దండకారణ్య సమయం

మన కాలపు భగత్‌సింగ్‌తో కలిసి నిలబడటం కష్టం

ఛత్తీస్‌గఢ్‌లో 29 మందిని చంపిన సందర్భం మొదటగా, బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశంలోని మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని భగత్ సింగ్ నమ్మాడు. గుర్తుంచుకోండి, అందరూ కాదు –మెజారిటీ. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి పెద్ద పాలులో భారతీయులు ప్రయోజనం పొందుతూండేవారు. వారికి మద్దతుగా వుండేవారు. వారే రాజులు-చక్రవర్తులు, భూస్వాములు-నవాబులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, పోలీసులు, సైన్యం మొదలైనవారు . బ్రిటీష్ ఉన్నతాధికారులు (బ్యూరాక్రసీ), న్యాయమూర్తులలో అధిక భాగం భారతీయులే. సైన్యంలో మెజారిటీ భారతీయులు, పోలీసులలో భారతీయులు మాత్రమే ఉన్నారు. రెండవది, భగత్ సింగ్, అతని సహచరులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలించి పారేయాలని  నిర్ణయించుకున్నారు. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో కాదు,
దండకారణ్య సమయం

బస్తర్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక చర్యలో చనిపోయినవారిలో సాధారణ గ్రామస్థులు

భద్రతా దళాలు 2017 సంవత్సరం తరువాత జరిగిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక చర్యగా చెబుతున్న ఘటనలో  బస్తర్‌లో పోలింగ్‌కు పదిహేను రోజుల ముందు, పదముగ్గురిని చంపాయి. వారిలో కనీసం ఇద్దరు ఆదివాసీ గ్రామస్థులు, వారిలో ఒకరు చెవిటి బాలిక. ఈ కథనంలో లైంగిక హింస, పోలీసు క్రూరత్వం, ఇతర రకాల హింసల ప్రస్తావనలు ఉన్నాయి కమ్లీ కుంజమ్‌కి కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, కడుపునొప్పి, సరిగ్గా తినలేకపోతోంది. 2024 ఏప్రిల్ 2, ఉదయం 9 గంటలకు, ఆమె నేంద్ర గ్రామంలోని తన మట్టి ఇంటి వరండాలో పడుకుని, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు  పోలీసులు ఇంట్లోకి రావడంతో భయపడి లోపలికి
దండకారణ్య సమయం

బస్తర్‍లో సైనికీకరణ

దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో అత్యధికంగా సైనికీకరణ జరుగుతున్న  ప్రాంతాలలో బస్తర్  ఒకటి. తరచుగా అక్కడ "తిరుగుబాట్లు",  పోలీసు "ఎన్‌కౌంటర్లు" జరుగుతుంటాయి. గణనీయమైన ఆదివాసీ జనాభా వున్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ దేశంలోని భారీ సైనికీకరణ జరుగుతున్నా ప్రాంతాలలో ఒకటి. ఇది తరచుగా సాయుధ పోరులు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సైనికీకరణ ధోరణి దక్షిణ ఒడిషా వంటి పొరుగు ప్రాంతాలకు కూడా విస్తరించింది, ఈ ప్రాంతమంతటా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అడ్డూ అదుపూ లేని ఈ సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి.  "ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నిరసనలలో  ఎవరైనా అందులో భాగం కావచ్చు" అని
దండకారణ్య సమయం

ఏకకాలంలో శాంతి చర్చలు – సైనిక చర్యలు

దేశంలో దండకారణ్యం వంటి విశాలమైన ఆదివాసీ ఆవాస భూగోళంలో, జనతన రాజ్యం వంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అక్షరాలా సాయుధ వర్గ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడుతూ ఎన్‌కౌంటర్‌లు మొదలు కేంద్ర ప్రభుత్వ వాయు సైన్య ఆకాశ బాంబింగ్‌కు కూడ గురవుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌ రాష్ట్రాలు మొదలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమాజాలు జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌ (ఆదివాసి స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు ప్రతిఘటన మాత్రమే కాదు, ఇంకా విస్తృతార్థంలో అస్తిత్వ స్వీయ గౌరవ చైతన్యం)లను కాపాడుకోవడానికి నూతన పోరాట రూపాలు ఎంచుకుంటున్నారు. అటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణ రూపాలను
దండకారణ్య సమయం

దండకారణ్య నిర్మాణ చిత్తరువు

నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమాన్ని ప్రజాపంథాలో పునర్నిర్మించడానికి అట్టడుగు స్థాయి నుంచి ప్రయత్నించిన నాయకుల్లో కటకం సుదర్శన్‌ ఒకరు. ఆనంద్‌ పేరుతో ఆయన సింగరేణి బొగ్గుబాయిల నుంచి, బస్తీల నుంచి, కళాశాలల నుంచి, పల్లెల నుంచి పని ఆరంభించి ప్రజాపంథాను సృజనాత్మకంగా ఆవిష్కరించి గోదావరి తీరం దాటించి దండకారణ్యం దాకా విస్తరింపజేశాడు. అక్కడి నుంచి వివిధ రంగాల్లో తన సహచరులతో కలిసి దేశవ్యాప్తం చేశారు. ఆచరణలో వర్గపోరాటం ఎన్నెన్ని తలాల్లో, ఎన్నెన్ని రూపాల్లో సాగడానికి అవకాశం ఉన్నదో నిరూపణ కావడానికి ఆయన అజరామర నాయకత్వం దోహదం చేసింది. ప్రత్యామ్నాయ ప్రజాఽధికారం, కింది నుంచి ప్రజాస్వామ్యం, అన్ని
వ్యాసాలు దండకారణ్య సమయం

కోత్రి వంతెన ఎవరి కోసం? 

వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం