అరెస్టు చేస్తారనే భయంతో ఆసుపత్రికి వెళ్లని బాధిత సిజిమాలి ఆదివాసులు
2026 ఏప్రిల్ 12 కాశీపూర్ బ్లాక్లోని సిజిమాలి బాక్సైట్ గని కోసం వేదాంత అల్యూమినియం లిమిటెడ్ చేపట్టిన రోడ్డు నిర్మాణ కార్యక్రమం భారీ సంఖ్యలో పోలీసులు, పరిపాలనా యంత్రాంగ అధికారుల సమక్షంలో జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగి వివాదం చెలరేగింది. మంగళవారం భారీ పోలీసు, పరిపాలనా యంత్రాంగ సిబ్బంది సమక్షంలో ప్రారంభమైన ఈ రోడ్డు నిర్మాణ పనులను గ్రామస్థులు వ్యతిరేకించడంతో పోలీసులకూ, వారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామస్థులు పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపణలు రావడంతో, పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని, కలెక్టర్ ప్రభావిత ప్రాంతానికి వెళ్లాడని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే, అధికారులు










