సమీక్షలు

చీకటి రోజుల్లో గానాలుండవా…..

 1818 దీర్ఘ కావ్యంపై సామాజిక సాంస్కృతిక విశ్లేషణ శ్రీరామ్‌ పుప్పాల 1818 దీర్ఘ కవిత రాత ప్రతి దశ నుంచి అచ్చు పుస్తకం వరకు ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారీ నాకు మరింత లోతైన అర్థం తోచేది. ప్రతి చరణమూ ఒక సంఘటననో, చరిత్రలోని కీలక పరిణామాన్నో గుర్తుచేసేది. మన దేశ ప్రజల పోరాటాలను, హక్కుల హననాన్నీ ఒక క్రమంలో రికార్డు చేసిన రచన ఇది. తనలో తాను మాట్లాడుకుంటూ, మనతో మాట్లాడుతూ భీమానది ఒక విస్మృత చరిత్రను పరిచయం చేస్తున్నది. నదులు నాగరికతా చిహ్నాలు. నదుల వెంట జనావాసాలు ఏర్పడి స్థిర వ్యవసాయం సమకూరే క్రమంలో ఉత్పత్తి సాధనాలు,
కొత్త పుస్తకం

కాలం తయారు చేసిన కవి

ఇటీవల కవిత్వం రాస్తున్నయువతరంలో అనేక నేర్చుకోవాల్సినఅంశాలుఉన్నాయి .వారంతా నిశ్శబ్దంగా, మౌనంగా వర్తమానాన్ని అత్యంత లోతుగా చూస్తున్నారు .ఎక్కడ ఆర్భాటం లేదు రాజకీయ పరిపక్వత పొంది ఉన్నామని భావన లేదు. జీవితాన్ని రాజకీయాల్ని అంచనా వేసే క్రమంలో నిజాయితీ కనబడుతుంది .మన ముందు రూపొందుతున్న పిల్లలు కదా అమాయకత్వం నిండిన చిరునవ్వు ఇవే కదా వీరిలో అదనపు ఆకర్షణ అనుకునే దశ నుండి వారు హఠాత్తుగా కవిగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశిస్తారు .వారి కవితా ప్రపంచంలోకి దారి చేసుకుంటే ఇంతటి పరిపక్వత ఎలా వచ్చింది? ఈ పరిణితి వెనుక ఈ తరం పడుతున్న మౌనవేదనేమిటి ? వీరిని దుఃఖితులుగా చేస్తున్న
సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?
కవిత్వం

భూమిని మాటాడనివ్వు…

మనమింకా‌ బతికే వున్నామా? ఇదేదో‌ భేతాళుని‌ భుజాన‌ వేలాడే రాజు ప్రశ్న కాదు వాదనలు‌ ముగిసిన‌ వేళ వాడొక్క మాటతో‌ ఫుల్ స్టాప్ పెట్టేసే వేళ అటూ ఇటూగా సరిపెట్టుకుంటే నువ్వూ నేనూ కోల్పోయేదేమీ లేదు వాడి తుపాకీ‌ మొన ముందు వారి మానం ఛిద్రమైన వేళ కోర్టుల ముందు నగ్నంగా నిలబడిన తల్లులను వంచించిన నీ న్యాయం నీకు నైతిక విజయమా? కోల్పోయిన మానానికి కళ్ళు లేని‌ న్యాయం ధర కడుతుందా? తాను రుజువు చేయలేని ఆ పదముగ్గురినీ వాకపల్లిలో నిలబెడితే న్యాయమేదో బిగ్గరగా వినబడేది కదా? పదారేళ్ళ నీ విచారణకు తమ కొంగు చివర కట్టుకున్న
కవిత్వం

కిటికీ

జైలు గదుల ఉక్కపోతల నుండి ఉపశమనం కోసం అతడు కిటికీ తెరిచాడు ఎదురుగా సముద్రం... బయటి సముద్రం లోపటి సముద్రం అలయ్ బలాయ్ తీసుకున్న చోట ఆకాశం నక్షత్ర కాంతుల వెదజల్లింది సహనానికి మారు పేరైన భూమి తన విముక్తి కోసం సంకెళ్లకు చేతులిచ్చి సహనంగా ఎదురుచూసే రేపటిలోకిచూపులు సారించే మానవ మహా సంకల్పానికి జే జే లు పలికింది
వ్యాసాలు

మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి

జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన  మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం
కవిత్వం

పల్లె పిలుస్తోంది…!

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి లేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూ ముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానే చిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కా ఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలు పిల్లలు పల్లె కు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలో జీడి చెట్ల కొమ్మల్లో అడుగులు వడివడిగా మురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకుని మంచు బిందువుల్ని పూసుకుని ఎగిరే పక్షుల వెంట ఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని నా పల్లె లో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్ని వెలిగించుకుని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 కమ్మటి దాల్చా తెలంగాణమా! నా ప్రాణమా!! ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి నడిచి వెళ్ళే ఇంటింటికి ఇనుప గోడలల్లుతున్న సాలీలు తిరుగుతున్నాయి గడపలకు విద్వేష బొట్లు పెడుతున్నాయి దుఃఖం మీద దునుకు లాడుతూ దూర దూరాలు పంపిణీ చేస్తున్నాయి వాటి అడుగుల్లో మంటలు లేస్తుంటాయి వాటి మాటల్లో మృత్యు వాసనొస్తుంది నా ప్రియతమా! మూసి ప్రవహిస్తున్న గుండెల్లో మానవతా పరిమళాల మాగానివి గోదావరై ప్రేమలు ప్రవహించే దానా! మనసులు కలిసిన చేతుల మీంచి ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి పంట కావలి మంచై చార్మినార్ కమ్మటి దాల్చా జుర్రుకునే మతాతీత మనసులు అలాయి బలాయి ఆత్మీయతలు
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి