స్వేచ్ఛ, సమానత్వం కోసం మడవి సీమ పోరాటం
“పనిచేసే వాళ్లదే భూమి” – బస్తర్ అమ్మాయి చూసిన అసమానతల నుంచి పుట్టిన ప్రజాస్వామిక నినాదం. 2025 ఏప్రిల్, మే నెలల్లో బస్తర్లోని కర్రెగుట్ట ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర పారామిలిటరీ బలగాలు “ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్” పేరుతో భారీ దాడులు నిర్వహించాయి . ప్రభుత్వం ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఈ ఆపరేషన్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని అరెస్టు చేశారు. ఎన్నో గ్రామాలు ధ్వంసం అయ్యాయి. అరెస్టయిన వారిలో మడవి సీమ కూడా ఉంది. ఆమె వయస్సు పందొమ్మిదేళ్ళు. ఆమె ఇప్పుడు చంచల్గూడ జైలులో ఉంది. పోలీసులు ఆమెను మావోయిస్టుగా అనుమానించి










