సాహిత్యం కొత్త పుస్తకం

వాలని మబ్బులు- వానమెతుకులు

రాయ‌ల‌సీమ రైతు క‌థ‌లు సంక‌ల‌నానికి శ్రీ‌నివాస‌మూర్తి రాసిన ముందుమాట‌ నేను ఆరోతరగతిలో వున్నప్పుడు మావూరికి ఆపిల్, దానిమ్మ, కమలాలు వంటి 'అమ్ముకునే' పండ్లు వచ్చేవి కాదు. పల్లెల్లో వాటిని కొనలేరు.అందుకని ఎవరూ తెచ్చి అమ్మరు. ( నీళ్లు లేవు కాబట్టి అరటిపండ్లు కూడా మా వూళ్ళో దొరకవు. ఎప్పుడైనా కర్నూలు పోతున్నప్పుడు వెల్దుర్తిలో బస్సు ఆగితే "అరటిపండ్లేయ్!" అంటూ బస్సును  చుట్టుముట్టే ఆడవాళ్ళ అరుపులు యిష్టంగా వింటూ ఒక డజనుకొనడం ఆనాడు మాకు అపురూపం ) వూరి కొండల్లోనో,తోటల్లోనో పండే సీతాఫలం, జామ, మామిడి కూడా బాగా అగ్గువ అయినప్పుడు మాత్రమే ఇంటిదగ్గరికి అమ్మొచ్చేవి. టమేటా కాలంలో మాత్రం
కాలమ్స్ లోచూపు

సమకాలీన అంబేద్కర్ వాదులు-సంక్షోభం,సవాళ్ళు – ఒక చర్చ

గతంలో కంటే భిన్నంగా అంబేద్కర్ కృషి, ఆలోచనల ప్రాసంగికతను నానాటికి విస్తరిస్తోన్న  ప్రజాపోరాట శక్తులు మరెప్పటి కంటే ఎక్కువగా ఇటీవలి కాలంలో గుర్తిస్తూ ఉండడమే పాలకవర్గాల రాజకీయ వ్యూహంలోని మార్పుకు ప్రధాన కారణం. గతంలో చాలాకాలం అంబేద్కర్ ను  గుర్తించకుండా నిరాకరించడం లోనూ, నేడు ఎంతో గుర్తించినట్లు కనబడుతూ ఆరాధించడం లోనూ ఆయన మూల తాత్వికతను ప్రజలు గ్రహించకుండా చేయడమనే  పాలకవర్గాల కుటిలత్వమే దాగి  ఉన్నది.     ముఖ్యంగా  సమకాలీన సమాజంలో చాలామంది అంబేద్కర్ వాదులు కూడా అంబేద్కర్ మూల తాత్వికతను గ్రహించకుండా వారు నిర్వహిస్తున్న సామాజిక, రాజకీయ పాత్రను ఎత్తిచూపడానికి  2011 లోనే   ఆనంద్ తేల్ తుంబ్డే గారు
వ్యాసాలు

చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి

(చుండూరు మార‌ణ కాండ మీద అక్టోబ‌ర్ 1991న విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాస్కృతిక సమాఖ్య, ప్రజా రచయితల సమాఖ్య త‌ర‌పున విడుద‌ల చేసిన ఈ క‌ర‌ప‌త్రాన్ని సి. రామ్మోహ‌న్‌గారు రాశారు. ఆయ‌న స్మృతిలో పున‌ర్ముద్ర‌ణ‌) చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి భూస్వామ్య, దోపిడి, పీడన సంస్కృతులను నేలమట్టం చేయండి. గురజాడ, వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణగారల సంఘ సంస్మరణోద్యమానికి గుంటూరు జిల్లా కేంద్రస్థానం, త్రిపురనేని హేతువాదఉద్యమం, జమీందరీ వ్యతిరేక ఉద్యమాలు, గుంటూరు జిల్లాను కదిలించివేసినవి. పన్నుల సహాయనిరాకరణ ఉద్యమం, పల్నాడు రైతాంగ తిరుగుబాటు, కన్నెగంటి హనుమంతు అమరత్వం చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆధునిక సాహిత్యంలో
వ్యాసాలు

గుండెలపై రాసుకున్న గోండుల సాహిత్యం

సాహు (కొమురం భీమ్‌ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ వ్యాసాన్ని పున‌ర్ముద్రిస్తున్నాం.-  వ‌సంత‌మేఘం టీమ్)  సూర్య వంశ దేవతల్‌  కేత దర్శ సితార  సూర్య వంశ రాజధాని  మావబూడె మాతారా  కచ్చీ బాండేగ్‌ మావాసొత్తా  కయ కాల్‌ కుటియాతా  మావా రాజ్‌ బుడేమాతా  సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ
వ్యాసాలు

థ‌ల్‌ముత్తు, నాట్యరాజన్‌ల‌ను స్మ‌రించుకుందాం  

హిందుత్వ కౌటిల్య మాతృభాషా వాదం భాష అలోచనల ప్రత్యక్ష వాస్తవానికి రూపం - మార్చ్‌థ‌ల్‌ముత్తును త‌ల‌చుకోనివాడునాట్య‌రాజ‌న్‌ను గుర్తు చేయనివాడుతేనెలొలుకు ప‌లుకుల‌తో ఎంతభాషాభిమానాన్ని చాటుకున్నాచాణక్య‌నీతి చెల్ల‌దుగాక చెల్ల‌దుబ్రాహ్మ‌ణ దుర‌హంకార‌వాదంహిందీ ఆధిప‌త్య దుర‌భిమానంమ‌ట్టిగ‌ర‌వ‌క త‌ప్ప‌దు మన ప్రియమైన భారత దేశం అనేక భాషలకు, సంప్రదాయాలకు, జాతులకు, మూలవాసుల సముదాయాలకు, సంస్కృతులకు నిలయం. వైవిధ్యం దీని ప్రత్యేకత. వాటిని సంరక్షించుకోవడం మనందరి విధి. అవి ఈనాడు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటి అస్తిత్వం తీవ్ర ప్రమాదంలో ఉంది. తెగలు లుప్తమవుతున్నాయి. భాషలు అడుగంటిపోతున్నాయి. తర తరాల వారసత్వ సంపద వినాశనపు అంచులలో అస్థిత్వానికై కొట్టుమిట్టాడుతున్నవి. యేడాది పొడుగుతా ఐక్య రాజ్య సమితి పేరు మీదనో,
కవిత్వం

నాకిప్ప‌డు  న‌ది కావాలి

నాకిప్పుడు కావల్సింది సూర్యునితో పాటు తిరిగి చీకటికి తలవంచిన పొద్దుతిరుగుళ్లు కాదు చీకటిలోను తలవంచని ఎర్ర మందారాలు కావాలి వాటి పరిమళాలు కావాలి నాకిప్పుడు కావల్సింది కొద్ది జల్లులకే నిండి కొద్ది ఎండకే ఎండిన కుంటలు కాదు కుచించుకుపోని యాంగ్సీ లాంటి నదులు కావాలి దాని ఘర్జనలు కావాలి నాకిప్పుడు కావల్సింది వసంతంలో మాత్రమే ఎగిరే బురక పిట్టలు కాదు ఏ కాలంలో నైనా పైకెగిరే ఫినిక్స్‌ పక్షులు కావాలి వాటి వేగం కావాలి నాకిప్పుడు కావల్సింది బిగించిన పిడికిళ్లు వాలిపోయిన చేతులు కాదు బందూకు చివరి వరకు దించని భుజాలు కావాలి వాళ్ల ధైర్యం కావాలి
ఆర్ధికం

ఆహార నిల్వలున్నచోట  అకలి కేకలు

 ఎ.నర్సింహారెడ్డి           వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహారకొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట
వ్యాసాలు

వీరమాత కామ్రేడ్‌ అనసూయమ్మకు నివాళి!

అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక 'రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. పుట్టిన వర్గం, ముఖ్యంగా
కథలు

నా కథల్లో నేనుంటాను

తెలంగాణ నేల  మీద నేను పుట్టి అడుగులు వేసే సమయానికి ఈ మట్టి మీద  ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుకూలి ఉద్యమాలు, కమ్యూనిష్టు పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం, బతుకుదెరువులేక ఎడారి దేశాలకు, ముంబై, షోలాపూర్, సూరత్, బీవండి వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాలకు నేత కార్మికుల వలసలు ఇలా తెలంగాణ నేలంతా తనలో తాను తొక్కులాడుకుంటున్న కాలం. అలాంటి గడ్డుకాలంలో జన్మించి సర్కారు బడిలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని ఇన్నాళ్ళకు నావైన కథలేవో కొన్ని రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ఈ ప్రయాణమంతా ఎన్నో గతుకులతో కూడినది.
వ్యాసాలు

దియే జల్తే హై!

రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్‌ 9 - ఆ