వ్యాసాలు

దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు

విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
Stories

Oral Historians

The students of ‘Comrades Devaraj - Ajita Political School’ got up for their lunch and filed out of the class tent. As soon as ‘MoPos’ guruji Chaitey came out of the tent, Swaroopa who was sitting on a stone nearby got up with the shout ‘Lal Salaaam didee (red salute comrade)’,  shook her hands with her and hugged her. Smiling happily in return, Chaitey asked, “When did you arrive? You
నివేదిక

అడవిని నరికితే మాకు తిండి ఎలా?

హస్‌దేవ్‌ క్షేత్ర స్థాయి నివేదిక  “వాళ్ళు మెల్లమెల్లగా అడవి మొత్తాన్ని నరికివేస్తే, మేం ఎక్కడికి వెళ్తాం? సంపాదన ఎలా? ఏం తింటాం?” తమ అడవిని కాపాడాలంటూ హరిహరపూర్‌లో ఎంతో కాలంగా జరుగుతున్న నిరసనలో పాల్గొంటున్న హస్‌దేవ్ అరణ్యలోని  ఫతేపూర్‌ గ్రామ నివాసి సంత్‌రా బాయి వేదన ఇది. నగరాల్లో వెలుగునింపడానికి ఆదివాసీల హృదయాలు నివసించే గ్రామాలను నాశనం చేస్తున్నారనేదే సంత్‌రా బాయిని వేధిస్తున్న తీవ్ర  ఆందోళన. వాస్తవానికి, 170,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న హస్‌దేవ్ అడవిపైన కార్పోరేట్ చాలా కాలంగా కన్నేసింది. అందులో రెండున్నర లక్షల చెట్లను నరికాల్సి ఉంది. వాటిలో కొన్నింటిని యిప్పటికే నరికేసారు. డిసెంబరులో చలిగాలులు
వ్యాసాలు

ఉమ్మడి వారసత్వ ప్రదేశాలు – మతపరమైన ఎజెండాలు

1992 డిసెంబరు 6న భారతదేశంలోని వారసత్వ ప్రదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత దాడి జరిగింది. ఈ దాడి రాజ్యమూ దాని బలగాల సమక్షంలో జరిగింది. రాముడి విగ్రహాలను బయటకు తీసి తాత్కాలిక ఆలయంలో ఉంచారు. ఇప్పుడు రామమందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. కానీ అందులో మరో రాముడి విగ్రహం ఉంటుంది. లౌకిక  దేశానికి చెందిన ప్రధాని ఆలయ ప్రారంభోత్సవం పేరుతో భారత్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు 50 దేశాల్లోనూ ఆసక్తిని పెంచుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున దీపావళిని జరుపుకోవాలని, తమ నగరం లేదా గ్రామంలోని దేవాలయాలలో కార్యక్రమాలు నిర్వహించాలని సంఘ్ పరివార్ సభ్యులందరూ ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర ఎజెండాను
పత్రికా ప్రకటనలు

శిశువును చంపిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ముత్వెండి గ్రామంలో 2024 జనవరి 1న మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో 6 నెలల పసికందు మృతి చెందిందని మూల్‌వాసి బచావో మంచ్ (బస్తర్) చేసిన విజ్ఞప్తి మా దృష్టికి వచ్చింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లోనే మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్‌ అంటుంటే, మావోయిస్టులతో ఎలాంటి ఎన్‌కౌంటర్‌ ఘటన జరగలేదని మృతి చెందిన చిన్నారి తండ్రి సోది ఆరోపించారు. ఓ హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన బిడ్డకు ఆహారం పెడుతున్న మస్సీ వడ్డెపై అడవి నుంచి వచ్చిన భద్రతా బలగాలు విచక్షణారహితంగా కాల్పులు
నివేదిక

మైనింగ్ కోసం పసికందును చంపేస్తారా ? కార్పొరేటీకరణ,  సైనికీకరణ వ్యతిరేక వేదిక నిరసన సభ

బీహార్‌లోని కైమూర్‌లో పులుల అభయారణ్యం  ఏర్పాటుచేయాలనే సాకుతో  ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ లో  ఆదివాసీ రైతుల భూమిలో చెట్లు నరికివేయడానికి, భూసేకరణకు, వ్యతిరేకంగా 2024 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 6 నెలల పసికందు హత్యకు వ్యతిరేకంగా 2024 జనవరి 10న, కార్పొరేటీకరణ-సైనికీకరణ వ్యతిరేక వేదిక (ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్‌ఎసిఎఎమ్), ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్ ఫ్యాకల్టీలో నిరసన సభను నిర్వహించింది. వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలలో కార్పొరేట్ దోపిడిని మరింత తీవ్రతరం చేయడం కోసం, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో అనేక పారామిలిటరీ క్యాంపులను  ఏర్పాటు చేసి వేలాది బలగాలను
సమీక్షలు

అంతర్జాతీయ రియలిస్టిక్ సినిమా

 “విభిన్న భాషల, జాతుల ప్రజలను చైతన్య పరచడానికి సినిమాను మించిన కళారూపం మరొకటి లేదు “ అన్న లెనిన్ అభిప్రాయానికి అనువుగా వివిధ  ప్రాంతాలకు చెందిన 29 సమాంతర, ప్రత్యామ్నాయ సినిమాల గురించి ఎంతో ప్రేమతో, గొప్ప అవగాహనతో, ఒక మంచి అభిరుచితో, ఒక ప్రత్యేకమైన లోచూపుతో, రచయిత్రి శివలక్ష్మి గారు  పంచుతున్నసినీ  విజ్ఞాన చంద్రికలు  ఈ అంతర్జాతీయ సినిమాల గురించిన వ్యాసాలు. మాతృక, మహిళా మార్గం, అరుణ తార పత్రికలు; విహంగ, సారంగ, కొలిమి, వసంత మేఘం వంటి  అంతర్జాల పత్రికలలో  ప్రచురించిన సినీ సమీక్షల సంకలనం ఈ పుస్తకం. విఖ్యాత రచయిత  వరవరరావు గారు సినిమాలలో
కవిత్వం

నా క్యాలెండర్

ఇంట్లో క్యాలెండర్ లేదు పొడిచే పొద్దు నడి నెత్తిన పొద్దు కుంగిన పొద్దు ఇదే నా లెక్క ఇదే నా రోజు కూసే కోడి నా అలారం మొరిగే కుక్క నా అప్రమత్తత కి ఆధారం నిప్పు ఇచ్చే పొరుగు లేదు సూరీడు తొలి కిరణం గుడిసె తాటాకు లోనుండి నా ముఖం పై నా మేలు కొలుపు భుజాన కాడి ముందు నడిచే ఎద్దులు నేల దున్న నడక కాళ్లకు చెప్పులు లేవు పల్లేర్లు పక్కకి నా పై దయతో సాగే అరక నేల నాది తరాలుగా అడవి నాది దుంప నాది పండు నాది తేనె
కవిత్వం

ఉత్తేజమై  వికసించు

నువ్వు అలవోకగా నడుస్తున్నప్పుడో బండి నడుపుతున్నప్పుడో నీ వెనకాలో నీ పక్కనుండో ఒక బుల్డోజర్ వచ్చి గుద్దితే నువ్వు ఆశ్చర్యపోనక్కర్లేదు నువ్వు కుర్చీ వేసుకొని ప్రశాంతంగా చదువుతున్నప్పుడో పరధ్యానంగా పడుకున్నప్పుడో నీపై ఎం ఐ ఏ దాడులు జరిగితే నీవు బెదిరిపోనక్కర్లేదు వాడు నిన్ను జైలుకు ఇడ్చికెళ్ళినప్పుడో నాలుగు గోడల మధ్య నిన్ను బందీ చేసినప్పుడో ఉచ్ఛ్వాస నిశ్వాసలకి తావివ్వనప్పుడో నీవు అలసిపొనక్కర్లేదు కొన్ని పుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం తిసేసినప్పుడో మత గ్రంథాలను ప్రబోధించినప్పుడో రాయిని సైతం దేవుణ్ణి చేసి నిన్ను మైలపరిచినప్పుడో నువ్వు కృంగిపోనక్కర్లేదు సలసలా కాగే నెత్తురు నీ గుండెల్లో ఇంకా పచ్చిగానే పారుతుంది నిజాల