ఎరుకల కథలు

“మా తప్పు ఏంది సామీ ?”

“ అశోకు వచ్చిoడాడా ? వాడి  గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “  యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి  దుర్గమ్మ   గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల  సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి  కూర్చునో ,
కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
ఎరుకల కథలు

“పదకొండు నెలల జీతగాడి కత”

(ఎంత చెప్పినప్పటికీ ఎంతగా చెప్పుకున్నప్పటికీ చెప్పుకోవాల్సిన జీవితాలు కొన్ని ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అలా చీకట్లో ఉండిపోయిన జీవితాల్లోని దుఃఖాలు నవ్వులు ఉద్వేగాలు సంతోషాలు ఆ కులం వాళ్లని మాత్రమే కాదు,  మనసున్న ఎవరైనా కదిలిస్తాయి, కలవరపెడతాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి, నవ్విస్తాయి. ఆ దుఃఖ భాష తెలిసినప్పుడు, మనసుతో విన్నప్పుడు ఆ కతలను ఇంకా చదవాలనిపిస్తుంది,ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గిరిజనులు రాసిన గిరిజన జీవన వ్యథలను చదవడం ఎవరికైనా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శా వ్యాసాలు రాసే*కవి,కథకుడు,నవలాకారుడు పలమనేరు బాలాజీ (49)తన జాతి కతలను, వ్యథలను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈ సంచిక నుండే ఎరుకల