వ్యాసాలు

తిజిమాలి: అప్రకటిత ఘర్షణ ప్రాంతం

తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురుతున్నాయి. గత మూడేళ్లుగా వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న "మా మాటి మాలి సురక్ష మంచ్" నాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో, సుమారు 200 మంది పోలీసులు, పారామిలిటరీ దళాలు వరుసగా మూడు గ్రామాల్లోకి ప్రవేశించి, రాయగడ SDM, కాశీపూర్ JMFC జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను సురక్షా మంచ్ నాయకుల ఇళ్ల గోడలకు అంటించారు. ఫిబ్రవరి 26న వారు
వ్యాసాలు

ఒడిశాలోని రూర్కెలాలో రైల్వే విస్తరణనువ్యతిరేకించిన ఆదివాసీ హత్య: నిర్వాసిత్వ ముప్పు

2026 ఫిబ్రవరి 20 ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్‌గఢ్‌లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే... మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్‌పాత్‌లతో కూడిన రహదారులు మాత్రమే కనిపిస్తాయి. అయితే, వాటికి ఆవల దశాబ్దాలుగా ఒక పోరాటం సాగుతోంది, కానీ అది ప్రధాన స్రవంతిలో ఎక్కడా కనిపించదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎస్‌ఎఐఎల్) నడుపుతున్న భారీ రూర్కెలా స్టీల్ ప్లాంట్  కారణంగా రూర్కెలాను ఒడిశా "ఉక్కు నగరం" (ఇస్పాత్ నగర్) గా పిలుస్తారు. భారతదేశ పారిశ్రామిక "అభివృద్ధి"కి, అపారమైన ఖనిజ నిక్షేపాలకు రూర్కెలా ఒక కేంద్రంగా గుర్తింపు పొందింది.
Uncategorized వ్యాసాలు

ఒడిశాలోని లాంజిబెర్నా గ్రామంలో దాల్మియా గనితవ్వకాల విస్తరణ : గ్రామస్తుల నిరసన

2026 మార్చి 5  (ఈ కథనం ఒడిశాలో గని తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ ఉద్యమాలు, సమస్యలపై క్షేత్రస్థాయి నివేదికల పరంపరలో ఒక భాగం.) మేరీ జెమా కుల్లుకు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిపూట కొంచెం శబ్దం వచ్చినా ఆమెకు మెలకువ వచ్చేస్తోంది. ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో నిరంతరం వినిపించే డ్రిల్లింగ్ శబ్దాలు... వారు తమ ఇంట్లోకి వచ్చారని, దానిని ధ్వంసం చేస్తున్నారనే నిజాన్ని ప్రతి క్షణం ఆమెకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. 68 ఏళ్ల కుల్లు, ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలాకు గంట దూరంలో ఉన్న 'లంజీబెర్నా' అనే చిన్న
వ్యాసాలు

పుస్తకం ఇచ్చిన కానుక ఈ జీవితం – సుంకోజి దేవేంద్రాచారి

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సుంకోజి దేవేంద్రాచారి వృత్తి రీత్యా పాత్రికేయులు. వందకు పైగా కథలు, ఏడు నవలలు రాశారు. 'అన్నంగుడ్డ, ఒకమేఘం కథ, దృశ్యాలు మూడు ఒక ఆవిష్కరణ' కథల సంపుటాలు, 'నీరు నేల మనిషి, రెక్కాడినంత కాలం' నవలలు పుస్తకాలుగా తెచ్చారు. వీరు గ్రామీణ క్రీడలపై రాసిన కథనాలు 'మనమంచి ఆటలు' పుస్తకంగా వచ్చింది. "ఇప్పుడున్న నేను పుస్తకం చెక్కిన మనిషిని" అంటూ మాట్లాడే పుస్తకాల గురించి సుంకోజి దేవేంద్రాచారి   ఇలా అంటున్నారు... 1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయమయ్యాయి? ఈ ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. పుస్తకాలు అంటే.. ఏరకమైన
వ్యాసాలు

అక్కడ చమురు కోసం.. ఇక్కడ ఖనిజాల కోసం 

అమెరికన్ సామ్రాజ్యవాదం  ఫాసిస్టు ఇజ్రాయిల్ పాలకులతో చేతులు కలిపిన తర్వాత పశ్చిమాసియాలోచమురు వనరులపై ఆధిపత్యం కోసం గల్ఫ్ దేశాలలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేశారు.  దాదాపుగా అన్ని గల్ఫ్ దేశాలు అమెరికా సైనిక రక్షణ పేరుతో ఆర్థికంగాను, వాణిజ్యపరంగాను అమెరికా ఆంక్షలకు తలలూపినా, ఇరాన్ మాత్రం అమెరికా ఆంక్షలకు తల వంచక పోవడం వలన, మొదట ఆర్థిక, వాణిజ్య పరమైన ఆంక్షలు ఇరాన్ దేశంపై విధించిన అమెరికా, ఇప్పుడు ఏకంగా ఇజ్రాయులకి  ఇరాన్ కి గల శత్రుత్వాన్ని ఉపయోగించుకొని అణు, అన్వాయుధ తయారీ నిషేధం పేరుతో ఏకంగా ఇరాన్ పై యుద్ధాన్ని ప్రకటించి,  ఆదేశ అధ్యక్షునితో పాటుగా ముఖ్యమైన
వ్యాసాలు

మేధావులూ వారి నైతిక బాధ్యతలూ

(ఇది కా. కెవిఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రం. ఈ ఏడాదంతా ఆయ‌న ర‌చ‌న‌ల్లోంచి ఈ త‌రానికి కొన్ని వ్యాసాలు *కెవిఆర్ పాఠం* అనే శీర్షిక‌లో పాఠ‌కుల‌కు అందిస్తాం.. వ‌సంత‌మేఘం టీం) ఇంగ్లీషు భాషలోని ‘ఇంటలెక్చువల’కు సమానార్థకంగా ‘మేధావి’ అనే మాటను, రష్యన్ భాషనుంచి ఇంగ్లీషులోకివచ్చిన ‘ఇంటెలిజన్షియా’కు సమానార్థకంగా ‘బుద్ధిజీవులు’ అనే మాటను తెలుగులో వాడుతున్నాము. మొదటి మాటకు person possessing a good understanding, enlightened person  అని, రెండవదానికి the part of a nation that aspries to independent thinking అనిన్నీ ‘ద కన్సైజ్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ’ అర్థం చెబుతున్నది. ‘ది హిందూ’ పత్రిక (1967
వ్యాసాలు

వనరుల కోసమేనా యుద్దం?

‘పెద్ద దేశాలు చిన్న దేశాల వనరులను దోచుకోవడానికి యుద్ధాలు చేస్తాయి అన్నాడు’ లెనిన్. ప్రస్తుతం జరిగే యుద్దానికి మూల కారణం వనరులేనా! అమెరికా ఇరాన్ దేశం మీద అనేక అపోహలు పెట్టి తమ ఆదేశాన్ని కాదనడం వల్ల ఆ దేశం ప్రపంచ దేశాలకు ముప్పు తెచ్చిపెడుతుందని ప్రపంచానికి చెప్పి యుద్దం పరోక్షంగా  మొదలుపెట్టింది. నిజానికి యుద్దం బహిరంగంగా ప్రకటించలేదు పిల్లి ఎలుక కోసం మాటు వేసినట్టు ఎప్పటి నుంచో ఖమేనిని మాటు పెట్టింది సిఐఏ. బాహ్య రూపంగా చర్చలు జరిపినట్టు నటించి ఇరాన్ ప్రభుత్వం అంగీకరించని విదంగా తమ ఉద్దేశలను తెలిపింది. ఫిబ్రవరి 28 న ఖమేని ఇతర
వ్యాసాలు

యుద్ధాగ్ని ప్రపంచ సంక్షోభం

ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ప్రధాన యుద్ధాలు మరియు సంఘర్షణలు దేశాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. ఈ సంఘర్షణలు గ్లోబల్ ఎకానమీని, ఎనర్జీ మార్కెట్‌లను, ఫుడ్ సప్లై చైన్‌లను, షిప్పింగ్ రూట్‌లను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (2022 నుంచి కొనసాగుతోంది), ఇజ్రాయెల్-అమెరికా vs ఇరాన్ యుద్ధం (2026 ఫిబ్రవరి 28 నుంచి పూర్తి స్థాయి యుద్ధంగా మారింది), సూడాన్ అంతర్యుద్ధం, మయన్మార్ సివిల్ వార్, ఇతర చిన్న సంఘర్షణలు (యెమెన్, సొమాలియా, హైతీ, సాహెల్ రీజన్, ఇతర ఆఫ్రికా ఇన్‌సర్జెన్సీలు) కొనసాగుతున్నాయి. ఈ యుద్ధాలు మిడిల్ ఈస్ట్‌లో మల్టీ-ఫ్రంట్ వార్‌గా విస్తరించాయి, గ్లోబల్ ఆయిల్ సప్లై
వ్యాసాలు

2025లో రికార్డు స్థాయిలో జర్నలిస్టుల మరణాలు: బాధ్యత ఇజ్రాయెల్దే

2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016 (పిఇసిఎ) కింద వేరే రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుస్ (పిఎఫ్యుజె) సెక్రటరీ జనరల్ అర్షద్ అన్సారి మాట్లాడుతూ, 2025 సవరణ తర్వాత పిఇసిఎ కింద 500 మందికి పైగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. న్యాయపరమైన కేసులు, అరెస్టులు, బెదిరింపులతో సహా జర్నలిస్టులపై పెరుగుతున్న ఒత్తిడితో పాకిస్తాన్ పోరాడుతున్నప్పుడు, జర్నలిస్టులను రక్షించే కమిటీ (సిపిజె) రూపొందించిన కొత్త ప్రపంచ నివేదిక- 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా
వ్యాసాలు

నాలుగు లేబర్ కోడ్ ల విప‌త్తు రాబోతోంది..

కేంద్రంలోని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోనికి రావడం జరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశంలోని కార్మిక సంఘాలు 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు జాతీయ సమ్మెను నిర్వహించడం జరిగింది. దేశంలో గల కార్మిక వర్గం నుంచి విశేష స్పందన వచ్చింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకకు తగ్గలేదు సరి కదా మరింత పట్టుదలతో నాలుగు లేబరు కోడ్లను అమలు చేయడానికి ముందుకు వెళుతుంది. వీటికి ముందు చేసిన కొత్త న్యాయ చట్టాలు విషయంలో కూడా ఇదే జరిగింది. దేశంలో