కథ..కథయ్యిందా!

కరువు నిజంగా పీడించేదెవరినో చెప్పిన కథ ‘కరువెవరికి’

అనంతపురం జిల్లా (రాయలసీమ) కరువు గురించి చాలా కథలే వచ్చుంటాయి.ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్నో , ప్రకృతిని సాకుగా చూపిస్తూ రాజ్యపు, దాని యంత్రాంగపు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, విషాదభరితమైన జీవితాలను చిత్రించిన కథలే అవన్నీ. ఒక  కథలో  సమాజంలోని ఒక స్తరాన్ని ( పొరను) చిత్రించడం ద్వారా సమాజాన్ని సాధారణీకరించడానికి  ఆకథలన్నీ ప్రయత్నించివుంటాయి. అయితే  ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ' కరువు ' అనే అవ్యవస్థ ఎట్లా వుంటుంది.దాని ప్రభావానికి ఆ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజలు ఎట్లా వున్నారు. ఎవరికి యేమేరకు కరువుశాకం తాకింది , లేదా ఆ వేడిని కూడా  చలికాచుకోవడానికి వాడుకునే వెసులుబాటు ఎవరికుందీ ,
సాహిత్యం కాలమ్స్ కథావరణం

” రైలు కూడా మొగోడే..అంటున్న వినోదిని కథ ‘కట్ట’ “

డాక్టర్ వినోదిని రాసిన "కట్ట" కథ అరుణతారలో 2015 జనవరిలో ప్రచురితమైంది. ఆమె రాసిన 11 కథలతో "బ్లాక్ ఇంక్" కథాసంపుటిని లిఖిత ప్రెస్ హైదరాబాద్ వారు 2015 అక్టోబర్ లో ప్రచురించారు. ప్రధాన స్రవంతి పత్రికలు అచ్చు వేయడానికి నిరాకరించిన  కథలివి.వాడల లోపలి కథలు.  అసలు కథలు ఎందుకు ప్రచురించడానికి భయపెడతాయి? కథలు ప్రచురించడంలో మొహమాటం ఏమిటి? దాపరికం ఏమిటి? నామోషీ ఏమిటి? తరతరాల సంప్రదాయ వాసనలు కొడుతున్న పత్రికల్లో పీతి వాసన గురించిన కథలంటే భయం కలగడం సహజమే.ఈనాడు మంచి రచయితలు తమ కథల్ని ప్రచురించడానికి మంచి పత్రికలను వెతుక్కోక తప్పని పరిస్థితి. పత్రికలకు మంచి
కాలమ్స్ క్యా చల్రా .?

సంస్కరించుకోకపోతే తాలీబన్లను కూడ తరిమేస్తారు

  1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా? సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి. మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ,
సంపాదకీయం

అమ్మకానికి దేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశం మీదికి కొత్త పదాన్ని, పథకాన్ని వదిలారు. దాని పేరు నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపి). జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ ప్రణాళిక. అంటే జాతీయ ఆస్తులను అమ్ముకొని ద్రవ్యంగా మార్చుకోవడం.  అబ్చే.. ఇది అమ్మేయడం కాదు. కేవలం లీజుకు ఇవ్వడమే. ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఆస్తుల మీద అధికారం, అనుభవం మాత్రమే కార్పొరేట్లకు ఉంటాయని   కేంద్ర ప్రభుత్వం అంటోంది. కొద్ది మంది మేధావులేమంటున్నారంటే..బీజేపీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థను నడపడం రాదు.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి కొద్ది మంది ఇది అసమర్థ ప్రభుత్వం.. అందుకే ఇలాంటి పనులు
కవిత్వం

కళ్ళలో ఒక నది

కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి  లోపలి మనిషి ఒక్క సారి బహిర్గత మౌతుంటాడు అంతర్ధానమౌతున్న  విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వంగా దివ్య రేఖలు అద్దుతుంటాయి  చెదిరిపోని  ఊహలు గూళ్ళను నిర్మిస్తాయి  అల్లుకున్న తపనలు చిగురులు తొడుక్కుంటాయి  ఒక దాహం నది తీర్చినట్లు ఒక ఎండని చెట్టు ఆపినట్లు కాలం దొంతరల్లో ఒక ప్రయత్నం ఎన్నో కాంతుల్ని విసురుతుంది  శ్రమ ఉదయించడం లో విజయాలు తడుతుంటాయి అక్షరాల కాంతి లో ఇలా రేపటి స్వప్నాలని నిర్మించుకుంటూ .. అడవి పూల సౌందర్యాన్ని పారే నదీ ప్రవాహాల్ని
కాలమ్స్ క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం – సొంత ఆస్తి – రాజ్యాంగ యంత్రం -2

కుటుంబంమోర్గాన్ ఈనాటి న్యూయార్కు లో నివసిస్తున్న ఇరాక్యూ ఇండియన్ల మధ్య తన జీవితంలో అధిక భాగాన్ని గడిపాడు. వారి తెగలలో ‘సెనేకా’ అనే తెగకు దత్తు పోయాడు కూడా. వారిలో ఒకవిధమైన దంపతీ వివాహ పద్దతి [ఒకభర్తా, ఒకభార్య] అమలులో వుంది. అయితే, ఈ బంధాన్ని సులువుగా తెంచేసుకోవచ్చు. దానికి ఆయన ‘జంట కుటుంబం’ అని పేరు పెట్టాడు.[జంట కుటుంబం అనేదానికి వేరే అర్ధం కూడా వుంది. అది తర్వాత చూస్తాం] వారికి కలిగిన సంతానం ఏ జంట తాలూకా పిల్లలో అందరికీ తెలుస్తుంది. అలాగే గుర్తిస్తారు కూడా. తల్లీ, తండ్రీ, కొడుకూ, కూతురూ, తోబుట్టువూ, తోడ బుట్టిన
సాహిత్యం కథలు

చంద్రిక‌

చంద్ర‌ ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు.  అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను  కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల  సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది.  తన అమ్మ,  నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది.  గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు,  ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి. ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు. చంద్ర తన ఇంటి నుండి
కాలమ్స్ ఆర్ధికం

మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

మూడు దశాబ్దాల‌ క్రితం ప్రవేశపెట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వృద్ధిని పెంచాయి కాని ఉపాధిని పెంచలేదు. సంపద పెరిగింది కాని పంపిణీ జరుగలేదు. పెట్టుబడులు పెరిగాయి కానీ అవి ఉత్పత్తి రంగంలో కాకుండా సేవా రంగాల్లోకి వెళ్లాయి. ఆర్థిక సంస్కరణల తదుపరి పలు ప్రభుత్వ రంగాల నుంచి తన వాటాను ఉపసంహరించుకుంటున్న కారణంగా ప్రభుత్వ రంగంలో ఉపాధి సన్నగిల్లింది. ఫలితంగా రిజర్వేషన్‌ సదుపాయం అట‌కెక్కింది. సామాజిక న్యాయం పాతాళానికి తోయబడింది.  మరోవైపు ప్రభుత్వమే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానాలకు ఒడిగట్టడంతో తక్కువ వేతనాలకు కార్మికులు పనిచేస్తున్నారు. దేశ ప్రగతిని మానవాభివృద్ధిలో కాకుండా ఆర్థిక వృద్ధితో అంచనా వేస్తున్నారు.
సాహిత్యం సంభాషణ

కల‌నేత‌ బతుకులు

అమ్మా నాన్న‌ల త‌ల‌పోత‌ వాటు పడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. ప్రభుత్వ ప్రచారాల్లో సర్కారు ప్రాంతంలోని ఓ జిల్లా మాది. సముద్రానికి రెండు గంటల దూరంలో ఉంటుంది.  జనాభా ఐదు వేలకు మించే (2001).పచ్చని పొలాలు గట్ల మీద వంపులు తిరిగిన తాటి కొబ్బరి చెట్లు క్షణం తీరిక లేకుండా టక టక సౌండ్‌ చేసే మగ్గాలు, వసారాల్లో ఉండే ఆసుల్సు రాట్నాలతో ఊరు ఆహ్వానం పలుకుతుంది.గ్రామంలో పెద్ద సంఖ్యలో దేవాంగ, కాపు కులాలు ఉన్నాయి. దేవాంగుల వృత్తి చేనేత. కొద్దిమంది కలంకారీ-అద్దకం పనులు చేస్తారు. కాపులు ఎక్కువ వ్యవసాయం, ఒకటి రెండు కుటుంబాలు తప్ప. గ్రామం మీద
సాహిత్యం సంభాషణ

కోబాడ్ గాంధీ సమాధానంపై మ‌నీషా అజాద్‌

కోబాద్ గాంధీ తన జైలు డైరీకి నా ప్రతిస్పందనను చదివి స్పందించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కొన్ని ఉద్యమ ప్రాథమిక సమస్యలపైన ఇది మంచి చర్చకు దారితీస్తుందనే ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించడానికి ప్రయత్నిస్తాను. జార్ఖండ్ ఉద్యమం సమస్యపై నేను తనని తప్పుగా ఉదహరించానని కోబాడ్ గాంధీ అంటున్నారు. వాస్తవానికి, నేను ఈ అంశంపై అసలు ఉదహరించదమనేదే జరగనప్పుడు, తప్పుగా ఉదహరించాననే ప్రశ్న ఎక్కడనుంచి వస్తుంది? ఆ డైరీ మీద  నాకు ఏర్పడిన అభిప్రాయాలను చెప్పాను అంతే.   కానీ ఇప్పుడు అతను రాసిన ఇతర విషయాలకు సమాధానం చెప్పే