ఇంటర్వ్యూ

యూఏపీఏను రద్దు చేయాలి  – ఇందిరా జైసింగ్

( ప్రొ.జి.ఎన్.సాయిబాబా, అతని తోటి నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ట్వీట్ చేసిన వారిలో మొదటివారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల నుండి, విప్లవ కవి వరవరరావు (భీమా కోరేగావ్ కేసులో నిందితులు, 2021లో బెయిల్ వచ్చింది) మొదటి మహిళా అదనపు సొలిసిటర్ వరకు, ప్రాథమిక హక్కులను కోల్పోయిన వారి కోసం అనేక న్యాయ పోరాటాలు విజయవంతంగా చేయడంలో ఆమె గుర్తింపు పొందింది.   1986 మేరీ రాయ్ కేసు, 1999 గీతా హరిహరన్ కేసు వంటి మహిళల వివక్షకు వ్యతిరేకంగానూ, జనరల్ కేసులను కూడా చేసారు. ఆనంద్ గ్రోవర్‌తో పాటు, ఆమె ఆన్‌లైన్
సంభాషణ

సమ్మక్క జాతర – తమ్ముని యాది

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ...  మా వూరికి దక్షిణ శివారులో పాలాగు ఒడ్డున  సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నది. నేను నా భార్య, ఇద్దరు పిల్లలు, అవ్వ-నాన్న కలిసి జాతరకు  ఎల్లినం .  వన దేవతలకు మొక్కులు చెల్లించి ఒక కోన్ని కోసి అక్కన్నే చెట్లల్ల వండుకున్నం. రాత్రి 8 గంటలు అయితంది.. పల్లెం లో అన్నం కూర పెట్టుకుని తింటున్న.  పిండారపోసినట్టు తెల్లని వెన్నెల  కురుస్తంది. స్టీల్ పల్లెం పై ఆ వెన్నెల  పడి మెరుస్తంది. ఈ టైంలో తమ్ముడు  ఏమి చేస్తున్నట్లు? ఎక్కడ వున్నట్లు? ఒక్క సారిగా మనసు తమ్ముని మీదికి పోయింది. కోర
సంభాషణ

ఢిల్లీలో రైతులపై పోలీసుల క్రూరత్వం

యువ రైతు శుభ్ కరణ్ సింగ్ దారుణ హత్యకు, భద్రతా దళాలు రైతులపై కొనసాగిస్తున్న హింసకు నిరసనగా ఫిబ్రవరి 23ను బ్లాక్ డేగా జరపాలని సమైక్య కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్), రాష్ట్ర అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సిఎఎస్ఆర్)లు ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందనగా, జంతర్‌మంతర్ దగ్గర శాంతియుత ప్రదర్శన కోసం యిచ్చిన  పిలుపుకు ప్రతిస్పందనగా, నేను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు నా సంఘీభావాన్ని తెలియచేయడానికి  వెళ్ళాను. నిరసనకారులెవరూ  అక్కడ లేరు కానీ పోలీసులు, ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటిబిపి) పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడనుంచి  మెట్రో స్టేషన్ కు వెళ్ళాను, అక్కడ వివిధ విద్యార్థి సంస్థలకు
సంభాషణ

“నీడలు” పెంచిన ఆశలు

(ఇటీవల విరసం సభల్లో ప్రదర్శించిన నాటిక ముందు వెనుకల కళాత్మక అనుభవం ) మొదట్లో నాకు ఈ నాటకం మీద పెద్ద అంచనాలు ఏమి లేవు. ఓ రోజు పాణి గారు నాకు ఫోన్ చేసి  సిటీ యూనిట్ సభ్యులు వరలక్ష్మి గారి కథ "నీడలు" ను నాటకంగా వేద్దామనుకుంటున్నారు . మీతో మాట్లాడతారట " అంటూ ప్రస్తావన తెచ్చాడు. ఆ తర్వాత అనుకున్నట్లే చందు ఫోన్ చేసి" నీడలు "కథను నాటకంగా రాస్తే, యూనిట్ సభ్యులు నాటకం వేస్తారని , మీకు వీలవుతుందేమో చూడమని చెప్పాడు.                                           *** ఆ కథ ను నాకు పంపడం, నేను
ఇంటర్వ్యూ

పిటిషన్ల కన్నా సమిష్టి పోరాటం ముఖ్యం

 (స్వలింగ వివాహాలను స్పెషల్ మ్యారేజి యాక్ట్ ప్రకారం గుర్తించాలని  కోరుతూ  ట్రాన్స్ జెండర్  సమూహం  పిటిషన్ ల పై సుప్రీం కోర్ట్ ఇటీవల స్పందిస్తూ .. దీని మీద పార్లమెంట్  చట్టం చేయాలని ప్రభుత్వానికి చెప్పింది. దీనిపై   కృషాణు (krishanu)  అనే క్వియర్  స్పందన ఇది)    1. ఈ తీర్పు పై మీ ప్రతి స్పందన ఏమిటి ? చాలా నిరాశ కు గురయ్యాను  కానీ , ఇలా  జరగదని  నేను అనుకోలేదు. 2. ఇప్పటి వరకు  ఈ సమస్య తెలియని  పాఠకుల కోసం  ఈ పిటిషన్ నేపథ్యాన్ని కాస్త  వివరిస్తారా .. 2020 లో  క్వీర్ జంటలు
ఇంటర్వ్యూ

రచయిత తన రచన పట్లనిర్మమకారంగా ఉండాలి

మహమూద్‌ నాకెంతో ఇష్టమైన కవుల్లో ఒకడు. ఆ మాటకొస్తే సొంత ఊరు వాడు కాబట్టి ఇంకాస్త ఎక్కువే ఇష్టం. మహమూద్‌ని నేను మొదటి సారి 1999 -2000 ప్రాంతంలో  ప్రొద్దుటూరుకు వెతుక్కుంటూ వెళ్లి కలిశాను. అప్పటి నుంచి నాకు అతనితో సాన్నిహిత్యం ఉంది. నాకు మహమూద్‌ అంటే మిత్రజ్యోతి సంస్థ వ్యవస్థాపక సభ్యుడు.  “సీమ కవిత’’ సంకలనం ఎడిటర్‌. “మిష్కిన్‌’’ కథా రచయిత. ఇప్పుడు “ఆస్మాని’’ కవి.కవిగా, కథకుడిగా, కార్యనిర్వాహకుడిగా సీమ సాహిత్యానికి, సమాజానికి ఎంతో సేవ చేసినవాడు. అక్కడి ఒక తరానికి స్ఫూర్తినిచ్చినవాడు. క్షణం క్షణం పొట్ట తిప్పల కోసం పాకులాడుతూనే మరోవైపు తాను పుట్టిన గడ్డ కోసం, సమాజం కోసం పరితపించినవాడు. కీర్తి కోసం కాకుండా
ఇంటర్వ్యూ

కశ్మీర్ ఒక ప్రయోగశాల

(2023 మే 2న, కశ్మీర్‌లో లోయలో రాజ్యహింసకు పాల్పడుతున్న ఒక ప్రసిద్ధ జర్నలిస్టును రెజాజ్ ఎం షీబా సైదీక్ ఇంటర్వ్యూ చేశారు. భారత ప్రభుత్వం నుండి రాబోయే పరిణామాలను ఊహించిన ఆ జర్నలిస్ట్ తన పేరు బయటపెట్టవద్దని అంటే అతనికి "ఫ్రీడమ్" (స్వేచ్ఛ) అని పేరు పెట్టాం. హడావిడిగా తీసుకున్న ఈ చిన్న ఇంటర్వ్యూ వెనుక ఉన్న రాజకీయ కారణాన్ని తన పేరును అజ్ఞాతంగా వుంచాలనే అతని అభ్యర్థన నుండి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అనామకతను పిరికితనం అనే  దృష్టితో చూడలేం. కానీ "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో" వున్న"ప్రజాస్వామ్యం- స్వాతంత్ర్యాల "వాస్తవాన్ని, భారతదేశ ప్రధాన భూభాగంలోనూ, కశ్మీర్‌లోనూ
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజాస్వామ్యంలోనూ ఫాసిజం వస్తుంది

- సిద్ధికీ కప్పన్‌, రైహానాలతో ఇంటర్వ్యూ  (సిద్ధికీ కప్పన్‌ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్‌ 2020న ఉత్తరప్రదేశ్‌లోని మథుర టాల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్‌ రహ్మన్‌, మసూద్‌ అహ్మద్‌, డ్రైవర్‌ మొహ్మద్‌ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్‌లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్‌పై ఊపా, పియమ్‌ఎల్‌ఏ లతో సహా అనేక ఇతర
ఇంటర్వ్యూ

చరిత్రను తిరగ రాయడం  వీరోచితం అనుకుంటున్నారా ?

గణేష్‌ నారాయణ్‌ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు.  ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ సెంటర్‌’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు.  2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్‌ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్‌ క్లాస్‌ (PrinceClaus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్‌ బహుమతి (
వ్యాసాలు సంభాషణ

శ్రమ సంబంధాలఅమ్మ

నవంబర్‌ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్‌ హన్మంతు తండ్రి  పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్‌ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్‌ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం.  కానీ ప్రతి జీవికి