ఆర్థికం

ఇరాన్ యుద్ధ ప్రభావం – ఆర్థిక సంక్షోభం

పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతులం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్లుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు
ఆర్థికం

ఇండో–అమెరికా ఒప్పందం: సామ్రాజ్యవాదపు పునర్వ్యవస్థీకరణలో భారత పాలక వర్గాల పాత్ర

2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన 50శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించిందని, ఇది మోదీ వల్లనే సాధ్యమయిందని ప్రకటించి మోదీకి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన ఎట్లా అమెరికా ఒత్తిడికి దాసోహం అయ్యాడనే వాస్తవాన్ని మరుగుపరచాలని మోదీ ప్రచార టీం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా పెట్టుబడులకు దాసోహం చేసే ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందంలో ఏముంది? భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని
ఆర్థికం

సంక్షుభిత‌ ఆర్థిక వ్యవస్థ – సమస్యల వలయంలో ప్రజలు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి. శ్రమదోపిడీ, వనరుల దోపిడీ, లాభాపేక్ష అనేవి అసమానతల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం అనేది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పేదరికం, అసమానతలు, తయారీ రంగంలో క్షీణత వంటి అంశాలతో ముడిపడి ఉంది.  దాని ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నది. ఎందుకంటే, ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను విడివిడిగా చూడలేని పరిస్థితి. రైతుల బాధలు, కార్మికుల అభద్రత, నిరుద్యోగ సమస్య, పౌష్టికాహార కొరత,
ఆర్థికం

రూపాయి ఘోర పతనం – శ్రామికులపై భారం

అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు, దేశీయంగా వ్యవస్థాగతమైన సమస్యల వల్ల ఇటీవలి సంవత్సరాల్లో డాలర్‌తో భారత రూపాయి మారకపు విలువ తగ్గుతూ వస్తోంది. ఈ నెలలోనైతే దాని విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇప్పుడు ఒక డాలరు కావాలంటే 90 రూపాయలకు పైగా వెచ్చించాలి. రూపాయి విలువ పడిపోవడం వ్యాపారులు, పారిశ్రామికవేత్తలనే కాదు భారతీయ విద్యార్థులనూ ఇబ్బందు ల పాల్జేస్తుంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు అయ్యే వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. డాలర్‌కు అంతర్జాతీయ రిజర్వు కరెన్సీ హోదా ఉంది. దాని విలువ స్థిరంగా కొనసాగుతుండటం మరో అంశం. బంగారం, చమురుతో పాటు ఆహారధాన్యాలు, ముడి ఖనిజాలు తదితరాల
ఆర్థికం

డీలా పడనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

2025 సెప్టెంబర్‌ 22-26 తేదీల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం న్యూయార్క్ లో జరుగుతున్న వేళ, ప్రపంచ ఆర్థిక వేదిక సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, కృత్రిమ మేధ ప్రభావం, స్థిరమైన ఆర్థికం వంటి ప్రపంచ సవాళ్లపై దృష్ట సారించింది. ఆర్థిక వృద్ధిలో నెలకొన్న అనిశ్చితి, శ్రామికశక్తి భవిష్యత్తును పరిశీలించింది. అభివృద్ధి సంక్లిష్టతను చర్చించేందుకు 22-26 తేదిల్లో స్థిరత్వం, ఆర్థికవృద్ధి, బాధ్యత యుతమైన సాంకేతికపై, పురోగతిని చర్చించడానికి ప్రపంచ దేశాల నుండి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నూతన తయారీ సాంకేతికతలకు మార్గదర్శకత్వం వహించే సైట్‌లను గుర్తించింది. ఈ నెట్‌వర్క్ ల కోసం 12 మంది
ఆర్థికం

పెరుగుతున్న కుబేరులు, అప్పుల్లో ప్రభుత్వాలు

వరల్డ్‌ ఆఫ్ డెబ్ట్‌ రిపోర్ట్‌- 2025 ని ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి కాన్ఫరెన్స్‌ (యుఎన్‌సిటిఎడి) ప్రచురించింది. 2024లో ప్రపంచ ప్రజారుణం రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచ జనాభా 820 కోట్లు. తలసరి సగటు అప్పు ఒక్కరికి రూ 11 లక్షలు ఉంటుంది. ప్రపంచ జిడిపి 110 ట్రిలియన్‌ డాలర్లు కాగా ప్రపంచ రుణం 102 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అంటే మొత్తం జిడిపిలో 93 శాతం వరకు రుణం ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర‌మైన  రుణ భారాన్ని మోస్తున్నాయి. ఈ నివేదిక 2024 వరకు దృష్టి సారించినప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇవాళ ఆరోగ్యం,
ఆర్థికం

పాలస్తీనియన్లను తుడిచిపెట్టే  పన్నాగం

ద‌శాబ్దాలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగ‌తాల‌కు అడ్డు క‌ట్ట  వేయాల‌ని, పాలస్తీనా భూభాగాల ఆక్రమణల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని గాజాలోని హమాస్‌ అనే మిలిటెంట్‌ సంస్థ 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ భూభాగాల‌లోకి చొర‌బ‌డి  251 మందిని బందీలుగా చేసుకొని అపహరించింది. దీనికి  ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులు మొద‌లు పెట్టింది.  అప్ప‌టినుంచి ఇజ్రాయెల్‌ మారణకాండ కొనసాగిస్తూనే ఉంది.  గాజా ప్రపంచంలోనే అత్యధిక జన సాంధ్రత గల ప్రదేశం. 22 మాసాలుగా గాజాలో ఇజ్రాయెల్ మాన‌వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న‌ది. ఇప్పటివరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతా న్ని శిథిలాల కుప్పగా మార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ జారవిడిచిన బాంబులు
ఆర్థికం

దండకారణ్యంలో మావోయిస్టులపై కార్పొరేట్ యుద్ధం

బిజెపి ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోడానికి కావలసిన బలమైన పునాదిని ఆరెస్సెస్‌ అందిస్తోంది. మాతృసంస్థగా ఆరెస్సెస్‌, దాని రాజకీయ వేదికగా బిజెపి రెండిరటికీ మధ్య సమన్వయం, ఉమ్మడి పని విధానం గత దశాబ్ధ కాలంలో బాగా బలపడ్డాయి. ఫాసిస్టు స్వభావం గల బిజెపి రాజకీయ పార్టీగా ఆధిపత్యం సాధించింది. 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో మనువాద ఫాసిస్టు స్వభావం గల మితవాద, మతోన్మాద, నిరంకుశ శక్తులు బలపడ్డాయి. హిందూత్వ  బడా బూర్జువా-భూస్వామ్య వర్గాలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతినిధిగా ఉంది. ఆ వర్గాల మద్ధతును తన వెనుక బలంగా సమీకరించుకుంది. హిందూత్వ సిద్ధాంత ప్రభావాన్ని విస్తరించి, బడా
ఆర్థికం

మితిమీరుతున్న ప్రపంచదేశాల సైనిక వ్యయం

ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం భారీగా పెరిగింది. మారుతున్న భౌగోళిక, రాజకీయ సంబంధాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రభుత్వాలు సైనిక భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజా వివరాలను స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిప్రి) నివేదిక ప్రకారం భౌగోళిక రాజకీయ అలజడుల కారణంగా ప్రపంచ దేశాల సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2024లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి. 2023తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఖర్చు 9.4 శాతం పెరిగింది. వరుసగా పదో సంవత్సరం కూడా సైనిక వ్యయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది. 2025లో రక్షణకు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించిన
ఆర్థికం

ప్రపంచ సామాజిక నివేదిక

ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం, యునైటెడ్‌ నేషన్స్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ అభివృద్ధి ఆర్థిక పరిశోధనా సంస్థతో కలిసి రూపొందించబడిన  ‘ప్రపంచ సామాజిక నివేదిక -2025’ ని ఏప్రిల్‌ 24న విడుదల చేసింది. ఇందులో  సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి నూతన విధాన రూపకల్పనను ప్రోత్సహిస్తుంది. పెరుగుతున్న అసమానత, ఉద్యోగ అభద్రత, సామాజిక అపనమ్మకం వంటి అంశాలు ఇందులో చర్చిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక అభద్రత, అస్థిరమైన అసమానత స్థాయిలు, క్షీణిస్తున్న సామాజిక విశ్వాసం, సామాజిక విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచ సామాజిక నివేదిక 2025, సమాజాలను భయపెడుతున్న ధోరణులను వెల్లడిస్తుంది. తక్షణ, నిర్ణయాత్మక విధాన చర్యను డిమాండ్‌