కవిత్వం

మార్పుకై సాగిపో…

అవును రాజ్యం ఇప్పుడు బానిసత్వాన్ని కోరుకుంటుంది వర్ణ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తుంది మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ వెలికి తీస్తుంది మానవత్వాన్ని చంపుతూ మనిషిని హత్య చేస్తుంది అది కాశ్మీర్ ఫైల్స్ చూడమంటుంది కానీ గుజరాత్ ఫైల్స్ అంటే గజగజా వణుకుతూ కళ్ళెర్ర చేసి చూస్తుంది అది ఒక మతాన్ని ఒక దేవుడిని కలుపుకుపోతుంది ఈ దేశపు ముఖచిత్రంపై అది కాషాయపు జెండాను కప్పుతుంది ఒక నినాదంతో మనిషిలోని మూఢనమ్మకాన్ని బలపరుస్తుంది అది సగటు మనిషి నిత్యవసరాలను పెంచుతుంది రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుంది దళితులు అంటే అది శూద్రులుగా చూస్తుంది వాళ్ళను హత్యలు చేయడానికి కంకణం కట్టుకుంటుంది ప్రశ్నించే
సమీక్షలు

మొక్కవోని మార్క్సిస్టు నిబద్ధత

ఇటీవల విడుదలైన ఇక్బాల్‌ కవితా సంపుటి *కళ చెదరని స్వప్నం* కు రాసిన ముందుమాట దేశ భక్తంటే రాజ్యభక్తిగాదోయ్‌ దేశ ప్రేమంటే ప్రజపట్ల ప్రేమోయ్‌ దేశ రక్షణంటే వనరుల రక్షణే చేను మేసే కంచెల్ని కాలబెట్టు మార్క్సిస్టు కవులకు చరిత్ర పట్ల, వర్తమానం పట్ల విమర్శనాత్మక దృష్టి ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఆశావహ దృష్టి ఉంటుంది. మార్క్సిస్టు కవులు ప్రాదేశికత నుండి విశ్వజనీనత వైపు లేదా అంతర్జాతీయత వైపు పయనిస్తారు. మార్క్సిస్టు కవులది భౌతికవాద ప్రాంపచిక దృక్పథం. మనిషిని, మనిషి శ్రమను సత్యంగా గుర్తిస్తారు. మానవేతర శక్తులను తిరస్కరిస్తారు. మార్క్సిస్టు పాలకులు భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలను, ఆ వ్యవస్థల
సమీక్షలు

కష్టమైన జర్నీ

ఇటీవల విడుదలైన శ్రీరామ్ పుప్పాల దీర్ఘ కవిత 1818కు రాసిన ముందుమాట ఈ మధ్య కాలంలో అంతా బాగానే ఉంది. 'హక్కులు మనవి, హక్కుల పోరాటం వాళ్ళది' అని వాటాలు వేసుకున్నాక కులాసాగానే గడుస్తోంది. మీకు తెలియంది కాదు. 'వర్తమానం' ఎప్పుడో బహువచనంలోకి మారిపోయింది. ఇప్పుడు అనేక వర్తమానాలు. నచ్చిన, కంఫర్టబుల్ వర్తమానాన్ని ఎంచుకుంటున్నాం. ఏ మాత్రం ఇబ్బంది పెట్టని 'నైసిటీస్'ని మాట్లాడటం, రాయడం, చదవడం అలవాటు చేసుకున్నాం. నచ్చిన రంగు సన్ గ్లాసెస్ లో వెలుగును చూస్తూ, 'ఎవ్రీధింగ్ లుక్స్ ఫైన్' అని 'ఉబర్ కూల్ పోజ్'ల ఆత్రం లో ఉన్నాం. అంతా బాగానే ఉంది. సౌకర్యంగానే
సమీక్షలు

కల్లోల కాలంలో అవసరమైన సంభాషణ

విరసం 50 ఏళ్ల సందర్భంలో ఎ.కె. ప్రభాకర్ ఎడిటర్‍గా పర్స్పెక్టివ్స్ "50 ఏళ్ల విరసం: పయనం- ప్రభావం" అనే పుస్తకాన్ని 2020 లో ప్రచురించింది. ఇందులో 12 మంది వ్యాసాలు, 21 స్పందనలు కలిపి మొత్తం 33 రచనలు ఉన్నాయి. వెంటనే వీటికి ప్రతిస్పందనగా వరలక్ష్మి, పాణి రాద్దామనుకున్న రెండు వ్యాసాలు  2021, మార్చి 31న ఎన్ఐఏ చేసిన దాడిలో  పోయాయి. ఇంతమంది మిత్రులు చేసిన ఈ సంభాషణకు ప్రతిస్పందించడం విరసం బాధ్యతగా భావించి   మళ్లీ "కల్లోలకాల ప్రతినిధి- దృక్పథాల సంభాషణ" అనే సుదీర్ఘ వ్యాసాన్ని పాణి రాసాడు.   ఇటీవలే ఇది  విడుదలైంది.            పర్స్పెక్టివ్స్ ప్రచురించిన పై
వ్యాసాలు దండకారణ్య సమయం

కోత్రి వంతెన ఎవరి కోసం? 

వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం
కవిత్వం

రాలిన నక్షత్రాల సాక్షిగా
జనసముద్ర హోరు…

అకాశంలో ఐదు నక్షత్రాలు ఒకదాని తర్వాత ఒకటిగా నేల రాలిన వార్త! నన్ను శోక సముద్రాన ముంచెత్తింది! గుండె పగిలేలా ఏడ్వాలని... కానీ కంటనీరు ఎప్పుడో ఇంకిపోయింది గుండె రాయిలా మారింది! స్పందన లేనట్టు నిశబ్దం నన్ను ఆవరించింది! ఏమీ తోచక అకాశంవైపు చూశాను మేమున్నామంటూ చంద్రుడు మసకచీకటిలో తొంగిచూస్తున్నాడు! పక్కనే ధృవతార మిణుకు మిణుకుమంటుంది! అడవి మళ్లీ అంటుకున్నది అ దావానలం కోటి దీపాల వెలుగై చీకటి దారిని చీలుస్తున్నది! నరేంద్రుడు జనప్రభంజనంలో రవితేజంలా వెలుగుతున్నాడు! నిశబ్ద నిశీధి నుండి బయటపడి సముద్రంవైపు చూశాను! సముద్రంలో అల్లకల్లోలం తుఫాను గాలులు విరుచుకుపడే ఉప్పెన చెట్లు పడిపోతున్నాయి! ఇళ్లు
వ్యాసాలు

మోడీ+ అదానీ = భారత దేశం

దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం
వ్యాసాలు

ఆదాన ప్రదానాల్లో భారత్

అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..
కథలు

డిజిటల్ ప్రేమ

“వద్దు, వద్దు, మనం వర్షంలో తడవ కూడదు. అందుకే ఆ చెట్టు దగ్గరకు వెళదాం. అమ్మా పరిగెత్తు  తొందరగా” అని అలేఖిని  పరిగెత్తే లోపలే  వర్షం చుక్కలు కనికరం లేకుండా ఆమె మీద పడ్డాయి. కొన్ని నిమిషాల ఫోటో షూట్ తర్వాత, ఫోటోలు ఆమెకు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో చూసుకుంది. తల్లి కూతుళ్లు ఇద్దరూ స్థలాలను మార్చుకున్నారు. చివరగా, కొన్ని సెల్ఫీల తర్వాత, వారు సమీపంలోని షెల్టర్‌కి పరుగెత్తారు. వారు ఉత్సాహంగా ముసిముసిగా నవ్వుతూ, మంచి వాటిని ఎంచుకోవడానికి కష్ట పడ్డారు. క్లిక్ చేసిన ఫోటోలను సెలెక్ట్ చేశారు. ఎంచుకున్న వాటిని సరైన ఫిల్టర్‌, లైటింగ్, కాంట్రాస్ట్ మొదలైన
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల