వ్యాసాలు కొత్త పుస్తకం

కులం – విప్లవోద్యమం

(త్వరలో విడుదల కానున్న *కులం - విప్లవోద్యమం* పుస్తకానికి రచయిత  రవి నర్ల రాసిన  ముందుమాట ) కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో
వ్యాసాలు కొత్త పుస్తకం

ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు

(డిశంబర్ 23 న విజయవాడలో విడుదల కానున్న *కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం* పుస్తకానికి రాసిన ముందుమాట. *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం* ఈ పుస్తకాన్ని ప్రచురించింది.) ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే  పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా  కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే  లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్‌ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.
కొత్త పుస్తకం సమీక్షలు

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది
సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

మహిళలు నిర్మిస్తున్న కొత్త ప్రపంచపు పోరాట  కథలు

46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు
సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

విప్లవోద్యమ కథాసమయం

(*వియ్యుక్క*  పేరుతొ  అజ్ఞాత రచయిత్రుల కథలు ఆరు భాగాలుగా విరసం తీసుకొస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇందులో మూడు  పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటి ఆవిష్కరణ ఈ నెల 24 న హైదరాబాదులో ఉంది. ఈ సందర్భంగా తొలి మూడు భాగాలకు వియ్యుక్క ఎడిటర్ బి. అనురాధ రాసిన ముందుమాట పాఠకుల కోసం ...వసంత మేఘం టీం ) పెన్నూ గన్నూ పట్టిన రచయిత అనగానే మనకి మొట్టమొదట గుర్తుకొచ్చేది సుబ్బారావు పాణిగ్రాహి. కానీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అందులోనూ ఒక చేత్తో గన్ను పట్టి పోరాటం చేస్తూ
కొత్త పుస్తకం

కాలం తయారు చేసిన కవి

ఇటీవల కవిత్వం రాస్తున్నయువతరంలో అనేక నేర్చుకోవాల్సినఅంశాలుఉన్నాయి .వారంతా నిశ్శబ్దంగా, మౌనంగా వర్తమానాన్ని అత్యంత లోతుగా చూస్తున్నారు .ఎక్కడ ఆర్భాటం లేదు రాజకీయ పరిపక్వత పొంది ఉన్నామని భావన లేదు. జీవితాన్ని రాజకీయాల్ని అంచనా వేసే క్రమంలో నిజాయితీ కనబడుతుంది .మన ముందు రూపొందుతున్న పిల్లలు కదా అమాయకత్వం నిండిన చిరునవ్వు ఇవే కదా వీరిలో అదనపు ఆకర్షణ అనుకునే దశ నుండి వారు హఠాత్తుగా కవిగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తారు .వారి కవితా ప్రపంచంలోకి దారి చేసుకుంటే ఇంతటి పరిపక్వత ఎలా వచ్చింది? ఈ పరిణితి వెనుక ఈ తరం పడుతున్న మౌనవేదనేమిటి ? వీరిని దుఃఖితులుగా చేస్తున్న
కొత్త పుస్తకం

హిందూమతం అబద్ధమని ఒప్పించే రచన

సి.యస్‌.అర్‌.ప్రసాద్‌ అనువాదం చేసిన  దివ్యా ద్వివేది, షాజ్‌ మోహన్‌, జె.రెఘు కలిసి రాసిన హిందూయిజం ఒక అబద్ధం అనే రచన వర్తమాన పరిస్థితులను అర్థం చేసుకోడానికి సైద్ధాంతికంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ ముగ్గురు వ్యాస రచయితలు హిందూ మతాన్ని, కుల వ్యవస్థను కలిపి చూశారు. అందుకే హిందూ మెజార్టీ వాదం అగ్రకులాల సృష్టి అనే ఉప శీర్షిక దీనికి ఉంది.             హిందూయిజాన్ని అర్థం చేసుకోడానికి అనేక చారిత్రక వాస్తవాలను వ్యాసకర్తలు ముందుకు తీసుకొచ్చారు.  హిందూత్వ సంస్కృతిక జాతీయవాద భావజాలాన్ని చారిత్రక  భౌతిక వాద దృక్పథంతో,  మార్క్సియన్‌ కోణంలో ఈ రచయితలు చూశారు. దీనికి  భారతీయ హిందూత్వ ఆధిపత్య
కొత్త పుస్తకం

రాయలసీమ ‘సాధన’ నవల

రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత  అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ.  ఇది వరకు చారిత్రక నవలలు, మనో  వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్‌ ఉంచారు.             కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు
కొత్త పుస్తకం

విప్లవ చారిత్రక నవల

‘‘తమ తిరుగుబాటు ఒక జార్‌ని దించేసి మరో జార్‌ని, లేదా మరో పాలకుడ్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు. ఒక మహాలక్ష్యం కోసం ఉద్దేశించినది’’సెర్గీమాట The secret of beauty is the secret of life. The beauty of life is the beauty of struggle. (Y. Borev : Aesthetics, p.44& 46)(జీవిత రహస్యమే సౌందర్య రహస్యం. సంఘర్షణ సౌందర్యమే జీవిత సౌందర్యం) జీవితం, సంఘర్షణ, సౌందర్యం - ఇవి ఒక విడదీయరాని త్రయం. రచయిత నాగభూషణ్‌  రచించిన బృహన్నవల ‘‘డిసెంబరిస్టు ఖైదీ’’ ఒక చారిత్రక నవల. ఒక ఉద్యమ చరిత్రను ప్రతిబింబించిన