పర్మిషన్ ఎవరివ్వాలి?
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరం బలంగా ముందుకొచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్షంలోని కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఇచ్చారు. కోర్టుల్లో కనీసం బూర్జువా ప్రజాస్వామ్యాన్ని అమలుచేయండి అని తమపై మోపిన కుట్ర కేసుల విచారణ సందర్భంలో విరసం తొలి కార్యదర్శి కేవీఆర్ వాదించేవారు. అలా, కాంగ్రెస్ పాలన నడిమధ్యకు వచ్చినా ప్రజాస్వామ్య భావన ఇంకా ఒక ఆకాంక్షగానే, వెయ్యి పోరాటాలు చేసైనా అందుకోవాల్సిన లక్ష్యంగానే తెలంగాణలో మిగిలి ఉంది. ప్రజాస్వామ్య భావనకు పాలకవర్గాలు ఎన్ని నగిషీలు చెక్కినా వాక్, భావ, సభా స్వాతంత్య్రం రూపంలోనే ప్రజలు ఆ భావనను అనుభవిస్తారు. కింది నుంచి ప్రజాస్వామ్యం అమలయినప్పుడు సమాన పనికి సమాన వేతనం,










