సంపాదకీయం

వాకపల్లి అత్యాచారం నుంచి వైమానిక దాడుల దాకా

వాకపల్లి ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన వాళ్ల మీద   కేసును  ఏప్రిల్‌ 6న కోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజు ఇంకా తెల్లారక ముందే చత్తీస్‌ఘడ్‌లోని పామేడ్‌ ప్రాంతంలో భారత ప్రభుత్వం రెండో విడత వైమానిక దాడులు చేసింది. ఈ రెండు ఘటనలు వరుసగా జరగడం యాదృశ్చికం కావచ్చు. కానీ వాటి మధ్య పోలిక ఉన్నది. సంబంధం ఉన్నది.  ఈ రెండు ఘటనలకు మధ్య పదహారేళ్ల ఎడం ఉన్నది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆదివాసీ గ్రామం వాకపల్లి. ఆగస్టు 20, 2007న ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో విప్లవకారులను హత్య చేయడానికి  కూబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి మహిళల
నివాళి

విప్లవ ప్రేమికుడు కామ్రేడ్‌ ఎల్‌. సుబ్బయ్య

బిఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి, విప్లవాభిమాని ఎల్‌. సుబ్బయ్య(88)గారు గత కొద్ది కాలంగా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతూ  ఏప్రిల్‌ 6వ తేదీ హైదరాబాదు ఆస్పత్రిలో అమరుడయ్యాడు. ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తగా మొదలై జీవిత పర్యంతం లౌకిక ప్రజాస్వామి విప్లవశక్తుల పక్షాన దృఢంగా నిలబడ్డారు. బైటి ప్రాంతాల్లో కర్నూలు సుబ్బయ్యగారిగా ఆయన అనేక మంది ప్రజాసంఘాల కార్యకర్తలకు, మేధావులకు, రచయితలకు చిరపరిచితుడు. కోవిడ్‌కు ముందు మూడు నాలుగేళ్ల  వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎక్కడ ప్రజాసంఘాల కార్యక్రమాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు. ఏ ప్రగతిశీల సంస్థ కార్యక్రమం జరిగినా, ఉద్యమం నడిచినా వాటికి సంబంధించిన కరపత్రాలను  ప్రజల్లోకి తీసికెళ్లడం ఆయనకు
వ్యాసాలు సంభాషణ

శ్రమ సంబంధాలఅమ్మ

నవంబర్‌ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్‌ హన్మంతు తండ్రి  పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్‌ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్‌ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం.  కానీ ప్రతి జీవికి
నివేదిక

Stop This State Terror Now!

Fourth Drone Bomb Attack on Indigenous People in Bastar, Chhattisgarh Indigenous (Adivasi) people in Bijapur district of Bastar, in the Indian state of Chhattisgarh, have been traumatised by yet another aerial bomb attack from the security forces which have been using drones to carry out these operations. Although the Indian Air Force is not officially deployed for combat in Chhattisgarh, the repeated use of aerial bombardment on civilian populations suggests
కవిత్వం

ఆట పాటల రూపు

ఆట వైతివా అన్న పాట వైతివా జనహోరు గుండెల్లో రాగమైతివా ధన ధన మోగెడప్పు దరువువైతివా...."2" ఎగిసేటి ఉద్యమాల గురువువైతివా...2" పొడిసేటి పొద్దుల్లో వెలుగుగైతివా "ఆట వైతివా" వెలివాడ బతుకుల్లో ఎట్టి చూసినవ్ ఏతలన్ని పోయే పోరు బాట వట్టినవ్ ప్రశ్నించే పాటవై మేలు కొల్పినావు .."2"... పాలకుల గుండెల్లో దండోరావైనవ్ " ఆట వైతివా" నల్లమల అడవులన్ని కలియతిరిగినవ్ నమ్ముకున్న పేదప్రజల గోసచూసినవ్ సమ సమాజ స్థాపన ధ్యేయమన్నవు..."2" అమరులే..ఆదర్శ మూర్తులన్నావు "ఆట వైతినా" పసిపాప నవ్వంత స్వచ్ఛమైంది స్వార్థమే లేనట్టి ప్రయాణం నీది సామ్రాజ్యవాదం పై పోరాటం నీది...."2" దాన్ని కొనసాగించే నినాదం మాది.
ఖండన

ఆదివాసులపై వైమానిక యుద్ధాన్ని ఖండించండి

రాజ్యంగ వ్యతిరేక ఫాసిస్టు దాడులపై ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేద్దాం ఏప్రిల్‌ 7వ తేదీ శుక్రవారం దండకారణ్యంలో మరోసారి భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది. ఈ ఏడాది జనవరి 11న  గగన తల దాడులు జరిగిన మూడు నెలలకల్లా మరోసారి డ్రోన్ల నుంచి  బాంబులు విసిరారు. పామేడు ప్రాంతంలోని బట్టిగూడ, కవరగట్ట, మీనగట్ట,  జబ్బగట్ట గ్రామాల పరిధిలో తెల్లవారు జామున  ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఆదివాసులు ఆ సమయంలో విప్ప పూలు ఏరుకోడానికి అడవిలోకి వెళ్లారు. కొందరు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన బాంబు దాడులు ఐదు నిమిషాల వ్యవధిలో వేర్వేరు
ఆర్ధికం

అసమానతలు పెంచుతున్నఉపాధి రహిత వృద్ధి

తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా
వ్యాసాలు

“మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమినివ్వం”

ఉత్తరప్రదేశ్ అజంఘడ్‌లో విమానాశ్రయ విస్తరణ వ్యతిరేక పోరాటం ఉడే దేశ్ కా ఆమ్ నాగ్‌రిక్ (ఉడాన్-దేశ సాధారణ పౌరుడు ఎగరాలి) పథకం కింద మండూరి అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్‌ను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌స్ట్రిప్ విస్తరణకు మొదటి దశలో 310 ఎకరాలు, రెండవ దశలో 264 ఎకరాలు అవసరమవుతాయి, ఇది తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్లను ప్రభావితం చేస్తుంది. ఉడాన్ పథకం కింద అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్ విస్తరణ కోసం మొత్తం 600 ఎకరాలు అవసరం -- దశ-I కోసం 310.338 ఎకరాలు, దశ-II కోసం 264.360 ఎకరాలు. అదనంగా, ఎనిమిది-తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్ళు కూడా ప్రభావితమవుతాయి. ఈ ప్రాజెక్టు
నివేదిక

మూడేళ్లలో నాలుగోసారి డ్రోన్  దాడి

తమ గ్రామాల్లో జరిగిన వైమానిక బాంబు దాడులకు (డ్రోన్ దాడులు) వ్యతిరేకంగా బస్తర్‌లోని ఆదివాసీ గ్రామస్తులు మరోసారి తమ గళాన్నెత్తారు. మీడియా నివేదికల ప్రకారం, బీజాపూర్ గ్రామస్తులు తమ గ్రామాలపై 2023 ఏప్రిల్ 7న డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించారు. జబ్బగట్ట, మీనగట్ట, కవరగట్ట, భట్టిగూడ గ్రామాలలో డ్రోన్‌లతో బాంబు దాడులు జరిగాయి. పైన పేర్కొన్న గ్రామాలలో ఉన్న మోర్కెమెట్ట కొండల దగ్గర ఉదయం 6 గంటలకు బాంబు దాడి ప్రారంభమైంది. పరిసరల పొలాల్లో అనేక బాంబులు పడ్డాయి, తరువాత 3 హెలికాప్టర్ల నుండి భారీ మెషిన్ గన్ కాల్పులు కూడా జరిగాయి. పడిన బాంబుల సంఖ్య నిర్ధారణ
వ్యాసాలు

మరో సారి భారత ప్రజలపైబాంబు దాడి

భారత ప్రభుత్వం తన పౌరులపై మరోసారి బాంబు దాడి చేసిందని మీకు తెలుసా? “గత నెలలో అమిత్ షా బస్తర్‌ను సందర్శించి, ప్రతిఘటనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత 2023 ఏప్రిల్ 7 న దాడి జరిగింది. అమెరికా ఇతర దేశాలపై బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలో బాంబు దాడులు చేసినప్పుడు వారు మౌనంగాగా ఉన్నారు.” నిరసన! నిరసన! నిరసన! ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం, బస్తార్ జిల్లాలోని భట్టుం, కవురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాల ఆదివాసీల పైన భారత ప్రభుత్వం ద్రోణుల  సహాయంతో 2023 ఏప్రిల్ 23 నాడు వైమానిక బాంబులు