సంపాదకీయం

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర కోసమే కగార్‌

కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే
సంపాదకీయం

టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం.  వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి
వ్యాసాలు

మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

ప్రొ. జిఎన్‌ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఇందులోని ఆరుగురిలో మహేష్‌ టిర్కితోపాటు పాండు నరోటే, విజయ్‌ టిర్కి ఆదివాసులు. మిగతా వాళ్లు ప్రొ. సాయిబాబ, ప్రశాంత్‌రాహి, హేమ్‌మిశ్రా. పదేళ్లకు పైగా నడిచిన ఈ జీవిత ఖైదు కేసు బహుశా దేశ చరిత్రలోనే అరుదైన, అతి దుర్మార్గమైన కేసుగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ ఆరుగురి మీద కేసు పెట్టిందనే సంగతి ప్రజల కామన్‌సెన్స్‌లో కూడా భాగమైంది. ఈ ఆరుగురిలో ఒకరి(పాండు నరోటే) జీవితాన్నే హరించిన, ఐదుగురి పదేళ్ల
వ్యాసాలు

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉందని  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అనింది. అంటే పదేళ్లపాటు ప్రజాస్వామ్యంపట్ల ఖాతరు లేని బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఒకటికి రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని అర్థం. ప్రజాస్వామ్యం ధ్వంసమైపోయి కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగిలింది.  దాని ద్వారా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చిన పార్టీ భారతదేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మరే పార్టీకంటే ఎక్కువ కాలం పాలించింది. బిజెపిని మినహాయిస్తే మరే పార్టీకంటే ఎక్కువ దుర్మార్గాలకు, ప్రజా వ్యతిరేకత చర్యలకు పాల్పడిన గతం కాంగ్రెస్‌కు ఉన్నది. అలాంటి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి
వ్యాసాలు

దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు

విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

పసి పాపల నిదుర కనులపై ముసిరిన యుద్ధోన్మాదం ఎంతో..

పాలస్తీనా స్వేచ్ఛాకాంక్షపై జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లల మరణాలు ప్రపంచ మానవాళిని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా నెత్తురు ప్రవహించాల్సిందే. చరిత్ర పొడవునా రాజకీయాల కొనసాగింపుగా సాగిన యుద్ధాలన్నీ తీవ్రమైన విధ్వంసానికి, విషాదానికి కారణమయ్యాయి. ఏ నేల మీది జరిగే యుద్ధాలకైనా దురాక్రమణే లక్ష్యం. అది పాలస్తీనాలో ఒక రకంగా ఉండొచ్చు. కశ్మీర్‌లో ఇంకోలా ఉండొచ్చు. దేశం మధ్యలోని దండకారణ్యంలో మరోలా ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే దురాక్రమణ కోసం సాగే యుద్ధాలు పిల్లలను బలి తీసుకుంటాయి. పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం అనుభవిస్తున్న అనంతమైన దు:ఖం దండకారణ్యాన్ని కూడా
సంపాదకీయం

మావోయిస్టు పార్టీ మీద నిషేధంఎందుకు ఎత్తేయాలంటే…

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు.  దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని
వ్యాసాలు కొత్త పుస్తకం

ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు

(డిశంబర్ 23 న విజయవాడలో విడుదల కానున్న *కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం* పుస్తకానికి రాసిన ముందుమాట. *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం* ఈ పుస్తకాన్ని ప్రచురించింది.) ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే  పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా  కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే  లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్‌ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.
సంపాదకీయం

పోతూ పోతూ కూడా..

.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు.  ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి.  ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు  అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి,  పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా?  ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా?   అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు.  కాకపోతే  పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను  వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో