విశ్లేషణ

సందిగ్ధత విప్లవానికి దారి చూపుతుందా?

ప్రముఖ కవి విమల సారంగ అంతర్జాల పత్రికలో రాసిన కొత్త కవిత ‘కాల యవనికపై నిలిచి..’ ఈ కాలపు విషాదాన్ని గాఢంగా పలికింది. వేలాది, లక్షలాది మంది దు:ఖాన్ని ఆమె తన గొంతులో వినిపించారు. కవిగా విమల లోతైన చూపే ఆమె కవితా శిల్పం. అందులో తీవ్రమైన దు:ఖం, ఆర్తి ఉంటాయి. ఒక రకమైన అంతర్‌ దృష్టి ఉంటుంది. చాలా బరువైన, తాదాత్మ్య భావనలతో ఆమె కవిత్వాన్ని నిర్మిస్తారు. తాను ఏమనుకుంటున్నదీ సూటిగా చెప్పేస్తారు. తన వ్యక్తిత్వంలోంచి తన వైఖరులను కవిత్వం చేస్తారు. వస్తువు, దృక్పథం ప్రధానమైన కవిత్వంలో శిల్పం ఎలా ఉంటుందో విమలలో చూడవచ్చు. అది చాలా
దండకారణ్య సమయం

భారత రాజ్యం బస్తర్ పిల్లలను ఎలా చంపుతోంది?

రామ్లీ వయస్సు 17 సంవత్సరాలు. కానీ ఆసుపత్రిలో తన తల్లి వెనుక నిలబడిన ఆమెను చూసినప్పుడు 14 సంవత్సరాల కంటే పెద్దదానిలా అనిపించలేదు - లోతైన, సున్నితమైన కళ్ళలో తీక్ష్ణమైన  చూపుతో నిటారుగా నిలబడి ఉంది. శాలువా కప్పుకుని ఉన్న ఆమె ఆందోళనతో ఉన్నట్లుగా అనిపిస్తోంది. నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తోంది. అప్పుడప్పుడు చిరునవ్వులు చిందిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, బస్తర్ ప్రాంతంలోని భైరామ్‌గఢ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇచ్చిన చీటీలో ఆమె వెన్నెముక దగ్గర ఒక ‘బయటి వస్తువు’ చిక్కుకున్నట్లు మాత్రమే ఉన్నది.  ఏ వివరణా ఇవ్వని ఆ చీటీ మరొక ఆసుపత్రికి వెళ్ళమని సూచించింది. రామ్లి తల్లిదండ్రులు రాజే, విజ్జాలతో
కాలమ్స్ లోచూపు

మార్క్స్- అంబేద్కర్ : మానవ విమోచనా దృక్పథాలు 

మానవ విమోచనను మార్క్స్, అంబేద్కర్ లు ఎలా అర్థం చేసుకున్నారు? మానవ విమోచన పట్ల వాళ్ల అవగాహనల గురించి ప్రఖ్యాత రచయిత, పౌర హక్కుల నేత, ప్రజా మేధావి ఆనంద్ తేల్ తుంబ్డె  చేసిన లోతైన ఆసక్తికరమైన విశ్లేషణ ఈ పుస్తకం. ఆయన రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని సి. పటేల్ తెలుగులోకి అనువదించగా భూమి బుక్ ట్రస్ట్ (హైదరాబాద్)  మూడవ ముద్రణగా ప్రచురించింది. భారతదేశ చరిత్రలో వివిధ రంగాలలో ఆవిర్భవించి ముందుకు వచ్చిన మానవ విమోచనకు సంబంధించిన దృక్పథాలలో   మార్క్సిస్ట్, అంబేడ్కరిస్టు దృక్పథాలు   ముఖ్యమైనవి . భారత సమాజపు పితృ స్వామిక, కుల, వర్గ పునాదుల రీత్యా అవి
దండకారణ్య సమయం ఇంటర్వ్యూ

“ఆపరేషన్ కగార్” సైనిక గడువు అదివాసులను అంతం చేయడానికే : సోనీ సోరి

(బస్తర్ లో ఈ రోజుల్లో ఒక మారణహోమం జరుగుతోంది. అక్కడ నక్సలైట్ల పేరుతో అర్ధ సైనిక బలగాలు పెద్ద ఎత్తున ఆదివాసీలను హత్య చేస్తున్నాయి. ఆదివాసీల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఎలా స్వాధీనం చేయాలి అనేది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి అంటున్నారు. మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి మీనా కందసామి సోనీ సోరీతో మాట్లాడారు. ఫ్రంట్ లైన్ లో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూ ను ఇక్కడ అందిస్తున్నాము - ఎడిటర్) మీనా కందసామి: కార్యకర్తల అరెస్టుల పెరుగుదల గురించి నా మొదటి ప్రశ్న. మూల్‌వాసీ బచావో మంచర్ (ఎంబిఎం)
కాలమ్స్ మీరీ పుస్తకం చదివారా ?

‘మన్‌ కీ బాత్‌ : వొట్టి మాయా పాచిక’

A poem is what happens when it is read- Christopher Caudwell భారతీయ సాహిత్యంలో తనకంటూ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కవి అఫ్సర్‌. కథ, కవిత్వం, విమర్శ ఏది రాసినా తనదైన భావజాలానికి అతీతంగా, తనదైన శైలికి భిన్నంగా రాయరు. అఫ్సర్‌ ఏది రాసినా పదికాలాలు గుర్తిండిపోయే అక్షరాలకు జన్మనిస్తాడు. ప్రగతిశీల రక్తకణాలను నరనరాల్లో నింపుకుని పిడికిలి బిగించి విప్లవోద్యమాన్ని నడిపిన కౌముది కొడుకే అఫ్సర్‌. ఈ తరానికి ఆయన కవిగానే తెలుసు. కానీ ఆయనది నాల్గున్నర దశాబ్దాల సుధీర్ఘ సాహిత్య ప్రయాణం. సమసమాజ నిర్మాణానికి రాళ్ళెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే! దేశంకాని దేశంలో
వ్యాసాలు

బడ్జెట్‌ 2025-26 కష్టజీవుల కడుపు కొట్టి కార్పొరేట్లకు

దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వారా డిమాండ్‌ పెరగడం మార్కెట్‌ ను ఉద్దీపన చేసెందుకై, తద్వారా కొత్త పరిశ్రమలకు అవకాశం, కొత్త ఉపాధి కల్పించడం లక్ష్యం - ఇదీ క్లుప్తంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి శ్రీమతి సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పిన మాటలు. దానికి ఆమె ఎంచుకున్న మార్గం ఉన్నత మధ్యతరగతి వేతన జీవులకు పన్ను రాయితీ. ఉన్నత మధ్యతరగతిని దేశాభివృద్ధికి చోదకశక్తి గా ఆమె పొగడ్తల వర్షం కురిపించారు.   దేశాధ్యక్షులు శ్రీమతి ముర్మూ గారు  అదే పాటను పాడడం గమనార్హం.  మొత్తం కార్మిక శక్తిలో ఒక వంతుకూడా
కరపత్రాలు

ఎవరీ ఆదివాసులు? వాళ్ళను ఎందుకు మన ప్రభుత్వం చంపుతోంది ?

ఈ మధ్య ఆదివాసులను  పోలీసులు కాల్చేస్తున్న వార్తలు మీరు పత్రికల్లో చదివే ఉంటారు. టీవీల్లో చూసే ఉంటారు. ఒక్కోసారి ఇరవై మందిని, ముప్పై మందిని ఎన్‌కౌంటర్‌ పేర చంపేస్తున్నారు. ఈ ఘటనలు   మన పొరుగునే ఉన్న చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, రaార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయి.  ఇంతకూ ఎవరీ ఆదివాసులు? వాళ్లను ఎందుకు ఇట్లా కాల్చేస్తున్నారు? అనే ప్రశ్న మీకు తలెత్తే ఉంటుంది. ఆదివాసులంటే  అడవుల్లో జీవించే జనాలు. మనమంతా ఆదివాసుల నుంచే వచ్చాం.  మన మూలాలు ఆదివాసుల్లో ఉన్నాయి.  ఏది తినాలో, ఏది తినకూడదో మొదట ఆదివాసులే తెలుసుకున్నారు. ఏ నొప్పికి ఏ ఆకు వాడాలో, ఏ
సమకాలీనం

ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు  రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు
విశ్లేషణ

సామ్రాజ్యవాద వైరుధ్యాలలో కొత్త సమస్యలు,ఉద్రిక్తతలను తెచ్చే ట్రంప్ ప్రతిపాదనలు

 యుద్ధ నిబంధనలను మార్చడం ద్వారా ఉక్రెయిన్ లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించాలని అమెరికా ఆరాటం             1. గత మూడు దశాబ్దాలుగా అబివృద్ధి చెంది, రూపు దిద్దుకున్న అమెరికా సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల గురించి (రెండవసారి అధికారం చేపట్టిన) ట్రంప్ పరిపాలనా వ్యవస్థ స్పందించింది. అదిప్పుడు సాపేక్షికంగా తిరోగమించాల్సి రావడమేకాక, దాని ప్రత్యర్థులు(రష్యా, చైనా) దగ్గరై. తన ప్రపంచాధిపత్యాన్ని సవాలు చేసేవిగా తయారయ్యారు. ఈ మౌలిక సమస్యలు ఏమంత దూరంగా లేవని భావించిన ట్రంప్ పరిపాలనా వ్యవస్థ వీటి పైన దృష్టి సారించింది. ఈ పరిణామాలు అమెరికాకు ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, అవి ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికాకు తన 
కవిత్వం

పొద్ధై పొడిచింది

ఆకలికి పుట్టిన మొదటి బిడ్డ తానువెన్నెల వాకిట్లో పెరిగిన తులసి మొక్క తానుచెదిరిపోయే అడుగులకు గమ్యాన్ని చూపించేఅరుణతార తానుతూటాలను తాకిన దేహాన్ని కౌగిలించుకున్న అందమైన ప్రకృతి తాను ఎర్రమందరాలను కొప్పున చుట్టుకుని ఎడమ చేతితో కొడవలి సరిపించుకునిరాజ్యంలోని కలుపు మొక్కలను పికేయ్యడానికై బయలుదేరిన వ్యవసాయ కూలీ తానుతానే పుట్టిందితానే పెరిగింది తానే యుద్ధం చేసిందితానే గెలిచింది తానే మరణించింది మళ్ళీతానే పొద్దై పొడిచింది.