అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం
ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ శకం శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రారంభమై, ఒక ఉప్పెన పొంగిన కొద్దికాలానికే చౌరీచౌరా ఘటనతో వాటిని ఉపసంహరించడం జరిగింది. 1922 మార్చిలో గాంధీ బందీ అయ్యాడు. మరొక ఐదారు మాసాలలోనే సీతారామరాజు పోరాట పతాకం ఎత్తాడు. తెలుగుదేశానికి సంబంధించి పల్నాటి పుల్లరి సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ పోరాటం, చీరాల-పేరాల మునిసిపాలిటీ వ్యతిరేక పోరాటం, మధ్యతరగతి ప్రజల వరకైనా జాతీయ










