సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.
కొత్త పుస్తకం సమీక్షలు

రంగులన్నీ  సమానమే  యింద్రధనుస్సులో

లింగభేదం యింద్రధనుస్సు లో రంగుల మధ్య భేదం లాంటిది. నేను వొక రంగును కరెక్టు గా గుర్తు పట్టానా లేదా అన్నది అసలు సమస్యే కాదు. అన్ని రంగులకీ సమానమైన విలువ యివ్వడం - ప్రతి రంగుకీ సమాన హోదాలో గుర్తించబడే అవకాశం వుండటం అదీ ముఖ్యమైన విషయం. జన్యుపరంగా, లింగ అభివ్యక్తిపరంగా, లైంగిక గుర్తింపుపరంగా  యే విధమైన లక్షణాలు వున్నప్పటికీ సమానంగా గుర్తించబడే హక్కు ప్రతి వ్యక్తికి వుండాలి. విరసం ప్రచురించిన బిట్టూ కె. ఆర్. రచించిన పి.వరలక్ష్మి గారు అనువదించిన “రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు”  పుస్తకాన్ని చూసినప్పుడు “ట్రాన్స్ జెండర్ అనేది కేవలం వొక
నివాళి

ప్రముఖ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావుకు విరసం నివాళి

సీనియర్‌ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావు ఫిబ్రవరి 6న చనిపోయారు. ఆయన తెలుగు కథా చరిత్రలో గుర్తు పెట్టుకోదగిన రచయిత. మూడు తరాల కథా వికాసం ఆయనలో కనిపిస్తుంది. 1950లలో ఆయన కథా రచన ఆరంభించారు. ఆ రోజుల్లో ని చాలా మంది కథకుల్లాగే ఆయనా మధ్య తరగతి జీవిత ఇతివృత్తం ప్రధానంగా రాశారు. సహజంగానే కోస్తా ప్రాంత సాంస్కృతిక ముద్ర ఆయన కథల్లో కనిపిస్తుంది. మానవ జీవిత సంఘర్షణను, వైచిత్రిని నిశితంగా చూసి రాశారు. చాలా మామూలు కథన శైలితో సాగే ఆయన కథల్లో ఇప్పటికీ మిగిలి ఉండేది ఆయన పరిశీలనాశక్తి, అందులోని విమర్శనాత్మకత.             కొన్ని
వ్యాసాలు

సృజనాత్మక విమర్శ

‘సాహిత్య విలోచన’ మెదడుకు మేత పెట్టగల శీర్షిక.  ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాహిత్య విమర్శ తత్వాన్ని వెలికి తీసి చారిత్రక సైద్ధాంతిక దృక్పథంతో, నిర్మాణాత్మక పరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని పాఠకులకు అనిపించేలా వి. చెంచయ్యగారు  తన వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టారు.  నిజంగానే ఇది సాహిత్యం గురించి, సాహిత్య విమర్శ గురించి  విస్తృతమైన రాజకీయ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రశ్నలను, సమాధానాలను అందించింది. ఇందులోని ప్రతి వ్యాసం అలాంటి అనేక  వాదనలు, మేధో చర్చలను రేకెత్తిస్తుంది.             ఈ వ్యాసాలు కేవలం సాహిత్య విమర్శ వ్యాసాలే కాదు. విమర్శకుడి వ్యక్తిత్వమూ, అతని విమర్శ
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ
వ్యాసాలు

హస్ దేవ్ సందేశం ఏమిటి?

హస్ దేవ్ నిరవధిక  పోరాటానికి ఏడాది అయిన సందర్భంగా   13, ఫిబ్రవరి 2023 న సర్గుజ జిల్లా హరిహరపురంలో జరిగిన ధర్నాకు దేశ వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.   విద్యార్థి, రైతాంగ, యువజన, మేధావులు నలుమూలల నుండి రావడం ఒక  అద్భుతం.   . దేశ వ్యాప్త సమర్ధనతో ధర్నా విజయవంతం కావడం పోరాడితే పోయేదేమీ లేదు మన పై హింస తప్ప అని మరోసారి రుజువు చేసింది. అలాగే ధర్నా స్థలి నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో జరుగుతున్న ఏరియల్ బాంబింగ్ ను ఆపేయాల్సిందిగా తీర్మానం చేస్తూ అక్కడ ఎంతో ధైర్యంగా పోరాడుతున్న ప్రజలకు
పత్రికా ప్రకటనలు

బిబిసి డాక్యుమెంటరీ”ఇండియా:ది మోదీ క్వశ్చన్” ప్రసార నిషేధంపై ఖండన

కన్నడ మేధావులు 522  మంది విడుదల చేసిన ప్రకటన మేము, భారతదేశ శాస్త్రవే త్తలం,  అధ్యాపకులం ”ఇండియా:ది మోదీ క్వశ్చన్”  బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాల ప్రసార నిలుపుదల పట్ల తీవ్ర విషాదానికి గురయ్యాం. ఆ డాక్యుమెంటరీ “భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రత” కు భంగకరమనే సాకుతో దాన్ని సామాజిక మాధ్యమాల నుండి తొలగించారు. ఈ సమర్థన పరిశీలనకు నిలబడదు. మీ తొలగింపు , మన సమాజానికి,  ప్రభుత్వానికి  సంబంధించిన  ముఖ్యసమాచారాన్ని దేశ ప్రజల  తెలుసుకొనే హక్కును కాలరాస్తుoది. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆ డాక్యుమెంటరీ  ప్రదర్శనను అడ్డుకొనే ప్రయత్నం జేసాయి. ఇది అకడమిక్  స్వేచ్ఛను    ఉల్లంఘించడమే అవుతుంది. విశ్వవిద్యాలయాలు
కవిత్వం

‘గోడలకు నోళ్లున్నాయి’

(కోవిడ్ కాలంలో రాజకీయ ఖైదీ హేమంత్ రాసిన కవిత. కోవిడ్ తగ్గిందేమో గాని ఈ కవితలోని రాజకీయ ప్రాసంగికత అలాగే ఉంది. - వసంత మేఘం టీం ) మా పిల్లల వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపావు మోడీజీ అని అడుగుతున్నాయి ఆ గోడలు ఏడ్వడానికి, నవ్వడానికి, పాలు తాగడానికి, ఆహారం తీసుకోవడానికి తప్ప అడగడానికి నోరులేని ఆ పిల్లల ఆక్రందనలు ఆ పోస్టర్లు మా ప్రాణౌషధాలు సముద్రాలు ఎట్లా దాటాయని అడుగుతున్నాయి ఫ్రేజర్లు, బిల్‌గేట్స్‌, యురోపియన్‌ యూనియనూ, జర్మనీ పేటెంట్‌ హక్కుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టుమని సైనిక స్థావరాలు స్వాధీనం చేయమని కొన్ని దేశాలను అడుగుతున్నాయిగదా మరి
కరపత్రాలు

మనమంతా ఒకే గొంతుగా నినదిద్దాం

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌, చిత్తనూరులో ఏర్పరుస్తున్న ఇథనాల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలి పాదయాత్ర తేది : 11.02.2023 చిత్తనూరు నుండి  తేది : 21.02.2023 ఆత్మకూరు దాకా ప్రియమైన సోదరీ సోదరులారా ! మిత్రులారా ! జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌ వారు చిత్తనూరు శివారులో మూడు పంటలు పండే భూములలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అబద్దాలు చెబుతూ మోసపూరితంగా చిత్తనూరు, ఎక్లాస్పూర్‌, జిన్నారం గ్రామాలకు చాలాదగ్గరలో జనావాసాల నడుమ ఈ కంపెనీ పనులు శరవేగంతో నిర్వహిస్తున్నారు. వాళ్ళు తొలుత మనకు నేరేడు పండ్లతోట పెడతామని చెప్పారు. కొద్దిరోజులలోనే ఇథనాల్‌ కంపెనీ నిర్మిస్తున్నారనే
కవిత్వం

బగీచాలో పాట

ఆ పక్షి కావేరీ పుట్టిన దేశంలో రెక్కలొచ్చి జెంషడ్‌పూర్‌ జెసూట్‌ చర్చినావరించిన ఆడవిలోకెగిరిపోయింది జీసస్‌ను సిలువ వేసిన దారుల్లో దేశ దేశాల్లోనూ తిరిగింది సేవా త్యాగం నేర్చుకున్నది చైతన్యంగా మార్చుకున్నది పాడిరది.. జీవకారుణ్యం రాజ్య ధిక్కారం దాకా పోరాటమేనన్నది గాయాలకు నిట్టూర్పు మందు కాదు నిష్కృతి మందుకు అన్వేషించింది విముక్తి తత్వాన్ని గానం చేస్తూ కావేరీ ప్రవహించే దేశానికొచ్చింది పాటేనా ఎంచుకోవాల్సిన బాటకూడ ఉండాలని బాల్యంలో మనసులో ప్రవేశించిన సెలయేళ్లు ప్రవహించే దేశానికొచ్చింది హో అంటే హో అని వాళ్ల భాషలో సంభాషించింది వాళ్ల బాధల్ని పోరాటాల్ని ప్రతిఫలించింది చెట్లు నదులు అడవులు నేల విధ్వంసమయ్యే విశ్వ విపత్తు