సంభాషణ ఇంటర్వ్యూ

రాజ్యాంగాన్ని విమ‌ర్శ‌నాత్మ‌కంగా చూడాలి

(భార‌త రాజ్యాంగానికి ఈ వ్య‌వ‌స్థ‌ను య‌థాత‌ధంగా ప‌ట్టి ఉంచే స్వ‌భావం ఉంద‌ని ఎన్ వేణుగోపాల్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఉన్న ప్ర‌జానుకూల ఆద‌ర్శాలు అమ‌లు కాగ‌లిగే స్థితిలో మ‌న రాజ‌కీయార్థిక, సాంఘిక వ్య‌వ‌స్థ లేద‌ని అంటున్నారు. కాబ‌ట్టి రాజ్యాంగాన్ని మొత్తంగా నెత్తికెత్తుకోవ‌డ‌మో, తిర‌స్క‌రించ‌డ‌మోగాక విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఉండాల‌ని ఈ ఇంటర్వ్యూలో అంటున్నారు..వ‌సంత మేఘం టీం) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది? రాజ్యాంగాన్ని మార్చాలని కె సి ఆర్ స్పష్టంగానే అన్నప్పటికీ అన్న సందర్భం మాత్రం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పెత్తందారీ వైఖరిని ఖండించే సందర్భం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య
కాలమ్స్ కథావరణం

వాస్తవాన్ని వాస్తవం అని చెపుతున్న ఒక ఏనుగుల రాజ్యం కథ “స్వాములొచ్చారు”

ఏనుగుల దాడుల వల్ల పంటల్ని, రైతుల్ని కోల్పోతున్న దేశంలోని అనేక కల్లోలిత ప్రాంతాల్లో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా ఒకటి. అటువైపు తమిళనాడు, ఇటువైపు కర్ణాటక మధ్య  చిక్కిపోతున్న దట్టమైన అడవులు.అంతకంతకూ అడవుల మధ్య మెరుగవుతున్న రవాణా సౌకర్యాలు.. చదునవుతున్న కొండలు గుట్టలు, మాయమవుతున్న వృక్షసంపద, అడుగంటిపోతున్న చెరువులు, కుంటలు, అడవులకు ఆనుకుని ఉండే పల్లెల్లో ఆహారం కోసం ఏనుగుల రాక వల్ల , తమ ప్రాణాలు కంటే విలువైన పంటలను కాపాడుకోవటానికి రైతులు చేసే పోరాటం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ముఖ్యమంటున్న ప్రభుత్వం, జీవనం కోసం ఏనుగులతో యుద్ధం చేసే పరిస్థితిలో రాయలసీమ రైతాంగం.. ఒక
వ్యాసాలు

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసమే యుద్ధం

ప్రపంచ మార్కెట్లోకి రష్యాని ప్రవేశించకుండా; దానిని ప్రపంచాధిపత్య పోటీదారుడిగా నిలిచే అవకాశం ఇవ్వకుండా;  పాత యూరోప్ దేశాలతో దాని పాత శత్రుత్వం తగ్గే స్థితిని రానివ్వకుండా; ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత తన వెనకంజ స్థితిని బలహీనతగా తీసుకునే అవకాశాన్ని కూడా దానికి ఇవ్వకుండా ఇటీవల అమెరికా శరవేగంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు బెడిసికొట్టాయి. హిరోషిమా, నాగసాకి అణు మారణహోమంతో ప్రారంభమై, ఏడున్నర దశాబ్దాల పైబడి పొందిన  అమెరికా ప్రపంచాధిపత్య రాజనీతి ఉక్రెయిన్ వద్ద గాలిలో కలిసిపోయింది. ఇది ప్రపంచ బలాబలాల పొందికలో వస్తున్న గుణాత్మక మార్పుల్ని సూచించే సంఘటనగా చరిత్రలో నిలుస్తుంది. ఇదేదో ఉక్రెయిన్ కి
కాలమ్స్ కవి నడిచిన దారి

ధ్వ‌నిలోంచి క‌వ‌నంలోకి

నాకు శబ్దం అంటే చాలా ఇష్టం. కవిత్వం కంటే మొదట బాణీలను ప్రేమించినవాడిని. ఇప్పటికీ పాటలోని కవితాత్మక వాక్యాల కంటే సంగీతమే మహా ఇష్టం.అవి నేను స్కూల్ డేస్ లో ఉన్న రోజులు. చీకట్లో వుండటాన్ని భలే ఇష్టపడే రోజులు. వీధి దీపాలు సరిగ్గా వెలగని రోడ్లను వెత్తుక్కొని మరీ ఒంటరిగా ఉండటం వల్లే నాలో పాట మొదలయ్యింది. నడవటం బాగా అలవాటు. గంటలు గంటలు నడిచే అలవాటు ఇప్పటికీ అలాగే వుంది. ఒకరకంగా ఈ ఒంటరి నడకే నన్ను బతికిస్తుంది. ఈ నడకే నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే రోజొకటి వుందని నాకూ స్పృహలోకి వచ్చింది. అలా
సాహిత్యం కవిత్వం

క‌విత్వ‌మూ -క‌వీ

టి. వెంక‌టేశ్ క‌విత‌లు తొమ్మిది 1నలుదిక్కులు తిరిగేదిమ్మరుల అజ్ఞాత జ్ఞానమే కవిత్వంస్వప్న మార్మికతనుసత్యంగా అనువదించేదే కవిత్వంరాసిన ప్రతిసారిఆనవాలు లేకుండానువ్వు చేసుకునే ఆత్మహత్య కవిత్వం  .2ఒడ్డున నిల్చుంటావుపడవ రాదుసణుకుంటూ వెనుదిరుగుతావుమరలిన తరువాతపడవ వచ్చి వెడుతుందిఆ రాత్రి ' ప్రయాణం ' ముగుస్తుందిపడవకు తెలియదువస్తూ పోతూ ఉంటుందిఒడ్డున నీ ఆఖరి పాదస్పర్శగాలి చెరిపేస్తుందిబతికిన పద్యంఅజ్ఞాతంగా తిరుగాడుతూ ఉంటుందిపడవ దిగిన పరదేశి ఒకరుకవిత్వాన్ని గుర్తిస్తాడుకవి మరణించిలేడని.3 అలా నీవు గడ్డకట్టినపుడుకవిత్వపు నెగడు అంటించుపద్యం వెలుగు ఓ ప్రశాంతత.4అనేకులుశబ్దం లో ఒలుకుతున్నపుడుకవికి పద్యం ఓ ధ్యానం.5వరద ఉధృతిలానీలో అనుభూతి వానకుమొలకెత్తె పచ్చి మట్టివాసన పద్యం.6ఆగిపోయి నిల్చున్నావుఅలాగే ఉండిపోకుఒఠ్ఠిపోతావురెండు పద్యాల్ని సాయమడుగుమళ్ళీ కవి జన్మ నీకు కొత్త.7చూరుకు
సాహిత్యం కవిత్వం

యుద్ధమూ – మనమూ

యుద్ధం అంటే ప్రేమ లేనిదెవ్వరికి నీకూ నాకూ తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ స్మశానాలపై జెండాలెగరేస్తారు సమాధులపై ఇన్ని గులాబీ రేకులు పోసి‌ చేతులు జోడిస్తారు కనురెప్పలకింద ఉప్పగా ఊరిన నీటిని తుడుచుకుంటూ నడిచిపోతారు రేపటికి మిగలని వాటిపై మరల కొత్త పునాదులేస్తారు సదులన్నీ కుదించబడి సముద్రపు పక్కలో ఒరిగిపోయాయి కానీ ఆ తల్లి మాత్రం కడుపు చించుకుంటోంది రాని కొడుకో కానరాని కూతురో ఇంక రారని కనుపాపల వెనక శూన్యాన్ని గుండెలకద్దుకుంటూ యుద్ధం వాడికొక వస్తుమార్పిడి యుద్ధం వాడికొక వ్యసనం యుద్ధం వాడికొక పాచికలాట యుద్ధం నీకూ నాకూ విముక్తి సాధనం యుద్ధం నీకూ నాకూ