ఎరుకల కథలు

“మా తప్పు ఏంది సామీ ?”

“ అశోకు వచ్చిoడాడా ? వాడి  గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “  యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి  దుర్గమ్మ   గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల  సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి  కూర్చునో ,
కథలు

ఆమె నవ్వింది…

ఆమె నవ్విందట... ‘భలే నవ్వారే’ ఆంకర్‌ చిన్నగా నవ్వుతూ అంటోంది. ఆమె నిజంగా నవ్వితే ఇలాగే ఉంటుందా? బిల్కిస్‌ నిజమైన నవ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వితే ఆమె నవ్వెలా ఉంటుంది ఏమో ఊహించలేం... ఇరవై రెండేళ్ల నుంచే ఎన్ని ఊర్లు... ఎన్ని ఇళ్లు... ఎన్ని బళ్లు... ఎన్ని దేశాలు.... ఎన్నెన్ని కన్నీటి సముద్రాలు ఇంకెన్ని ఎడారులు మార్చి మార్చి పరిగెడ్తూ పారిపోతూ... పరిగెత్తి పరిగెత్తి గసబోస్తూ ఆయాస పడ్తూ... చమటలు కన్నీళ్లు... రక్తం కక్కుతూ కక్కుతూ... ఊపిరాడక ఎగబోస్తూ ఆగి... ఆగి కూలబడ్తూ... విరిగిపోతూ కరిగిపోతూ శ్వాస ఆడట్లేదు... ఓప్హ్‌ా ఊపిరాడట్లేదు... కాస్త గాలివ్వండి... ఏంటి... ఏంటి ఈ
కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
కథలు

ప్రజలదే విజయం

వేసవికాలం సెలవుదీసుకుంటూ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయం. అది జూన్‌ చివరి వారం. వేసవి ఎండలతో మోడుబారిపోయి ముఖం మాడ్చుకున్న ఆ అడవితల్లి అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలకు చిగురిస్తూ అడివంతా తన అందాన్ని సంతరించుకుంటున్నవేళ. ఆ చుట్టుపక్కల ఆదివాసీ పల్లెలన్నింటిని గలగలమనే శబ్దాలతో పలకరిస్తూ పారుతున్న బలిమెల నది. ఈ సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఆ ఊరి ప్రజలందరూ దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. వర్షానికి తడిసి బురదగా మారిన మట్టిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ప్రకృతి ఇచ్చే ఊట నీటితో బిందెలు నింపుకొని నాలుగైదు వరసలు తలపై పెట్టుకొని కూనిరాగాలు తీస్తూ పొలం గట్లపై నడుస్తూ ఇళ్లకు
ఎరుకల కథలు

“పదకొండు నెలల జీతగాడి కత”

(ఎంత చెప్పినప్పటికీ ఎంతగా చెప్పుకున్నప్పటికీ చెప్పుకోవాల్సిన జీవితాలు కొన్ని ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అలా చీకట్లో ఉండిపోయిన జీవితాల్లోని దుఃఖాలు నవ్వులు ఉద్వేగాలు సంతోషాలు ఆ కులం వాళ్లని మాత్రమే కాదు,  మనసున్న ఎవరైనా కదిలిస్తాయి, కలవరపెడతాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి, నవ్విస్తాయి. ఆ దుఃఖ భాష తెలిసినప్పుడు, మనసుతో విన్నప్పుడు ఆ కతలను ఇంకా చదవాలనిపిస్తుంది,ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గిరిజనులు రాసిన గిరిజన జీవన వ్యథలను చదవడం ఎవరికైనా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శా వ్యాసాలు రాసే*కవి,కథకుడు,నవలాకారుడు పలమనేరు బాలాజీ (49)తన జాతి కతలను, వ్యథలను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈ సంచిక నుండే ఎరుకల
కథలు

చరిత్ర మునుముందుకే…

"మావోయిస్టుల దిష్టి బొమ్మలను తగలబెడుతున్న ప్రజలు”. తన టాబ్‌ లో వార్తాపత్రికల హెడ్‌ లైన్స్‌ చదువుతూ ఆ వార్త దగ్గర జూమ్‌ చేసి చూసింది సుధ. ఆ వార్త కింద ఫోటోలో బి‌ఎస్‌ఎఫ్ పోలీసులు తలకు నల్లటి గుడ్డలు చుట్టుకుని ఎక్కువ మందే వున్నారు. కొంత మంది జనాలు కూడా నిలబడి వున్నారు. కొంత మంది చేతుల్లో ... "మావోయిస్టులారా ! మా గ్రామాలకు రాకండి!". అని రాసి వున్న ఫ్లెకార్డులున్నాయి. సాధారణ దుస్తుల్లో వున్న ఇద్దరు మనుషులచేతుల్లో గడ్డితో తయారు చేసిన మానవాకార బొమ్మలకు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు తొడిగి నిప్పు అంటించిఅవి దహనం అవుతుంటే పైకెత్తి
కథలు

నిర్ణయం

అమ్మను వదిలి ఒకరోజు అయిపోయింది. అయినా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తోంది. నా చుట్టూ జరుగుతున్న వాటిల్లో పడి అమ్మనూ, అమ్మ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలనూ తాత్కాలికంగా దూరంపెడుతున్నానే తప్ప పూర్తిగా తనను గుర్తుచేసుకోకుండా ఒక గంట కూడా వుండలేకపోతున్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరువలో వున్నానని నన్ను రిసీవ్ చేసుకున్న అన్నయ్య మాటల్లో అర్థమయ్యింది. ఇంతలో మా జీప్ ఒక ఊరి దగ్గర ఆగింది. చూసేసరికి అటు పూరి గుడిసే కాదూ, పెంకుటిల్లూ కాదు. ఏదో డిఫరెంట్ గా వుందే అని అనుకుంటూ చూస్తుంటే నల్లగా పొడుగ్గా వున్న ఒక అతను " కామ్రేడ్ నీ కిట్టు
కథలు

కొత్త బంగారు లోకం

సూర్యుడు పడమర దిక్కున ఎరుపు రంగులోకి మారుతూ, మెల్లమెల్లగా కిందికి జారుకుంటున్నాడు. అప్పుడు సమయం 6 గంటలు. 5, 6 ఇండ్లున్న ఆదివాసీ గ్రామం చేరుకున్నాం. నేను బాబాయ్‌, మమల్ని తీసుకొచ్చిన అన్నయ్య, మేము కలవాల్సిన వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్‌లో మాట్లాడక, మెసేజ్‌ చూసుకోక సరిగ్గా 48 గంటలవుతోంది. వాచ్‌ ప్రతి గంటకు శబ్దం చేయగానే, నాకేదో మెసేజ్‌ వచ్చినట్లుగా నా చూపులు సైడ్‌ బ్యాగ్‌ వైపు వెళుతున్నాయి. తీరా వాచ్‌ సౌండ్‌ అని ఓ లుక్‌ వాచ్‌పైకేసా. నేనొచ్చే ముందు డిజిటల్‌ వాచ్‌ ఐతే అక్కడి ప్రదేశానికి అనుకూలమని మా పిన్ని కొనిచ్చింది. డిజిటల్‌
సాహిత్యం

Viyyukka: Morning star in Indian literature

Revolutionary women writers have made an incredible contribution to Telugu literature and in fact it is a significant addition to Indian literature as well. It has been four decades since women revolutionaries started writing short stories, but except a few most of them are unknown to mainstream literature. Now virasam, (Revolutionary Writers Association) along with other friends took the tedious project of compiling nearly 300 stories written by 53 women