(చుండూరు మారణ కాండ మీద అక్టోబర్ 1991న విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాస్కృతిక సమాఖ్య, ప్రజా రచయితల సమాఖ్య తరపున విడుదల చేసిన ఈ కరపత్రాన్ని సి. రామ్మోహన్గారు రాశారు. ఆయన స్మృతిలో పునర్ముద్రణ) చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి భూస్వామ్య, దోపిడి, పీడన సంస్కృతులను నేలమట్టం చేయండి. గురజాడ, వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణగారల సంఘ సంస్మరణోద్యమానికి గుంటూరు జిల్లా కేంద్రస్థానం, త్రిపురనేని హేతువాదఉద్యమం, జమీందరీ వ్యతిరేక ఉద్యమాలు, గుంటూరు జిల్లాను కదిలించివేసినవి. పన్నుల సహాయనిరాకరణ ఉద్యమం, పల్నాడు రైతాంగ తిరుగుబాటు, కన్నెగంటి హనుమంతు అమరత్వం చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆధునిక సాహిత్యంలో