వ్యాసాలు

ఆదిలాబాద్ లో30 యాక్ట్ పోదా ?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2018 జనవరి నుండి 30 పోలీసు చట్టంను  అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నది. 30 పోలీసు ఆక్ట్‌ అనేది ఎమర్జెన్సీ పరిస్థితులను పోలిన చట్టం.  జిల్లా సూపరింటెండెంట్‌ లేదా అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ద్వారా ప్రతి నెల 1 నుంచి నెలాఖరు  వరకు నెలరోజుల పాటు పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సిదే. నెల రోజుల
వ్యాసాలు

ప్రియమైన అమ్మా…

ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్‌ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడునే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పథంలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తకు వచ్చాయి. నీతో, నాన్నతో, న కుటుంబసభ్యులతో, ఊళ్లో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడు మీ అందరి మీదా మరింత గౌరవం కలుగుతోంది.
వ్యాసాలు

హిందూయిజం ఒక అబద్ధం
హిందూ మెజారిటీవాదం అగ్రకులాల సృష్టి

1వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది. రామాలయ నిర్మాణానికి
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం

ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’. ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన
కరపత్రాలు

Dangerous literary festival with dangerous writers

You are invited to a certain dangerous literary festival. We could not organize the 'People's Literary Festival' last year, a failure we blame on our inaction and weakness. These days the Hindutva-Fascist state has poisoned public consciousness with relentless religious sectarianism and hatred. Capitalism has consumed water, forests, lands and jobs. We consider it a crime not to fulfill our promise to stand by the masses in these troubled times.
కవిత్వం

పూల కాంతి

దేహమంతా సూదిపోట్ల సలపరం పాదాలు ఏనుగేదో తొక్కిపెట్టినట్లు లోలోపల కరకరమమంటూ బాధ తనువంతా రెండు ముక్కలయినట్లుగా భారంగా వేలాడుతుంది కను రెప్పలనెవరో పిన్నులతో ఎక్కుపెట్టినట్లు నిదుర ఎక్కడికో తనను మరచి పారిపోయినట్లుంది రక్తాన్ని తోడుతున్నదెందుకో ఎన్ని పరీక్షలు చేసినా చివరాఖరికి ఏదీ కొత్తగా చెప్పారో తెలియని అయోమయం చికిత్స తెలిసినట్లే వున్నా దేహమెందుకో మొరాయిస్తుంది ఈ తెలవారని రాత్రి మరో ఉదయాన్ని మాత్రమే హామీనివ్వగలుగుతోంది పున్నమి వెన్నెల రాజి గూడులా తన కంటి చుట్టూ వలయాలు అయినా తను పగలబడి నవ్వినప్పుడు అడవి చుట్టూ వెలుతురు పూల కాంతి!!! (కామ్రేడ్ సహోదరికి ప్రేమతో)
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజల్లోకి వెళ్లి రాసాను

(ప్రముఖ సాహిత్య, జీవిత చరిత్రల పరిశోధకుడు డా. కె ముత్యం *శ్రీకాకుళ విప్లవోద్యమం - తెలుగు సాహిత్యంపై ప్రభావం* అనే అంశంపై 1984 - 90 మధ్య పరిశోధన చేశారు. ఆ సందర్భంగా ఆయన శ్రీకాకుళ విప్లవోద్యమంతో, ఆ  సాహిత్యంతో  పరిచయం ఉన్న అనేక మందిని కలిశారు. వారి అభిప్రాయాలు సేకరించారు. వాటిని ఇటీవల ముత్యం  వెలుగులోకి తెచ్చారు. ఎక్కడా అచ్చుకాని అభిప్రాయాలు ఇవి. ఇందులో ప్రముఖ బుర్ర కథ కళాకారుడు షేక్ నాజర్ 9-3- 1987  కె ముత్యంతో పంచుకున్న అనుభవాలు పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) 1. శ్రీకాకుళం ప్రాంతమంతా మీరు కలెదిరిగారు
వ్యాసాలు

దండకారణ్య ఉల్‌గులాన్‌కు జేజేలు

ఉల్‌గులాన్‌ అంటే గోండీలో ప్రజా తిరుగుబాటు. ఇవాళ దండకారణ్యమంతా పోటెత్తిన ఉల్‌గులాన్‌. అణచివేత, నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజా పోరాటాలు ఎట్లా ఉంటాయో  దండకారణ్యంలో చూడాల్సిందే. దేశమంతా పోరాట క్షేత్రంగా మారుతున్న తరుణంలో దాన్ని ఉన్నత రూపంలో ముందుకు తీసుకపోతున్నది దండకారణ్యం. బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా మనదేశంలో తొలుత పోరాట శంఖమూదినది లేదా విల్లంబులనెత్తినది,  తుపాకినెత్తినది అదివాసులేనని చరిత్ర నమోదు చేసింది. ఆ వీరసంప్రదాయాన్ని ఎరిగిన ‘‘రాజ్యాంగ నిర్మాతలు’’ భారత రాజ్యాంగంలో మూలవాసుల సంరక్షణ, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టికల్స్‌ను రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌342లో మన దేశంలోని ఆదివాసులను గుర్తించడానికి కావలసిన ప్రక్రియను పేర్కొన్నారు. ఫలితమే
సంపాదకీయం

మావోయిస్టురహిత భారత్‌‍లో 2024 ఎన్నికలు

త్రిపుర ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్షా, 2024 లోక్సభ ఎన్నికలు మావోయిస్టురహిత భారత్లో జరుగుతాయని జోస్యం చెప్పాడు. ఎన్నికలు ఎప్పుడూ పాలకవర్గపార్టీ (ల) హితం కొరకే జరుగుతాయి గానీ మావోయిస్టుపార్టీకో మరో విప్లవ పార్టీకో హితం కూర్చడానికి జరగవు. పైగా మావోయిస్టు పార్టీ తన పూర్వరూపాల్లో కూడ అంటే 1969 ఏప్రిల్ 22న ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చి ప్రజలను ఈ బూటకపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలకు దూరంగా ఉండమనే చెప్తున్నది. ఆ విషయంలో ఎంతవరకు ప్రజల్ని ఎన్నికల భ్రమ నుంచి దూరం చేయగలిగిందనేది ఎన్నికలలో పోలయిన ఓట్లతో నిర్ణయించే గణాంకపద్ధతి కాదు.
కవిత్వం

వివేక్ కవితలు రెండు

ఫాసిస్టు కత్తిపై నా భావాలను, కలాన్ని నీ ఫాసిస్టు కత్తితో నరికినంత మాత్రాన నేను అంతమై పోను అంతకన్నా అదృశ్యమై పోను దోపిడీ వ్యవస్థలో బుసలు కొడుతున్న నీ ఫాసిస్టు భావజాలాన్ని కూకటి వేళ్ళతో సహా అడ్రస్ లేకుండా పెకిలించడానికి నా సైన్యం కలంధారీ, ఆయుధధారీ పదునెక్కుతోంది చిందిస్తున్న నా నెత్తురుతో తడిసిన నెల పొరల్లోంచి పోరు విత్తనాలు మొలకెత్తి నలుమూలల విస్తరించి నీ అంతాన్ని చూస్తాయి. బిగించిన పిదికిలి మా ఆయుధం శతృవు తూటాలకు దడిస్తే ఒక్క తూటా శబ్దమే నిన్ను అవహించి నీ ప్రాణాన్ని వెంటాడుతుంది కామ్రేడ్ నీ లక్ష్యసిద్ధికై పిడికిళ్ళు బిగించి యుద్ధానికి సిద్ధమైతే