, కేక కా!”

భర్త చనిపోయిన దశలో పూర్తిగా నిరాశామయ  వాతావరణంలో నుంచి బయటపడి , నూతనోత్సాహంతో జీవితాన్ని పునః ప్రారంభించిన ఒక సాధారణ మనిషిలోని చైతన్యమే ఈ కథ. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక  2015 సెప్టెంబర్ సంచికలో ఈ కథ ప్రచురితమైంది. ఊర్లో అతడి పేరు చిలకాయన. తిరుపతిలో పేరు మునీంద్ర. ఊర్లో వాళ్లతో అతడికి ఎలాంటి అనుబంధం ఉన్నట్లు కనిపించదు. ఇస్త్రీనలగని తెల్ల బట్టలతో నిద్ర లేచి లేవంగానే తయారై తిరుపతి టౌన్ క్లబ్  కి వెళ్ళి పోతాడు. ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒంటి మీద గుడ్డలు నలగకుండా చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ తో తిరిగి ఊర్లోకి వస్తాడు. మడత
సాహిత్యం కాలమ్స్ కథావరణం

దేవుడా ? మనిషా? ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు?

మనుషుల  కష్టాలను, సమస్యలను, దుఃఖాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అసమ సమాజంలో  వివిధ సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య పూడ్చలేని అగాధాలను, అంతరాలను సృష్టించింది ఎవరు? ఈ హద్దులు అంతరాలు అగాధాలను అధిగమించడానికి ఎవరు  ఏం చేయాలి? శ్రామిక వర్గాల శ్రమను నిరంతరం  నామమాత్రపు వేతనాలతో  నిలువు దోపిడి చేస్తున్న  బూర్జువా పెట్టుబడిదారి ఉన్నత తరగతుల వర్గాలు ఆ శ్రామిక వర్గాల కోసం, కనీసం కృతజ్ఞత చూపించకపోవడాన్ని, ప్రాణాపాయ పరిస్థితులలో సైతం ఎంత మాత్రము డబ్బు సహాయం చేయడానికి ముందుకు రాని వైనాన్ని , మనుషుల కోసం ఏమీ చేయలేని మనుషులు దేవుడి కోసం మాత్రం దేవుడి
కాలమ్స్ కథావరణం

“సాహిత్య సమాజ సంబంధాల విశ్లేషణ కె.వి కూర్మనాథ్ కథలు”

జీవితాలు ఉద్యమాలే కాదు మరణాలు కూడా మనకు చాలా పాఠాలు చెబుతాయి. జీవితం కన్నా  మరణం చాలా గొప్పది. విప్లవకారుడి, ఉద్యమకారుడి మరణం ఒక చరిత్ర.  అంతులేని గాయాలు అంతు తెలియని సత్యాలు, ఎన్నో అనుభవాలు వైఫల్యాలు పోరాటాలు విజయాలు వ్యధలు దుఃఖాలు ఇవన్నీ కలగలిసిన చరిత్ర ఒక వీరుడి మరణం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఇక్కడ నిలబడి వెనుదిరిగి చూసుకుంటే, ఉద్యమం వెనుక కారణాలు, ఉద్యమం బలపడిన సందర్భాలు, ఉద్యమం బలహీన పడిన సందర్భాలు, ఆటుపోట్లు వెన్నుపోట్లు ఆంక్షలు నిర్బంధాలు అణచివేతలు, వ్యక్తులు అదృశ్యం కావడం, మనుషులు శవాలుగా మారటం, శవాలు కూడా కనిపించకుండా పోవడం.. అనేక