సంపాదకీయం

‘రాహుల్‌ వాదం’ వినిపించాల్సిందేనా?

రాహుల్‌ గాంధీ ఉదంతాన్ని సాధారణ అధికార రాజకీయాల్లో భాగంగా చూడ్డానికి లేదు. పాలకవర్గంలోని ముఠా తగాదాగానే చూడ్డానికి లేదు.  దేశ రాజకీయాలు వేగంగా కొత్త దశలోకి చేరుకుంటున్నాయనడానికి ఇది గుర్తు. ఫాసిస్టు పాలనలో దేశమంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయి, అనేక మంది జైళ్లపాలై, అనేక మంది అనర్హతలను, నిషేధాలను, అణచివేతలను ఎదుర్కొంటున్న సందర్భంలో పాలక పార్టీ నాయకుడైన రాహుల్‌గాంధీకి కూడా అలాంటి అనుభవమే కలిగింది.  ఫాసిజానికి వ్యతిరేకంగా దేశమంతా  నిరసనలు, ఉద్యమాలు పదునెక్కుతున్న తరుణంలో రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అనేవి ప్రజా క్షేత్రంలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫాసిజం పాలకశక్తులను కూడా
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

            మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం
కవిత్వం

రణం దిక్కైనోళ్ళు!!

తలమీది నీడను త్యాగం చేసుడు తమవల్ల కాదని తెల చెప్పినోళ్ళు కాళ్ళ కింది నేల కడుపాకలి తీర్చే వొనరది మాకు వొదలమన్నోళ్ళు రిజర్వాయరు రక్కసి కోరని ఎరుగక జిక్కి అల్లాడెటోళ్ళు యాడాది పైనాయె ఎద బాదుకుంటు మొరల్ బెట్టి బెట్టి మోసపొయ్నోళ్ళు దొంగలోలె పట్టి టేషన్లకు దెచ్చి బైండోర్లు జేసెనే దొరోల్ల రాజ్యం ఇంత కెవరీళ్ళో సెప్పనైతి నేను ఎత్తిపోతల కత్తి ఎదలోకి దిగిన సిన్నోని పల్లెంట బతుకగ్గి పాలై బజారు పడిన పల్లె రైతులీళ్ళు ఎట్లైతె అట్లాయె ఇట్లైతె కాదంటు లీడర్ల రంగెరిగి రణం దిక్కైన్నోళ్ళు.
వ్యాసాలు

కార్పొరేటీకరణ, సైనికీకరణ – హక్కుల ఉల్లంఘన 

మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు సహితం విమానాలలో ప్రయాణించే స్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని ఈ రోజు పత్రికలలో ఒక వార్త వచ్చింది. అదేమేరకు నిజమో మీకూ, నాకూ అందరికీ తెలుసు. విమాన ప్రయాణం మాటేమోగాని తమపై కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తున్నదని, వాటిని ఆపమని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. . మనందరం దీన్ని పట్టించుకోవాలి. వాళ్లతో గొంతెత్తి అరవాలి. ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్త్రం బీజాపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 1, 2 వ తేదీలలో జరిగిన ఘటనను మీకు వివరిస్తాను. ఈ ఘటన చెబితే దీని ద్వారా
సమీక్షలు

బహిరంగ ప్రకటనే రాజ్య ధిక్కారం

రాజకీయ, నైతిక, మత, కళా సాహిత్య రంగాలలో ఆనాటికి ప్రబలంగా వుండిన అభి ప్రాయాలను ధిక్కరించేదెవరు? తన అత్మను తాకట్టు పెట్టని వాడే ధిక్కారి కాగలడు.                                                                                                - జార్జి ఆర్వెల్    అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. లోపల దాగిన సంవేదనలు, వినిపించాలనిసమాయత్తమవుతున్నాడు .గడ్డకట్టిన మనుషుల మధ్య సమస్త భూగోళాన్ని అరచేతిలో ఇముడ్చుకొని తనలో గూడు కట్టుకున్న అపరిచితతత్వాన్ని వ్యక్తీకరించాలనుకున్నాడు . ఇప్పుడేది రహస్యం కాదు అనే కవిత్వ సంపుటికి కొనసాగింపుగా  బహిరంగ ప్రకటన చేస్తున్నాడు . దేశం వినడానికి సమాయత్తమవుతోంది. మనుషులు తమ దైనందిక జీవితంలో  కిటికీ తెరిసినట్లు అతని కవిత్వాన్ని ఆలకించండి.  నాలిక పొడారిన తర్వాతనయినా సంభాషణ మొదలు
కథలు

పేగుబంధం

'కన్న కొడుకునే చంపేందుకు ఎందుకు తెగబడ్డావు?' గురిపెట్టిన తుపాకీలా తన కళ్లలోకే చూస్తున్నపోలీసు అధికారి ముఖం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా భగభగమండిపోతోంది. మండే సూర్యుడి దిక్కు నిలువలేక వాడిన గడ్డిపువ్వులా ఆ తల్లి నేలచూపు చూసింది. 'నిన్నే అడిగేది?' అంటూ పోలీస్‌ ఆవేశం గదులు ప్రతిధ్వనించింది. పులి గర్జనకు లేడి భయంతో చెంగుచెంగున ఉరికినట్టే.. అధికారి ఆవేశానికి తిరుపత్త గజగజా వణికిపోతూ నాలుగడుగుల వెనక్కి వేసింది. ఏదో మాట్లాడాలని నోరు విప్పబోతోంది. మనసులోని మాటను బయటపెట్టడానికి ఆగిపోతోంది. ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తోచక ఆమె సతమతవుతోంది. ఒకవైపు భయం వణికిస్తోంది. గుండె వేగం పెరిగిపోతోంది. చెమటలు
వ్యాసాలు

నిబద్ధ విమర్శకుడు కెవిఆర్

కెవిఆర్‍గా నిలిచి పోగోరిన కనుపూరు వెంకట రమణారెడ్డి కవి, విమర్శకుడు, నాటక కర్త, విరసం వ్యవస్థాపక కార్యదర్శి, పత్రికా సంపాదకుడు, అధ్యాపకుడు. మార్క్సిస్టు దృక్పద భూమికతో ఒక రచనను రచయితని అంచనా వేసే పద్ధతికి కె.వి.ఆర్ రచనలన్నీ తార్కానాలుగా నిలుస్తాయి . తెలుగులో వ్యాసం రాసినా, గ్రంథం రాసి నా, ఒక రచన వెలువడిన కాలం దాని ముందు వెనుకలు, సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య పరిణామాలు, రచయిత దృక్పథం ,సాహిత్య తత్వం వంటి అంశాలతో ముడిపెట్టి సమగ్ర దృష్టితో విమర్శ చేసిన వారు కెవిఆర్. మహోదయం, కవి కోకిల, జగన్నాథ రథచక్రాలు, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర వంటివి
నివేదిక

కోల్హాన్ యుద్ధ నివేదిక

జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్‌) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు. ఆ తరువాత,
కథనం

విప్లవానికి వెలుగునిచ్చే అమ్మ ప్రేమ…

‌‌నవ మాసాలు మోసి   జన్మనిచ్చిన పిల్లలపై  ఏ అమ్మకు ప్రేమ ఉండదు!? స్వచ్ఛమైన అమ్మ ప్రేమని దేనితో వెలకట్టగలం? అమ్మ తన రక్తమాంసాలతో పుట్టిన పసికందును కంటికి రెప్పలా కాపాడుతుంది. చందమామను చూపిస్తూ ఆప్యాయత, అనురాగాలనే గోరుముద్దలుగా తినిపిస్తుంది. తొస్సుబోయే పసినాటి చిలిపి పలుకులకు మాటవుతుంది. బుడి, బుడి తప్పటడుగులకు నడకవుతుంది. ఈసమెత్తు కల్లాకపటం తెలియని మమకారాన్నందిస్తుంది. ఎవ్వరికీ తలొంచని తెగువ, ధైర్యాన్నిస్తుంది. ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బతుకు బండి లాగుతుంది. పిల్లలు పెరిగి ప్రయోజకులైనప్పుడు ప్రపంచాన్నే జయించానని సంబరపడిపోతుంది. వారు సమాజమే హర్షించదగ్గ పిల్లలుగా పరివర్తన చెందినప్పుడు 'నింగి-నేలా నాదే ' అన్న పరిపూర్ణ విశ్వాసంతో
కవిత్వం

మహమూద్ కవితలు రెండు

స్వప్న స్పర్శ ------------ భూగ్రహం మీద ఉల్కల వంటి వారు మట్టితో కలిసి చిగుళ్ళకు ప్రాణం పోసే ఉల్కలు అరణ్యంలో పిట్టలకు కాంతిని ఆయుధంగా ఇస్తారు అవి అడవిని కాపలా కాస్తుంటాయి తమ నీడలని రాత్రింబవళ్ళకి రెక్కలు గా తొడిగి 1. సముద్రపుటలల మీంచి జారే సూర్యరశ్మి లాంటి పారదర్శక జీవితాలవి తమతో తాము పోరాడుతూనే చుట్టూ పరిసరాల్తో తీరని సంఘర్షణలో మునిగి ఉంటాయి గాయమయమౌతూనో, గానమయమౌతూనో, 2. లేత కాంతికి బట్టలుగా తొడిగినట్టు నిండైన దృష్టి ఆదివాసి ఊదే బూరలాంటి స్పష్టాతిషైపష్టమైన కంఠస్వరం ఖంగున మ్రోగే మాట వినగానే మెదడులో రూపం ప్రసారమయేంత తాజా ఉద్యమ ప్రతిబింబాలు