కవి నడిచిన దారి

నా దారి పూల బాట కాదు

అసలు ఈ నడక ఎక్కడ మొదలైంది.? ఎప్పుడు మొదలైంది..? దారి ఎక్కడ మారింది...? పల్లెటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను పదోతరగతి వరకు అక్కడే పెరిగాను. స్నేహితులు, బంధువులు అంతా ఆధిపత్య కులాల వాళ్ళే, నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అదే వాతావరణంలో ఉంచింది. ఆ వయసులో ఆ ఆధిపత్య ప్రవర్తన తప్పుగా కానీ లేదా అన్యాయంగా ఎప్పుడూ అనిపించలేదు. పదోతరగతి తరవాత మొదటిసారి డిప్లొమా చదవడానికి ఊరు నుండి బయటకు వచ్చాను, అక్కడ కూడా కులం నన్ను కలుపుకుని పోయింది. అక్కడ కూడా నా చుట్టూ అదే మనుషులు చేరారు. నాలో ఉన్న
కవి నడిచిన దారి

నా అన్వేష‌ణే నా క‌విత్వం

జీవితం చాలా నేర్పిస్తుంది. పట్టుతప్పి పడిపోతున్న సమయంలో, పోరాడి పోరాడి అలసి విసిగిపోయిన సమయంలో ఏదో చిన్న ఆశ దృక్పధమై నిలబెడుతుంది. ఎత్తు పల్లాలు దాటుకుని ముళ్ళ దారుల్లో గాయాలను మాన్పుకుని ముందుకు సాగే మార్గమొకటుందని మనమూహించకుండా తారసపడే ఒకానొక సమయం పట్టి పలకరిస్తుంది. గమ్యమేదైనా ప్రస్తుతం నేను నడవాల్సిన దారిని విస్మరించకుండా అదే సమయంలో నాకు నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానమింకా వెతుకుతూనే ఉన్నాను. ఆ అన్వేషణే నా యీ కవిత్వం. 2015 లో మొదలు పెట్టిన సాహితీ ప్రయాణం 2019 లో ఏడవ రుతువుగా రూపు దిద్దుకుని దేశమంతా వాళ్ళ ఊరు నుంచి అటుగా వంగిన
కాలమ్స్ కవి నడిచిన దారి

ధ్వ‌నిలోంచి క‌వ‌నంలోకి

నాకు శబ్దం అంటే చాలా ఇష్టం. కవిత్వం కంటే మొదట బాణీలను ప్రేమించినవాడిని. ఇప్పటికీ పాటలోని కవితాత్మక వాక్యాల కంటే సంగీతమే మహా ఇష్టం.అవి నేను స్కూల్ డేస్ లో ఉన్న రోజులు. చీకట్లో వుండటాన్ని భలే ఇష్టపడే రోజులు. వీధి దీపాలు సరిగ్గా వెలగని రోడ్లను వెత్తుక్కొని మరీ ఒంటరిగా ఉండటం వల్లే నాలో పాట మొదలయ్యింది. నడవటం బాగా అలవాటు. గంటలు గంటలు నడిచే అలవాటు ఇప్పటికీ అలాగే వుంది. ఒకరకంగా ఈ ఒంటరి నడకే నన్ను బతికిస్తుంది. ఈ నడకే నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే రోజొకటి వుందని నాకూ స్పృహలోకి వచ్చింది. అలా
కాలమ్స్ కవి నడిచిన దారి

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
కాలమ్స్ కవి నడిచిన దారి

ఇది ప్ర‌యాణం..

చదువేలేని తరంలోంచి వచ్చాను. మా జేజబ్బ ఏటవతల తాండ్రపాడు. నాన్నకు చదువు లేదు. అప్పట్లో  పిలిచి కోర్టులో తోటమాలి పని ఇచ్చారు. ఆ తరువాత బిల్లజవానుగా ఉద్యోగంలో స్థిరపడ్డారు. నాకు చదువు మీదకన్నా సినిమాలు కథలమీద మోజు . అందుకే చదువు అబ్బలేదు.  కర్నూలు లో పుట్టాను.  అది 1990 కవిత్వజ్వరం బాగా పట్టుకున్న కాలం. నాకు కవులంటే పిచ్చి మోహం. వాళ్ళ ఫోటోలు తెల్లపుస్తకం లో అతికించి, ఫోటోలకింద వారి చిరునామాను, ప్రచురితమైన కవిత్వం సంకలనాల్ని రాసి దాచుకునే వాణ్ణి. ఇప్పటికీ ఆపుస్తకం ఉంది.  ఆశారాజు రాసిన రెండవపుస్తకం 'దిశ ' నాకు రంగుల సీతాకోకలా అనిపించింది.
కాలమ్స్ కవి నడిచిన దారి

నిర్వాసిత వాక్యం

"కొన్నిదారులకు అడుగుల గుర్తులని దాచే అలవాటుండదు, కొన్ని అడుగులకు దారులతో అవసరం ఉండదు."  ఈ మాటని ఎప్పుడు, ఎక్కడ విన్నానో, చదివానో కూడా గుర్తు లేదు, మర్చి పోయాను. ఇప్పుడు నేను నడిచి వచ్చిన బాట కూడా అలాంటిదే. నా పుట్టుక జరిగింది అన్నదానికి, ఒక నేను మిగిలి ఉండటం తప్ప, నేను నడిచిన భూమి, పెరిగిన ఇల్లు, చదువుకున్న బడి... ఏదీ లేదు. మా ఊరు ఇప్పుడు లేదు. ఓపెన్ కాస్ట్ మింగేసింది. ఊరు ఉండాల్సిన ప్రదేశం ఓ పెద్ద మానవ నిర్మిత లోయగా మారిపోయింది.. అభివృద్ధి  అనేది ఎంత గొప్ప పదమో అంత విషాదకరమైన మాట
కాలమ్స్ కవి నడిచిన దారి

ఒక్కడుగు

అసలింకా నడవాల్సిన దారి తెల్సిందా ? ఈలోగానే ‘నడచిన దారంటే' దేన్ని గురించి రాయమని ? ఎంతో కలసివస్తే (?) తప్ప, వయసెప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. స్థిర చరాస్థులు; వాటికోసం చేసే అప్పులూ, కట్టే వడ్డీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు; పండుగలూ, పబ్బాలూ, ఫంక్షన్లూ, దర్బార్లూ, జబ్బులూ, మందులూ, ఒకటేమిటి ? అన్నీ పెరుగుతాయి. వీటి మధ్య గడుస్తున్న కాలమే నన్ను నడిపిస్తున్న దారా ? అలా అని, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్లేదు. దారంటే; అసలేం తెలియకుండా వేసిన తొలి అడుగు. తెలిశాక ఆగలేని బ్రతుకు. ఏం ? నువ్వే ఎందుకు రాస్తావు కవిత్వం ? నిన్నే
కాలమ్స్ కవి నడిచిన దారి

మిట్టిండ్ల క‌య్య‌ల నుంచి..

బతికిన బతుకులో ప్రేమకంటే ఎక్కువ ఛీత్కారాలే మెండుగా గురైనవాడు,ఆనందం కన్నా దుఃఖాల్ని ఎక్కువగా మోసుకుని తిరిగిన వాడు,చుట్టుముట్టిన పేదరికంలో ఈదినవాడు, చదువుకోవడం ఎంతో ఇష్టం వున్నా చదువుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకపోతే దీపంపట్టి మరీ వెదికి చదువును చేతులారా పట్టుకున్నవాడు, ఈ దేశంలో ఈ మారుమూల పల్లెలో వెనకకు నెట్టివేయబడిన దళిత వాడల్లో రెండు మూడు దశాబ్దాల ముందు ఖచ్చితంగా కనిపించడం వాస్తవవమైతే,! అచ్చం అటువంటి అనుభవాల్లోంచి, అటువంటి అవమానలోంచి,అటువంటి పేదరికంలోంచి,జీవిత పోరాటంలోంచి ఇప్పటిదాకా నడిచిన పల్లిపట్టు నాగరాజుగా మీ ముందు నిలబడి నాలుగు మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన వసంత మేఘం సంపాదకులకు ధ‌న్య‌వాదాలు చెప్పుకుంటూ... నేను
కాలమ్స్ కవి నడిచిన దారి

స్వగతం

జీవితం మనది కాని దిశలో సాగుతున్నప్పుడు, అంతా నిరాకారంగా ఉంటుంది. ఆ  మలుపు దగ్గర నిలబడి మనం తీసుకునే ఒక నిర్ణయం మన భవిష్యత్ మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. అలాంటి మలుపు ఒకటి నా జీవితంలో జరిగింది. అదే ఈ రోజున నన్ను మీ ముందిలా నిలబెట్టింది. ప్రకాశం జిల్లా నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఊళ్లలో మాది ఒకఊరు. సుంకేసుల గ్రామం. మా పూర్వీకులు అక్కడే నివసించారు.ఇప్పటికి మాఅన్నలు, బాబాయిలు అక్కడే జీవనం చేస్తున్నారు. మా నాన్నని వాళ్ళ మేనమామ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పుడే తీసుకువచ్చి, కొలకలూరు బెంజిమెన్ గారి హాస్టల్లో చదివించి, రైల్వే లో