పి.ఓ.కె. లోని ఫాసిస్ట్ పాకిస్తానీ ప్రభుత్వ క్రూరమైన అణచివేతను ఖండిస్తున్నాం
పాకిస్తానీ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న ఒక భారీ నిరసన ఉద్యమంపైన 2026 జూన్ 8నాడు పాకిస్తానీ సైన్యం క్రూరమైన అణచివేతకు పాల్పడింది. ఈ ఘటనలో కనీసం 27 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల నిషేధించబడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) మద్దతుతో జరిగిన ఈ నిరసనలు, ఆకాశాన్నంటుతున్న పిండి ధరలు, పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు, తీవ్రమవుతున్న ప్రభుత్వ అణచివేత, సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కులను నిరంతరం నిరాకరించడానికి నిరసనగా వెలుగులోకి వచ్చాయి. రాబోయే ఎన్నికలలో శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ










