ఖండన

మణిపూర్‌ మారణహోమాన్నిఖండిద్దాం!దోషులను కఠినంగా శిక్షించాలి

(పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రచురణ) మణిపూర్‌ రాష్ట్రం మయన్మార్‌తో అర్జాతీయ సరిహద్దులు ఉన్న ఈశాన్య ప్రాంతంలో చిన్న రాష్ట్రం. 35 లక్షల జనాభా కలిగిన రాష్ట్రం. ఆదివాసేతరులు కొండప్రాంతాలు, భూములు కొనడానికి వీలులేదనే 371(సి) (అధికరణ ప్రకారం). భూ సంస్కరణ చట్టాన్ని సడలించాలని మైతీలు చేస్తున్న వాదనలకు భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్దత్తు తెలుపుతోంది. మైతీలు హిందువులు. నాగా, కూకీ, ఆదివాసీ తెగలు మెజారిటీ క్రైస్తవులు. మైతీలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. 10% భూ భాగంలో, మైదాన ప్రాంతంలో ఉన్న మైతీలు 53% జనాభా వల్ల రాష్ట్ర శాశనసభ
ఖండన

బెల్లాల పద్మ, దేవేందర్‌ అరెస్టులను ఖండించండి

జూన్‌ 18 సాయంకాలం గుంటూరు దగ్గర ఓ గ్రామంలో బెల్లాల పద్మను, అదే రోజు హైదరాబాదులో దుబాసి దేవేందర్‌ను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పద్మ అనేక అక్రమ కేసుల్లో సుదీర్ఘకాలంపాటు జైలులో ఉండి విడుదలై వచ్చింది. పద్మ అనే పేరు మీద నమోదై ఉన్న అక్రమ కేసులన్నిటినీ అమె మీద మోపి జైలు నుంచి బైటికి రాకుండా చేశారు. ఆ నిర్బంధాన్ని దాటి బైటికి వచ్చే సరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. తిరిగి మామూలు పరిస్థితికి రాలేదనంతగా శరీరం శిథిలమైపోయింది. అయినా ఓపికగా న్యాయశాస్త్రం చదివింది. ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే ఓపిక ఉన్నప్పుడు సభలకు హాజయ్యేది.
ఖండన

చంద్రశేఖర్‌ అజాద్‌పై ఫాసిస్టుల హత్యాయత్నం

ఫాసిస్టు బుల్డోజర్‌ బాహాటంగానే రాజకీయ హత్యాయత్నాలకు పాల్పడుతుంది. తన ఆధిపత్యానికి, రాజకీయ సమీకరణాలకు అడ్డంగా ఉన్న ఏ శక్తినీ అది భరించలేదు. దీనికి ఉత్తరప్రదేశ్‌లో భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌పై కాల్పులు ఉదాహరణ. జూన్‌ 28 బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు వెళుతుండగా ఆయన వాహనానంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో ఆయన శరీరంలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయని వైద్యులు తెలిపారు.  సహరాన్‌పూర్‌ ఆసుపత్రిలో  డాక్టర్లు ఆయనకు వైద్యం చేస్తున్నారు.             ఈ ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను దేశ ప్రజలందరూ గుర్తుపట్టగలరు. ఉత్తరప్రదేశ్‌లోని  ఫాసిస్టు రాజ్యం తీవ్రరూపాలు దేశమంతా తెలుసు.
ఖండన

తులసి చందు భావ ప్రకటనా స్వేచ్ఛను ఫాసిస్టులు అడ్డుకోలేరు

జర్నలిస్టు తులసి చందును బెదిరిస్తూ, అసభ్యకర మాటలతో నిందిస్తూ సంఫ్‌ుపరివార్‌ మూక దాడి చేయడాన్ని విరసం ఖండిస్తోంది. ఆమె గత కొద్దికాలంగా ప్రజా సమస్యల మీద వీడియోలు రూపొందిస్తోంది. అందులో ఆమె చెప్పే వాస్తవాలకు, విశ్లేషణలకు విశేష ఆదరణ దొరుకుతోంది. ఆమె తీసుకొనే ప్రజాస్వామిక వైఖరిని వీక్షకులు అభినందిస్తున్నారు. కల్లోలభరిత ప్రజా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఆమె మాటలు దోహదం చేస్తున్నాయి. జర్నలిస్టులైనా, రచయితలైనా ఫాసిస్టు వాతావరణాన్ని వివరిస్తూ వాస్తవాలు చెప్పడం తమ బాధ్యత అనుకుంటారు. సత్యాన్ని ప్రకటించని రచన, జర్నలిజం వ్యర్థం. కానీ సత్యమంటే ఫాసిస్టులకు భయం. సత్యం చెప్పేవాళ్లంటే కంటగింపు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల మీద, రచయితల
ఖండన

ఆదివాసులపై వైమానిక యుద్ధాన్ని ఖండించండి

రాజ్యంగ వ్యతిరేక ఫాసిస్టు దాడులపై ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేద్దాం ఏప్రిల్‌ 7వ తేదీ శుక్రవారం దండకారణ్యంలో మరోసారి భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. ఈ ఏడాది జనవరి 11న  గగన తల దాడులు జరిగిన మూడు నెలలకల్లా మరోసారి డ్రోన్ల నుంచి  బాంబులు విసిరారు. పామేడు ప్రాంతంలోని బట్టిగూడ, కవరగట్ట, మీనగట్ట,  జబ్బగట్ట గ్రామాల పరిధిలో తెల్లవారు జామున  ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆదివాసులు ఆ సమయంలో విప్ప పూలు ఏరుకోడానికి అడవిలోకి వెళ్లారు. కొందరు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన బాంబు దాడులు ఐదు నిమిషాల వ్యవధిలో వేర్వేరు