ఆర్ధికం

‘వికసిత భారత్‌’ ఓ ప్రహసనం

భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంటరీ ఎన్నికల ప్రణాళికలో ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌’ అన్న నినాదం ఇచ్చింది. దానికి మార్గం ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అని ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే రాజకీయాల్లో ‘అచ్చేదిన్‌ ఆనే వాలేహై’ అనేది బిజెపి నినాదం. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో బిజెపి విడుదల చేసిన గంభీరమైన వాగ్దానాలను అమలుచేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అన్ని వాగ్దానాల గాలి మాటలు గాలి మాటలుగానే మిగిలాయి. మోడీ అమలులోకి తెచ్చిన పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) భారతదేశ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేశాయి. మోడీ
వ్యాసాలు

బిల్కిస్ బానో తీర్పు: ఎక్కువ  ఉపశమనం, కొంచెం భరోసా

అత్యంత దారుణమైన వార్తలు, భయానక, దిగ్భ్రాంతికరమైన న్యాయ నిర్ణయాలు, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత, అధికారిక ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు, ప్రమాదాల తుఫాను మధ్య జనవరి 8, సోమవారం నాడు సుప్రీం కోర్టు నిర్ణయం చాలా వరకు ఉపశమనం కలిగించింది. కొంత వరకు భరోసానిస్తుంది. జస్టిస్ బిబి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 75వ స్వాతంత్య్ర  వార్షికోత్సవం సందర్భంగా మోడీ కేంద్ర , గుజరాత్ ప్రభుత్వాలు శాంతిభద్రతలతోనే కాకుండా మానవీయతకు చేసిన అత్యంత ఘోరమైన దుష్ప్రవర్తనను రద్దు చేసింది. 2002లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ మారణకాండ సందర్భంగా బిల్కిస్
సంపాదకీయం

ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం

విప్లవ రచయితల సంఘం 29వ మహా సభలు27 , 28 జనవరి 2024 , సిద్ధార్థ అకాడమీ , విజయవాడ విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహా సభల ఇతివృత్తం ‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’. విప్లవోద్యమ మేధో, సాంస్కృతిక కంఠస్వరమైన విరసం ఆశయం ప్రజా జీవితంలోని సంక్షోభాలను విశ్లేషించడం. వాటికి ఉండగల పరిష్కారాలను ఎత్తి చూపడం. ఈ పని ఫాసిజం చెలరేగిపోతున్న సమయంలో మరింత సునిశితంగా చేయవలసి ఉన్నది. దేనికంటే మన సామాజిక సాంస్కృతిక జీవితం  చాలా జటిలంగా మారిపోతున్నది. వ్యక్తిగత, బహిరంగ జీవితాలు కల్లోలభరితంగా తయారయ్యాయి. ఆధునిక ప్రజాస్వామిక విలువలు సంక్షోభంలో పడిపోయాయి. మానవ సంబంధాల్లో
వ్యాసాలు

పసి పాపల నిదుర కనులపై ముసిరిన యుద్ధోన్మాదం ఎంతో..

పాలస్తీనా స్వేచ్ఛాకాంక్షపై జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లల మరణాలు ప్రపంచ మానవాళిని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా నెత్తురు ప్రవహించాల్సిందే. చరిత్ర పొడవునా రాజకీయాల కొనసాగింపుగా సాగిన యుద్ధాలన్నీ తీవ్రమైన విధ్వంసానికి, విషాదానికి కారణమయ్యాయి. ఏ నేల మీది జరిగే యుద్ధాలకైనా దురాక్రమణే లక్ష్యం. అది పాలస్తీనాలో ఒక రకంగా ఉండొచ్చు. కశ్మీర్‌లో ఇంకోలా ఉండొచ్చు. దేశం మధ్యలోని దండకారణ్యంలో మరోలా ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే దురాక్రమణ కోసం సాగే యుద్ధాలు పిల్లలను బలి తీసుకుంటాయి. పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం అనుభవిస్తున్న అనంతమైన దు:ఖం దండకారణ్యాన్ని కూడా
కవిత్వం

నాలుగు పిట్టలు

వస్తూ వస్తూ నీ ఇంటి బయట ఓ చెట్టు నాటి వచ్చాను నాది కాకపోయినా ఏదో ఒక నీడ నీకుండాలని * పని నీ కోసమే చేస్తున్న వాడిని పనిలోపడి నన్ను మరిచిపోకు అంటావు ** బతుకు తరిమితే వలస వచ్చాను ప్రేమ పిలిస్తే తిరిగి వెళ్ళిపోతాను * చెమట చుక్క నుదుటి నుండి టప్పున జారిపడినప్పుడంతా నీ గుండె ముక్కలైందేమో అని భయపడతాను * ఎలా నిజం అవుతాయి స్వప్నాలు దిండు కింద పడి నలిగిపోతుంటే * పర్లేదు ఖాళిగానే ముగిసిపోని రాత్రుళ్ళు నీ ఇంటిపని తగ్గిపోయే వరకూ * అందం గురించి దిగులుపడకు నీ లావణ్యం
సంపాదకీయం

మావోయిస్టు పార్టీ మీద నిషేధంఎందుకు ఎత్తేయాలంటే…

విష్లవ పార్టీ మీద నిషేధం తొలగించాలని కోరడం అంత మామూలు డిమాండ్‌ కాదు.  దీని చుట్టూ ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి సహజంగానే చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నిటినీ చర్చించాల్సిందే. ముందు ఆ పని చేయకపోతే నిషేధం తొలగించాలని ఎందుకు కోరుతున్నామో చెప్పలేం. మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఎత్తేయాలనే మాట 2004 తర్వాత మళ్లీ ఇవ్చుడే వినిపిస్తోంది. ఇంత నుదీర్ఘకాలం ప్రస్తావనలో లేకపోవడం వల్ల ఈ డిమాండ్‌ చాలా కొత్తగా ఉన్నది. ఎంతగానంటే మావోయిస్టుల మీది నిషేధం మామూలే కదా! అని సమాజం చాలా వరకు కన్విన్స్‌ అయిపోయింది. చర్చ లేకుండా, చర్చించాల్సిన విషయం కాకుండాపోయి, దాని
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం
Stories

Little Red Guards

The winter sun is sleeping warmly cuddled up inside his quilt and throwing tantrums to get up. Just like the ashram children who were sleeping in two distinct rows of girls and boys, he tossed and turned and by the time he slowly and finally left his quilt it was already six a.m. Twelve year old Maini hurriedly folded the bed sheets she had used to spread on the jilli
వ్యాసాలు

చదువులు ఎలా ఉండాలి? చదువుల సారం ఏమిటి?

(త్వరలో విడుదల కానున్న కొకు నవల చదువు పునర్ముద్రణకు రాసిన ముందుమాట) కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన నవలలో ఒక పెద్ద నవల చదువు. ఇది 1950లో మొదటిసారిగా అచ్చు అయింది. అప్పటి నుండి ఇది అనేక పర్యాయాలు పునర్ముద్రణ పొందింది. సహజంగానే చదువు అనే టైటిల్‌ ఆ నవలకు ఉండడంతో ఇది ఆనాటి విద్యా విధానానికి సంబంధించిన నవల అని చాలా మంది అనుకోవడం కద్దు. కానీ ఇది చదువులకు మాత్రమే పరిమితమైన నవల కాదు. 1915 నుంచి 1935 వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలపు ఆంధ్రదేశ సాంఘిక చరిత్ర చిత్రణ ఈ నవలలో
పత్రికా ప్రకటనలు

మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి

(మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి, తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌-1992ను రద్దు చేయాలి అనే డిమాండ్ల మీద డిసెంబర్‌ 30 శనివారం హైదరాబాదులో ఉదయం 10.30 నుంచి సాయంకాలం 5 గంటల దాకా విరసం నిర్వహించిన   రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నోట్‌) ప్రజాస్వామ్యం అంటేనే వేర్వేరు రాజకీయాల మధ్య సంభాషణ. ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకోవడం.  వ్యక్తిగతంగా తమ అభివృద్ధికి, ప్రగతికి ఏ రాజకీయాలు కావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండటం. పార్టీలుగా, సంస్థలుగా సంఘటితమై వాటిని ఆచరించడం. మొత్తంగానే సమాజ వికాసానికి ఏ రాజకీయాలు దోహదం చేస్తాయో  నిరంతర చర్చ కొనసాగడం.