వ్యాసాలు

అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం

ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.      గాంధీ శకం శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రారంభమై, ఒక ఉప్పెన పొంగిన కొద్దికాలానికే చౌరీచౌరా ఘటనతో వాటిని ఉపసంహరించడం జరిగింది. 1922 మార్చిలో గాంధీ బందీ అయ్యాడు. మరొక ఐదారు మాసాలలోనే సీతారామరాజు పోరాట పతాకం ఎత్తాడు. తెలుగుదేశానికి సంబంధించి పల్నాటి పుల్లరి సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ పోరాటం, చీరాల-పేరాల మునిసిపాలిటీ వ్యతిరేక పోరాటం, మధ్యతరగతి ప్రజల వరకైనా జాతీయ
వ్యాసాలు

ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల కుమ్మక్కు.

రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యశాఖపై పర్యవేక్షణ కరువైంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు  నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువుల అమ్మకం యదేచ్ఛగా సాగిస్తున్నారు. వీటితో పాటు పాఠశాలల అనుమతులకు సంబంధించిన(ఎన్వోసి) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ, బస్సుల పిట్నేష్ సర్టిఫికెట్, పైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లు పొందుటకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయ
వ్యాసాలు

తొలిసారి నేను పుస్తకాలనుచూసిన, తాకిన గుర్తు -కొత్తపల్లి సురేష్

కొత్తపల్లి సురేశ్ కవి, గాయకుడు,ఉపాధ్యాయుడు, కవిసమ్మేళనం సాహిత్య వేదిక నిర్వాహకుడు, అనంతపురం జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు. తన విద్యార్థులతో కవిత్వం రాయిస్తున్న కార్యశీలి. కవిసమ్మేళనం సాహిత్య వేదిక ఫేస్ బుక్ గ్రూప్ లో డైలీ శీర్షికలు నిర్వహిస్తూ సాహిత్యకారులచే వ్యాసాలు రాయిస్తూ,వాటిని పుస్తకాలుగా తెస్తున్న సాహిత్య ప్రేమికుడు. లైఫ్ హాలిడే ( 2019 ) తన తొలి కవితాసంపుటి. శ్రీనివాస్ గౌడ్ , ప్రొ. జి వి రత్నాకర్ లతో కలిసి "అరాచకుడి స్వగతాలు" పేరుతో గొలుసుకట్టు కవిత్వ సంకలనం తెచ్చారు. తన అన్న పేరుతో తొమ్మిదేళ్లుగా ఏటా కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు.
వ్యాసాలు

“ప్రశ్నిస్తే కాల్చేస్తాం” – భరత్ భూషణ్ తివారీ “ఎన్ కౌంటర్?”

బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో భరత్ భూషణ్ తివారీ మరణించడం ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ ఎన్‌కౌంటర్‌ ఉదంతం పోలీసు వ్యవస్థ స్వరూపం, రాజ్యాంగ రక్షణలు, పౌర స్వేచ్ఛలు, ప్రభుత్వ సంస్థల జవాబుదారీతనం, పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం గురించి మరింత విస్తృతమైన చర్చకు దారితీసింది. బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లా బిలౌటి గ్రామానికి చెందిన ఒక పోలీస్ శాఖలో డ్రైవర్ గా పనిచేసిన కాశీనాథ్ తివారీ, ఆశాదేవీ దంపతుల నలుగురు సంతానంలో మూడోవాడైన ఏళ్ల భరత్ భూషణ్ తివారి బీఎస్సీ పట్టభద్రుడు. ఒకప్పుడు పోలీసు ఉద్యోగంలో చేరాలని
వ్యాసాలు

ఆంధ్రప్రదేశ్ లో కష్టోడియల్ హత్యలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక వికారమైన, వికృతమైన క్రీడ నడుస్తున్నది. మనిషికి అత్యంత మౌలికమైన, ప్రాథమికమైన జీవించే హక్కుకి అధికారికంగా తూట్లు పొడవటం ఈ క్రీడకి సంబంధించిన ఒక ముఖ్య పార్శ్వం. ఇటువంటి క్రీడని వెనకేసుకరావటం, ఇతోధికంగా మద్ధతు తెలపడం, మద్ధతు తెలిపేలా అన్ని మాధ్యమాల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని రెచ్చకొట్టడం మరొక పార్శ్వం. ఈ క్రీడ పేరు కష్టోడియల్ హింస. ఇంకా సూటిగా చెప్పాలంటే కష్టోడియల్ మరణాలు. ఎటువంటి శషభిషలు లేకుండా చెప్పుకోవాలంటే కష్టోడియల్ హత్యలు- ఇదే సరైన పదం కూడా.       గత ఒక్క నెలలోనే ఆంధ్రప్రదేశ్ లో కనీసం ముగ్గురు ఈ కష్టోడియల్ హత్యలకి బాధితులు
వ్యాసాలు

శ్రీకాకుళ  ఉద్యమ ఫలాలను పాతి పెడుతున్న పాలకులు.

 1967 - 71 వరకు జరిగిన శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాట ఫలితంగా ఏర్పడిన ఐటీడీఏలు ఆదివాసీ ప్రజలకు విద్య, ఉపాధితో పాటుగా ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాయని పాలకులు హామీ ఇచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా మొదట జీవో -3 ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగ రంగంలో ఉపాధి అవకాశాలను దెబ్బతీయగా, ఇప్పుడు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో ఆదివాసి ప్రాంతాలలోని కొన్ని ఆశ్రమ పాఠశాలల స్థాయి తగ్గింపు,  మరికొన్ని ఆశ్రమ పాఠశాలల మూసివేత ప్రక్రియకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు 1/70 చట్టాన్ని రద్దు చేయడం
వ్యాసాలు

ఎల్ నినో ముప్పు తప్పించగలమా?

ఈసారి రికార్డు స్థాయిలో వేసవి ఎండలు జనాన్ని ఫ్రై చేసి పడేశాయి. వాన చినుకు కోసం రైతులే కాదు, చిత్తడిని విసుక్కునే నగరవాసులూ ఎదురుచూశారు. జూన్ వచ్చింది, పోయింది కానీ ఆశించిన వర్షం కురవలేదు. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమవుతాయని, సగటు వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization- WMO), భారత వాతావరణ శాఖ (India Meteorological Organization- IMO) చెప్పినట్లుగానే జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడ్డాయి, దీని ప్రభావంతో రుతుపవనాలకు అంతరాయం ఏర్పడి, వర్షపాతం తగ్గుతుందని వాతావరణ నిపుణులు ప్రకటించాక ‘ఎన్ నినో’ అనే పదం
వ్యాసాలు

డేటా సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విపత్తుకు దారితీస్తుందా?

ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు  తొమ్మిది రోజుల్లో పర్యావరణ అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. నమ్మశక్యం కానీ ఉద్యోగాల సంఖ్య, భారీ ప్రోత్సాహకాలతో, ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నం, దేశంలో డేటా సెంటర్ల విషయంలో ఉన్న నియంత్రణా లోపాన్ని బట్టబయలు చేస్తోంది. తర్లవాడలోని వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్, అనకాపల్లిలోని వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్‌లకు సంబంధించిన ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ (పర్యావరణ నిర్వహణ ప్రణాళికలు) లోని ఒక పేజీలో  షాపింగ్ మాల్‌కు సంబంధించిన నీటి పొదుపు లెక్కలను పొందుపరిచారు. ఈ రెండు పత్రాలలోనూ,
వ్యాసాలు

ఫీజుల నియంత్రణ‌ ఆవశ్యకత-ప్రభుత్వ వైఫల్యం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధనను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని ప్రజలు వారి పిల్లలను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ ఆ సంఖ్య నేడు 60% కి పైగా పెరిగింది. విద్యాభోధన అనగానే ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో మాత్రమే నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందనే ‌భావన తల్లిదండ్రుల్లో నెలకొనే విధంగా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. దేశంలో మొదట విద్యాబోధన ప్రభుత్వరంగంలోనే కొనసాగినప్పటికీ 1986 లో మన పాలకులు విద్యారంగంలో ప్రైవేటీకరణకు అనుమతించడంతో పాటు గాట్స్
వ్యాసాలు

వివాదస్పదమవుతున్న న్యాయస్థానాల తీర్పులు…?

ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆయా వర్గ ప్రజలలో ఆందోళనలు రేకెత్తించాయి. ఈ తీర్పులు  సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కేవలం సాంకేతిక అంశాలపై కాకుండా అవి సహజ న్యాయానికి అనుగుణంగానూ, హేతుబద్దంగానూ ఉండాలన్న అభిప్రాయం ఆయా వర్గ ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.  ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దళితులు మతం మారితే వారి యొక్క ఎస్సీ,  ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని చెప్పడం జరిగింది. ఈ తీర్పు వలన తక్షణం