వేగుచుక్క
అల్లూరి సీతారామరాజు (4-7-1897 : 7-5-1924) భారత స్వాతంత్ర్య పోరాటంలో వేగుచుక్క అల్లూరి సీతారామరాజు, ఆదివాసుల గుండెల్లో ఆరని జ్యోతి అల్లూరి సీతారామరాజు. అలనాటి తెల్ల ప్రభుత్వానికి సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు, అందుకే తెలుగునాట తొలి బూటకపు ఎన్ కౌంటర్ సీతారామరాజుది. నేలతల్లి బిడ్డల విముక్తి కోసం నేలకొరిగిన వీరుడు సీతారామరాజు, అయినా చావులేని సమరశీలి సీతారామరాజు. ఇంతకీ సీతారామరాజు జీవితకాలం కేవలం ఇరవై ఏడేళ్ళు. కాని అల్లూరి ఊసులు, వాసనలు నూరేళ్ళయినా మాసిపోలేదు, మాయం కాలేదు. ఎందుకని ? అప్పుడు నా చిన్నప్పుడు రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నాజీలు నరజాతిని నెత్తురు టేరుల్లో ముంచెత్తు తున్నప్పుడు










