సంపాదకీయం

జూలై 4: చీకటి రోజుల వెలుగు గానం

తెలంగాణలో నిషేధాన్ని మోస్తూ ఈ జులై 4లోకి విరసం ప్రయాణిస్తోంది.   గత కొన్నేళ్లుగా తీవ్రమవుతున్న నిర్బంధం గత ఏడాది జులై నాటికే పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి ఇప్పుడది మరోసారి నిషేధంగా మారింది. ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ అనుభవం కొత్త‌దే.  కొత్త ధిక్కారమే.ప్ర‌తి అణచివేతా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది, సృజనాత్మక వెల్లువలకు దారి తీస్తుంది. ఈ విష‌యం చెప్ప‌డానికి సుదీర్ఘ గతంలోకి వెళ్లనవసరం లేదు. ఈ ఒక్క ఏడాది  ప్రజలు,  సృజనజీవులు గడించిన అనుభవాలే చాలు.  మహా మానవ విషాదంగా మారిన కొవిడ్‌  మధ్య ఈ ఏడాది గడిచిపోయింది. అది
సాహిత్యం వ్యాసాలు

ఆధునిక తెలుగు కవిత్వంలో భాష

రంగనాథాచార్యుల అభిప్రాయాలు ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన కె.కె. రంగనాథాచార్యులు (కె.కె.ఆర్‌) ప్రగతిశీల తెలుగు సాహితీ మేధావుల్లో ఒక పెద్ద తల. వృత్తిరీత్యా ఆంధ్ర సారస్వత పరిషత్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసినా, వృతినీ ప్రవృత్తినీ ఒకటిగా మలుచుకున్న నిరంతర అధ్యయన శీలి ఆయన. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. తెలుగు శాసన భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన భాషావేత్త. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న మార్పులను ఒక కంట కనిపెడుతూ ఏక కాలంలో సాహిత్య బోధకుడుగా, సాహిత్య
సాహిత్యం వ్యాసాలు

ప్ర‌కృతి, ప్ర‌జ‌ల ఎంపిక‌ – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.5వ పంచవర్ష
వ్యాసాలు సాహిత్యం

కాకోరి నుండి నక్సల్బరి దాకా ….

ఉత్తర ప్రదేశ్‌లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా  ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన 'కకోరి నుంచి నక్సల్బరి దాకా....'. శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్‌లోని
సాహిత్యం కవిత్వం

కాలం తొంగి చూస్తోంది

లిప్తలన్నిటినీ కొలిచిధాన్యపు గాజకు పోద్దాం యీ రెణ్ణెల్లలోఒక్క నీటిగింజమిగిలితే నీమీదొట్టు ఆగడానికే ముందక్కడ?జల్లలో మిగలడానికి చేపలా అవి!కారిపోయే కన్నీరేకదాచివరకుమన దోసిట్లో మిగిలింది    ***   ***    ****కాలం నిన్నూ నన్నూ గమనిస్తోంది ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కేరింతలు లేవునదుల్లో సృష్టినిమోసే జీవమూ లేదుపీక్కుతినేయగా మిగిలిన అస్తుల లెక్కనీవో, నేనో అప్పజెప్పాలి రాజూ లేడు..మంత్రీ లేడూ పూచీపడడానికిరాజ్యం పేరున సరిహద్దులు మాత్రమే వున్నాయిఅక్కడా మానవ హననమేపేరు ఎదయితేనేం?న్యాయంలేదు అడ్డుపడడానికిచట్టం పేరున సంకెలలు మాత్రమే వున్నాయిఅక్కడ నిండా మోసమే!***     ***      ***తర్కించుకొని తడిమిచూసుకుందామా కాసేపులిప్త కాలమైనా చాలులే! అగ్నిధారలై  ఏళ్లుగా కలసి ప్రవహించిన మనంఎప్పుడు  విడిపోయాం!కలవలేనన్ని పాయలుగా మత మానవులుగాస్త్రీలుగా , పురుషులుగాకులాలుగా,
సాహిత్యం వ్యాసాలు

అంబానీ రాజ్యంపై ముంబాయి విద్యుత్ కార్మికుల పోరాటం

భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది. తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పీడిత ప్రాంతాల కథ

పి.చిన్నయ్య రాసిన 'మెట్ట భూమోడు' , పీడిత ప్రాంతాల కథ.పీడిత ప్రజలవైపు నిలబడటం మనందరికీ తెలిసిన ఆదర్శభావం.ఈ కథ ఆ విలువ ను విస్తృతం చేస్తూ పీడిత ప్రాంతాల వైపు నిలబడమంటుంది.ఈ కథలో పీడిత ప్రాంతాన్ని ప్రేమించే ప్రొటాగనిస్టుది ఆ పీడిత ప్రాంతమే అయ్యుండవచ్చు.దాంతో తన ప్రాంతాన్ని తాను ప్రేమించక యేంచేస్తాడు అనుకోవచ్చు.అయితే యీ ప్రొటాగనిస్టుకు సుభిక్షమైన పచ్చని పంటలతో తులతూగే కాలువల ప్రాంతంలో స్థిరపడే, ఆస్తులు చేసుకొనే అవకాశం వచ్చినా వద్దనుకొని మెట్టభూముల్లోకి వెళ్తాడు.ఎందువల్ల?ఈ కథలోని ప్రొటాగనిస్టు టీచర్.కోదాడలో కాపురముంటూ, నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద వున్న రామచంద్రాపురం హైస్కూలు లో వుద్యోగం.ప్రజాసంఘాల వెనుక తిరిగే,
సాహిత్యం కవిత్వం

చేవ

నాకు కావాల్సిందివేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రంఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదుమూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీఎప్పుడూ వెంటాడుతుందిమట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుందిగుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులుకొరడాలై కొడుతూ ఉంటాయ్పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికిఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్ ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటేఅటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలేఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారామృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపిఒకే వేటుకు నరికారా తరవాతి విషయం తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్నకన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులువిరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు
కాలమ్స్ లోచూపు

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
కాలమ్స్ బహుజనం

‘బ్లాక్‌ ఇంక్‌’లో పిల్లల కన్నీరు

ఓ అమ్మాయి చెప్పింది, ‘మేము కన్‌వర్టెడ్‌’ అని. ‘అది కాదమ్మా! మీరు బి.సి.నా? ఎస్సీనా? ఇంకేదైనానా?’ అన్నప్పుడు, ‘నాకు తెలీదు సర్‌, మేము దేవున్ని నమ్ముకున్నం’ అంది. అప్పుడు ఆ సంభాషణను పొడిగించలేదు. క్రైస్తవానికి మారి ‘కన్‌వర్టెడ్‌’ అని పిలిపించుకున్నా కులం పేరుతో ఈసడిరపులు, కులవివక్షలు, అణచివేతలు కొనసాగుతూనే ఉంటాయి. మతం మారినందుకు కులాన్ని వదిలేసి చూడదు సమాజం.   అందుకే తమను 'అంటరాని'గా చేసిన మతం నుంచి తప్పించుకునిపోయినా సరే, ఎన్నేళ్లైనా అంటరానిగానే ఇంకా బతుకులీడుస్తున్నారు ‘కన్‌వర్టెడ్స్‌’. పైగా వెళ్ళిన మతంలోనూ అంటే క్రైస్తవ మతంలోనూ వచ్చిన కులం ఆధారంగానే సమూహాలుగా విడిపోయి ఆ మతంలోనూ ఈ కుల జాడ్యాన్ని