సంపాదకీయం

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఫాసిజాన్ని నిలువరిస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది.  ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో  దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు.  దాడులుకు గురి అయింది ముస్లింలు,  చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడుల‌కు వున్న రాజ‌కీయ ప్రాధాన్య‌త
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

భ్రమాన్వితుడా…!

ఏమంది సునయన? ‘యూ హావ్‌ టు వర్క్‌ హార్డ్‌... రేపట్నించీ ఇంకో రెండు ఎక్సర్‌సైజెస్‌ ఆడ్‌  చేస్తాను, అండ్‌ డైట్‌లో కార్బ్స్‌ ఇంకా తగ్గించేయాలి. ప్రొటీన్స్‌ ఆడ్‌ చేయండి.. ఓకే, రేపు హిప్‌ లిఫ్ట్స్‌? ఫ్లిట్టర్‌ కిక్స్‌, సిసర్‌ కిక్స్‌, వి`సిట్స్‌, అప్స్‌ ఆడ్‌ చేస్తాను. డోంట్‌ వర్రీ... మీ పొట్ట తగ్గి బాడీ మంచి షేప్‌లోకి వచ్చేస్తుంది. యువర్‌ హస్బెండ్‌ స్టార్ట్స్‌ లవింగ్‌ యూ మోర్‌... శారదగారూ, జిమ్‌ కోచ్‌ సునయన కన్ను కొడ్తూ చిలిపిగా నవ్వింది. శారదా నవ్వింది. కానీ నీరసంగా, ఇబ్బందిగా. దేహ కొలతలు సంతృప్తిగా ఉంటేనే ఎక్కువ ప్రేమించే భర్త ఎందుకు? తన
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
సంభాషణ

వాళ్లేం నేరం చేశారు?

గోమియా, న‌వాదీయ్ ఆదివాసుల గురించి  ఆలోచిద్దాం జార్ఖండ్‌ జనాధికార మహాసభ తన సహచర సంస్థలు (ఆదివాసి , మూలవాసి సంఘటన్‌, బోకారీ, ఆదివాసి ఉమెన్స్‌ నెట్‌వర్క్‌, బగైచా తదితర సంస్థలు) కలిసి ఆగస్ట్‌ 2021- జనవరి 2022 మధ్యకాలంలో బోకారీ జిల్లా  గోమియా & నవాదీయ్‌ డివిజన్‌ పరిధిలో (బ్లాక్‌లో) అమాయకులైన, నిర్దోషులు ఆదివాసీలు, నిర్వాసితులు మావోయిస్టులని, ఇతర తప్పుడు ఆరోపణపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసింది. దాదాపు 31 మంది పీడిత కుటుంబాలను, బాధితులను విచారణ చేసింది. ఈ నిజనిర్ధారణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాధితుల పరిస్థితులను అర్థం చేసుకోవడం,
కవిత్వం

ములాఖాత్

వారం వారం దాటుకొనిసోమవారం వచ్చిందిఈసారైనా కలవచ్చాఅనిఊరు నుండి బస్సు పట్టుకొనినగరం చేరుకున్న.కానీచంచల్ గూడా జైలుదారి తెలియదుమిత్రున్ని ఒకరిని పట్టుకొనిఎలాగైనాఈరోజు ములాఖత్ పెట్టాలని పోయా..! అదిములాఖత్ హాలుఎందరి ఎదురుచూపులోగుండె గవాక్షాల నుండి చూస్తున్నట్టువంద ఆలోచనలుగొంతు దాటి రాకుండామౌనం దాల్చినట్లు ఏ వార్త వీనుల విందయిఎప్పుడు విముక్తి తీరం చేరుతుందోఈ బందీఖానాలన్నివృద్దాశ్రమాలౌతాయేననిచిగురించే ఆశలు. అందరినీ చూస్తూమనస్సులో మదన పడుతున్నక్రమంలోనేవార్డర్ నుండిఒక పిలుపుఇంతలో నా పేరు వినబడిందిములాఖత్ గది తలుపు తెరుచుకుంది. నిఘా నేత్రాలవలయంలో చిక్కినపంజరంలోని పక్షులుఎందరోవాళ్ళేరాజకీయ ఖైదీలుప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతిరూపాలు. ఎదురుచూపులకు తెరదించుతూరానే వచ్చాడు కామ్రేడ్ రాజన్ననడక సాగుతలేదుగొంతు పెగుల్తలేదుకుశల ప్రశ్నలు పరంపర సాగిందిమధ్య మధ్యలో రాజన్ననుదగ్గు ముచ్చటిస్తూనే ఉన్నదినీరసం తోడూ
ఆర్థికం

కార్పొరేట్‌ సేవలో మోడీ ప్రభుత్వం

కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న పాలకుల ప్రగల్భాలు నిజం కాదని తేలిపోయింది. ఏ రంగంలో చూసిన ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, భూటాన్‌లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. మనదేశ ఆర్థిక వ్యవస్థ కూడ పతనం దిశగా వేగంగా దిగజారుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తు పట్ల ప్రజల్లో భయాలు పెరిగిపోతున్నాయి. ఎనిమిది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్‌ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. ''బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ప్రభుత్వమైన పెట్టుబడిదారుల పనులను చక్కబెట్టే కార్యనిర్వాహక కమిటి'' అని మార్క్స్‌ 1850 థకంలోనే తెలపాడు. అధికార బదిలీ జరిగి ఏడున్నర
లోచూపు

అంబేద్కర్ అస్తిత్వవాది కాదు -అచ్చమైన దేశీయ ఆధునికతా వాది

భారతదేశంలో కుల సమస్యకు, స్త్రీ సమస్యకు సంబంధించి చాలా ఆధునికంగా ఆలోచించిన వాళ్ళల్లో అంబేద్కర్ చాలా ముఖ్యుడు. అందుకే ఆయన దేశీయ చరిత్రలోకి వెళ్లి లోతుగా పరిశోధించి కుల వ్యవస్థ మూలాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కులం పనితీరును, చారిత్రక గమనంలో దాని మార్పు క్రమాన్ని పరిశీలించి వివరించాడు. అయితే ఆధునికత వైపుగా జరగాల్సిన సామాజిక మార్పు క్రమానికి సంబంధించిన నిర్దిష్టత పట్ల అత్యంత సీరియస్ గా, మౌలికంగా ఆలోచించిన ప్రజా మేధావి అంబేద్కర్. అలాగే భారత సమాజాన్ని ఆదిమయుగపు అవశేషాలను నిలుపుకుంటూ వస్తున్న ఒక 'నాగరిక' సమాజం అని అంబేద్కర్ నిర్వచించాడు. అలాంటి ఆటవిక అవశేషాలలో
సంభాషణ

అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!

ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం
కవిత్వం

నాలుగు పిట్టలు

నాలో తప్పిపోయిననీవు నీకు ఇంక ఎప్పటికీ దొరకవు!ప్రేమ భావన,గొప్ప ఆకర్షణ!!* * *నాకే తెలియదు నాలో ఇంతలోతు ఉందని!నా లోంచి నువ్వు ఎప్పుడుబయటపడదామనీ!?* * *నీ నవ్వుఓ పరిమళపు లోయ!అందులో దిగాను కాబట్టేనేను పూవునైపోయా!!* * * *ఎవరు పారబోసుకున్నమోహ స్వప్నమో, కదా ఈ రాత్రి!నింగి ఊయలలో,చీకటి-వెన్నెల రెండూ పెనవేసుకున్నాయి!***ఈ కాలానిదెంత నిర్దయ!కాకలుతీరిన యోధులను,ఆకలి తీరని దీనులను,ఎదురెదురు నిలబెడుతోంది!!***ఇక్కడ కొంతస్వేచ్ఛని వొదిలి,ఆ పక్షి రెక్కలు విచ్చుకునేచనిపోయింది!***ఈ కష్టకాలం సుదీర్ఘమైనదనీ,అనుకుంటాం కానీచరిత్ర పుటల్లోకి ఇంకిపోయినమానవ సంఘర్షణతో పోల్చుకుంటే క్షణభంగురం!!****యుధ్ధం ముగించాలనివాడికి లేదు!కానీ వాడికి తెలియదుఏదో ఒక నాడు వాడూ దిగిపోక తప్పదు!!***యుధ్ధం ముగిసాక,శిధిలాల్లో వాళ్ళు శవాలకోసంవెతుకుతున్నారు!కానీ,దొరికింది ముక్కలైన పసివాళ్ళ స్వప్నాలు!***యుధ్ధం
వ్యాసాలు

జనశక్తి నాయకులు కామ్రేడ్ కూర రాజన్న అరెస్టు – కోర్టు వాయిదాలు- అనారోగ్యం  

ఆగస్టు 1, 2022న మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఓ ఇంటి వద్ద సిపిఐ (ఎం- ఎల్‌) జనశక్తి నాయకులు కామేడ్‌ కూర రాజన్నను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారన్న విషయం విధితమే. ఈ అరెస్టు విప్లవ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించారు. అలాగే ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కామ్రేడ్‌ కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 17న రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలందరు రాజన్న అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తూ, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని